image_print

ఆలోచనాత్మక కథలల్లిన గొప్పరచయిత కారా మాస్టారు!

ఆలోచనాత్మక కథలల్లిన గొప్పరచయిత కారా మాస్టారు! -కొండపల్లి నీహారిణి తెలుగు సాహిత్యంలో కథాప్రక్రియకు పెద్దపీట వేసి, గొప్ప కథలను రచించిన కాళీపట్నం రామారావు గారు 2021 – జూన్ – 4వ తేదీన కన్నుమూశారు. వారికి అక్షరాంజలి ప్రకటిస్తున్నాను. “జీవితంలో సమస్యలను, ఆ సమస్యలకు కారణాలను తెలియజేసేదే మంచి కథ” అన్నారు కారా. ఉపాధ్యాయుడిగా విద్యార్థులకు ఎట్లా మాస్టారో, సాహితీవేత్తలకు ముఖ్యంగా కథా రచయితలకు కారా మాస్టారుగా అట్లే ప్రసిద్ధి. తొలికథ ‘ప్లాటుసారమో’ – చిత్రగుప్త కార్డు […]

Continue Reading
Posted On :

భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కొడాలి కమలమ్మ

భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కొడాలి కమలమ్మ -ఎన్.ఇన్నయ్య గాంధీజీ, గోరా (గోపరాజు రామచంద్రరావు)లను ఆదర్శంగా కొడాలి కమలమ్మ తన జీవితాన్ని గడిపిన స్వాతంత్య్ర సమర సైనికురాలు.  కొడాలి కమలమ్మ త్యాగమయ జీవితాన్ని గడిపారు. 1916లో గోగినేని రామకోటయ్య, వెంకాయమ్మలకు జన్మించిన కమలమ్మ మోపర్రు గ్రామవాసి. తెనాలికి సమీపంలో ఉన్న ఆ గ్రామం. ఆనాడు స్వేచ్ఛా పిపాసతో పోరాటంలోకి దిగిన ప్రాంతం. చదువుకుంటుండగా గాంధీజీ స్వాతంత్ర్య పోరాటం పట్ల ఆకర్షితురాలై, పాల్గొన్నారు. విద్య ఆట్టే సాగలేదు. హైస్కూలు […]

Continue Reading
Posted On :

ఓల్గా- ఓ బలమైన స్త్రీవాద స్వరం!! (ఓల్గా గారికి గౌరవడాక్టరేటు ప్రదానం సందర్భంగా వ్యాసం)

ఓల్గా గారికి గౌరవడాక్టరేటు ప్రదానం సందర్భంగా వ్యాసం -ఎ.రజాహుస్సేన్ (తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం గౌరవడాక్టరేటు ప్రదానం చేసిన సందర్భంగా ఓల్గా గారికి నెచ్చెలి అభినందనలు తెలియజేస్తూంది!) ఓల్గా…..ఓ బలమైన స్త్రీవాద స్వరం.,!! *తెలుగు నాట ఓల్గా ఒక ‘ ద్వంద్వ సమాసం.’ భార్యాభర్తలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు లాంటి పదాలను ఎలా విడదీయలేమో, స్త్రీవాదం ఓల్గా అనే పదాలని కూడా మనం విడదీయలేం. రెండు ఆత్మలు కలగలసిన ఏక జంటపదం ఓల్గా! రచన, ఆచరణ… ఈ రెండు ఆత్మలు’.(వంశీకృష్ణ) *కవిత్వంతో సాహిత్య ప్రస్ధానం మొదలు…వచనంతో స్థిరత్వం…!! […]

Continue Reading
Posted On :

సరస్వతి గోరా

సరస్వతి గోరా -ఎన్.ఇన్నయ్య నేను ప్రపంచంలో ముఖ్యమైన నాస్తిక కేంద్రాలను చూశాను. అమెరికా ఇంగ్లండ్ లో నాస్తి కేంద్రాల దగ్గిరకి వెళ్లాను. కాని ప్రపంచంలో ఎక్కడా కూడా విజయవాడలో ఉన్న నాస్తిక కేంద్రం వంటిది లేదు.  గోరా (గోపరాజు రామచంద్రరావు) స్థాపించిన నాస్తిక కేంద్రం విజయవాడలో ఉన్నది. ఈ కేంద్రం విశిష్ట స్థానాన్ని సంపాదించుకుని గౌరవం పొందింది. దీనికి చేయూతనిచ్చిన, అండగా నిలిచిన ప్రధాన వ్యక్తి సరస్వతి. ఈమె గోరా భార్య.  సరస్వతి 1912లో సెప్టెంబరు 28న […]

