
“నెచ్చెలి”మాట
దివ్యౌషధం
-డా|| కె.గీత
ఈ ప్రపంచములో
అన్ని బాధలకు
పనికి వచ్చు
ఔషధమేమైనా
ఉన్నదా?
మతిపోయిందా?
అన్ని బాధలకు
ఒక్క
మందు
ఎలా పనిచేస్తుంది?
బహు చక్కగా
పనిచేయు
ఒక్క
ఔషధమున్నది
ఒక్క
ఉపాయమున్నది
అయితే
అదేవిటో
తమరే
విన్నవించండి
బాధకు
మందు
కనిపెట్టవలెనన్న
బాధ
ఎందుకు
వచ్చునో
తెలియవలెను
ఆగండాగండి
అర్థమైంది
బాధకి
మూలం
బుద్ధుడే
కనిపెట్టలేకపోయాడు
మనమెంత!
అక్కడికీ
వచ్చుచున్నాను
బాధ
ఎందుకు
వచ్చునో
తెలియకపోయినచో
విడిచిపెట్టవలెను
దేన్ని?
విడవాలటా?
కాస్త
వివరంగా
చెబుతారా?
బాధను
తొలగించుకొనవలెనంటే
తలపు
విడిచిపెట్టవలెను
ఏదైనను
పనిలో
పడవలెను
అదియే
అన్ని బాధలకు
దివ్యౌషధము
ఆహా!
ఏం
సెలవిచ్చారు-
పనియే
ప్రత్యక్ష
దివ్యౌషధం!
ధన్యోస్మి!!
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
మే, 2026 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: సి. రాజేశ్వరి
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ఆ కలం ఆగితే? (కథ) – అనసూయ ఉయ్యూరు
ఇరువురికీ అభినందనలు!
****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