Continue Reading
Posted On :

మాలతీ చందూర్

మాలతీ చందూర్ -యామిజాల శర్వాణి 1950ల నుండి దాదాపు సుమారు మూడు దశాబ్దాల పాటు తెలుగువారికి సుపరిచితమైన పేరు శ్రీమతి మాలతి చందూర్ . ఈమె రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. మాలతీ చందూర్ కృష్ణా జిల్లా లోని నూజివీడులో 1930 లో జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు దంపతులకు జన్మించారు ఆరుగురి సంతానంలో అందరికంటే ఆమె చిన్నది.  ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే ఎస్‌ఆర్‌ఆర్‌ పాఠశాల ఉంది. 8వ తరగతి వరకు ఎస్‌ఎస్‌ఆర్‌ […]

Continue Reading
Posted On :

ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో)

ఇలాటి తాతయ్య వుంటే బావుండు! (కారా మాస్టారి స్మృతిలో) -శాంతారామ్ ఇలాటి తాతయ్య వుంటే బావుండు అనిపించేలా , తాతయ్య లేనివాళ్లకు అసూయ పుట్టించేలా కాళీపట్నం రామారావు గారి మనవడు  శాంతారామ్ గారి స్మృతులు నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాం. (సేకరణ: ఫేస్ బుక్  నుండి)    తాతగారు 4-6-2021 ఉదయం 8:20కి వెళ్ళిపోయారు. పొద్దున్నలేచి టీ తాగి అత్తతో ప్రేమగా మాట్లాడి, అత్త చేతిలో వెళ్ళిపోయారు. ఆయన వయసు 97 అయినా, తాతగారు […]

Continue Reading
Posted On :

మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం

మదర్ తెరీసా అసాధారణ వ్యక్తిత్వం -ఎన్.ఇన్నయ్య భారతదేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించి, నాయకులను నిర్బంధించిన సంవత్సరంలో, 1975 మదర్ తెరీసా హైదరాబాద్ పర్యటించారు. పబ్లిక్ గార్డెన్స్లో పిల్లల కార్యక్రమానికి వచ్చిన ఆమెను, ఆంధ్రజ్యోతి ఛీఫ్ రిపోర్టర్ గా కలసి ఇంటర్వ్యూ చేశాను. ఏది అడిగినా అంతా దైవేచ్ఛ అని సమాధానం యిచ్చిన ఆమె నుండి, ఎలాంటి ఉపయోగకర విషయం సేకరించలేక, నిరుత్సాహపడ్డాను. కనీసం ఫోటో తీసుకోలేదని తరువాత అనుకున్నాను. మెసిడోనియా దేశానికి చెందిన తెరీసా, అల్బేనియా దంపతుల […]

Continue Reading
Posted On :

అంతర్జాల పత్రికలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

అంతర్జాల పత్రికలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)  -మణి కోపల్లె నేడు ఇంటర్నెట్ అతి వేగంగా దూసుకుపోతూ  సెల్ ఫోన్ లలోనూ ఇంటర్నెట్ లభ్యమవ్వటంతో ప్రింట్ మీడియాలో వచ్చే అన్ని  పత్రికలు  నేడు ఇంటర్నెట్ లో లభిస్తున్నాయి .  అంతర్జాలం ఆవిర్భవించిన తొలినాళ్లలో  అంటే  1999 కి ముందు వున్న నెట్ ని (రీడ్ ఓన్లీ)వెబ్ 1.0 గా వర్ణించారు.  ఆ సమయంలో ప్రముఖ పత్రికలు వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే ఖతులను […]

Continue Reading
Posted On :

ప్రవాసాంధ్ర కథ- కవిత్వం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

ప్రవాసాంధ్ర కథ- కవిత్వం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం) -యామిని కొళ్లూరు ఏ రచన అయితే మనల్ని మనం సంస్కరించుకొని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగేందుకు ప్రేరణనిస్తుందో ఏ రచనను అధ్యయనం చేయడం వల్ల  సామాజిక స్పృహ , చైతన్యం మనలో అంకురిస్తాయో ఏ రచన మనలను కర్తవ్యోన్ముఖలను చేస్తుందో ఆ రచన ద్వారా వెలుగు చూసిన సాహిత్యాన్ని మంచి సాహిత్యం లేదా ఉత్తమమైన సాహిత్యం అనవచ్చు. ఒక […]

Continue Reading
Posted On :

హేమలతా లవణం

హేమలత (1932-2008) అనన్య సామాన్యకృషి -ఎన్.ఇన్నయ్య  ఆంధ్రప్రదేశ్‌లో తెంగాణాలో చిరకాలంగా ఆచరణలో వున్న దేవదాసి, జోగిని పద్ధతులను తొలగించడంలో హేమలత ఎదురీది సాధించారు. దేవుడి పేరిట అట్టడుగు వర్గాల స్త్రీలను వ్యభిచారంలోకి నెట్టిన దురాచారమే జోగిని పద్ధతి. తెలంగాణాలో నిజామాబాద్‌ జిల్లాలో నాటుకుపోయిన ఈ దురాచారం చిరకాంగా, ఎవరూ ఏమీ చేయలేక చేతులెత్తేశారు. అటువంటి దశలో హేమలత రంగప్రవేశం చేసి, ఎదురీది చాలా వరకు జోగిని దురాచారాన్ని ఆపించగలిగింది. హేమలత సుప్రసిద్ధ కవి గుర్రం జాషువా కుమార్తె. […]

Continue Reading
Posted On :
karimindla

వైవిధ్యభావమాలికలు – “అమ్మ” సంగీత నృత్యరూపకాలు (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

వైవిధ్యభావమాలికలు – “అమ్మ” సంగీత నృత్యరూపకాలు అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -డా. కరిమిండ్ల లావణ్య మనిషి జీవితంలో బాల్యం అత్యంత ముఖ్యమైనదశ. ఈ దశపైనే వ్యక్తిత్వ వికాసం ఆధారపడి ఉంటుంది. అందుకు గేయ సాహిత్యం తోడ్పడుతుంది. దీనివల్ల బాలల్లో మానవ  విలువల పరిరక్షణ పెరుగుతుంది. సృజనాత్మకత పెంపొందించబడుతుంది. భావ పరిపక్వత, మనోవికాసం కలుగుతుంది. మానవత్వ వికాసమే సాహిత్యపు ప్రధాన కర్తవ్యం. గేయ సాహిత్యం సామాజిక, సాంస్కృతిక వికాసంతో పాటు శాస్త్రసాంకేతిక విజ్ఞానాలను అందించడానికి ఉపయోగపడుతుంది. ఈ గేయాల్లో బాలసాహిత్యానికి […]

Continue Reading
Posted On :
archarya

తిలక్ కథలు – చెహావ్ ప్రభావం

తిలక్ కథలు – చెహోవ్ ప్రభావం -ఆచార్య యస్. రాజేశ్వరి కన్నీటి జడులలో తడిసిన దయాపారావతాల వంటి- వెన్నెల్లో ఆడుకునే అందమైన అమ్మాయిల వంటి నిశిత పరిశీలనతో నిలిచిన మణి దీపాల వంటి- తిలక్ కథలు 20 సేకరించి 1967లో ప్రచురించారు ప్రకాశకులు. వాటికి మరి 9 కథలు కలిపి 1983 ద్వితీయ ముద్రణ వెలువరించారు. 1921లో పుట్టిన తిలక్ 11వ ఏటనే కథలు రాయడం మొదలుపెట్టాడు. తాను 1966 లో తనువు చాలించే వరకు కథలు, […]

Continue Reading
Posted On :

గోడమీద అడవి

గోడమీద అడవి -దేవనపల్లి వీణావాణి అటవీ శాఖ పనుల తనిఖీ కోసం ఈ రోజు మా బృందం ఏటూరునాగారం నుంచి గోదావరి నదికి కింది వైపు ఉన్న అడవికి వెళ్లాం. దారిలో చిన్న చిన్న గ్రామాలు. గోదావరి నదికి ఆనుకొని ఉన్న  గూడాలను 1986 ప్రాంతంలో వచ్చిన వరదల కారణంగా నదికి దూరంగా అడవిలో నివాసం కల్పించినందు వల్ల  ఈ గ్రామాలు ఏర్పడ్డాయి.  గత ముప్పై ఏళ్లుగా అడవిలో దొరికే మట్టి కర్రలను ఉపయోగించి కట్టుకున్న కుటీరాలే […]

Continue Reading
Posted On :

జానపద గేయ సాహిత్యంలో స్త్రీ వాదం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

జానపద గేయ సాహిత్యంలో స్త్రీ వాదం అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -సోనబోయిన సతీష్ జానపద విజ్ఞానాన్ని స్త్రీవాద దృక్పథంతో పరిశీలించినట్లయితే తరతరాల స్త్రీల సామాజిక ఆర్థిక పరిస్థితులే కాక పురుషాధిపత్య సమాజం స్త్రీ జీవితాన్ని ఏ విధంగా అణచివేసిందో, స్త్రీల సమస్యలు ఏ విధంగా అపరిష్కృతంగా మిగిలి పోతున్నాయో అవగతమవుతుంది. జానపద విజ్ఞానంలో జానపద సాహిత్యానిదొక పెద్ద శాఖ. మానవ సంబంధాల […]

Continue Reading
Posted On :

సుద్దాల అశోక్‌తేజ పాటలు: వస్తు, రూప పరిణామం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

సుద్దాల అశోక్‌తేజ పాటలు: వస్తు, రూప పరిణామం అత్యాధునిక తెలుగు సాహిత్యం–వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -రాఘవేందర్ రెడ్డి బెంకి పరిచయం: మానవ సమాజం ఆదిమానవుని దగ్గర మొదలుకొని నేటి ఆధునిక, అత్యాధునిక యుగం వరకూ క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ఈ పరిణామంలో ఎన్నో మార్పులను చూస్తూ వస్తుంది. ఆ మార్పులలో చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు మొదలైనవి. వాటన్నింటినీ సాహిత్యం రికార్డు చేస్తూ, విశ్లేషిస్తూ, […]

Continue Reading
Posted On :

తెలుగు పద్యకవిత్వంలో వస్తురూప పరిణామం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

 తెలుగు పద్యకవిత్వంలో వస్తురూప పరిణామం అత్యాధునిక తెలుగు సాహిత్యం-వస్తు, రూప పరిణామం (2000-2020) నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం -రోహిత్ ఆదిపూడి తెలుగు భాషాచరిత్రలో మనకు లభ్యముగా ఉన్న వాంజ్మయంలో పద్యకవిత్వం అత్యంత దృఢమైన స్థానం సంపాదించుకుంది. అతిప్రాచీన కాలం నాటినుండి, ఆదికవిగా పేరు గాంచిన నన్నయభట్టారకుని ఆంధ్రమహాభారతముతో మొదలుకొని, పోతన ఆంధ్రమహాభాగవతమూ, కవిసార్వభౌమునిగా బిరుదుగొన్న శ్రీనాథుని భీమఖండము, శృంగారనైషథము, కవిత్రయము లో చోటు సంపాదించుకొన్న తిక్కన, యెర్రాప్రగడా మహాభారత స్వేచ్ఛానువాదఘట్టములు, […]

Continue Reading
Posted On :

మణిబెన్ కారా

మణిబెన్ కారా (1905-1999) -ఎన్.ఇన్నయ్య   1905లో బొంబాయిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మణిబెన్, సెయింట్ కొలంబియా హైస్కూలులో చదివి, బర్మింగ్ హాంలో సోషల్ సైన్స్ డిప్లొమా పొందారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. బొంబాయిలో సేవామందిర్ స్థాపించి, ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు.  బొంబాయి రేవు కార్మికోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. నేత కార్మికులకు సేవ చేశారు.  బొంబాయిలో లేబర్ యూనియన్ కార్యకలాపాలలో పాల్గొని, సమ్మెలు నిర్వహించారు.  స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొంటూ విదేశీయుల సహాయం స్వీకరించే పనుల్లో పర్యటనలు […]

Continue Reading
Posted On :

సరోజినీ నాయుడు

ఉత్తమ ఉపాధ్యాయురాలు – ఆన్ సులివాన్ -శర్వాణి ఒక ఆణిముత్యాన్ని లోకానికి అందించిన ఉపాధ్యాయురాలు “ఆన్ సులివాన్”.  ఆ ఆణిముత్యం మరెవరోకాదు  ప్రపంచములో ఆత్మవిశ్వాసముతో అంగ వైకల్యాన్నిజయించి జీవించి చూపిన మహత్తర మహిళ “హెలెన్ కెల్లర్” . ఆవిడ పేరు విననివారు సామాన్యముగా వుండరు ఆవిడ  వికాలుంగుల సంక్షేమార్థము నిరంతరముశ్రమించిన మహిళా కెల్లర్. అంగవైకల్యముతో కృంగిపోయిన వారిలోఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించిన కర దీపికగా కేల్లర్ నుఅభివర్ణిస్తారు కానీ ఆశ్చర్యము ఏమిటి అంటే కెల్లర్ వంటి దీపాన్నివెలిగించిన కొవ్వొత్తి […]

Continue Reading
Posted On :