అశోక్గుంటుక జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జన్మించారు. బిఏ, బిఎడ్ పూర్తి చేశారు. 1989లో 'పల్లకి' వార పత్రికలో మొదటిసారిగా వీరి రాసిన కవిత అచ్చయింది. 1989 నుండి 1994 వరకు పలు దిన, వార పత్రికల్లో సామాజిక లేఖా రచయితగా ప్రజా సమస్యలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా 2016 నుంచి కవిత్వం తిరిగి రాయడం ప్రారంభించారు. మొత్తంగా ఇప్పటి వరకు 200లకు పైగా కవితలు, పది వరకు గేయాలు రాశారు.
రంగవల్లి -అశోక్ గుంటుక తెలుగు లోగిలి ప్రతి వాకిలి ఆనందం ఆకృతి దాల్చిన రంగవల్లి… ముగ్గునగొబ్బిపూలు ఎగురుతున్న గాలిపటాలు హరిదాసులు బసవన్నలు; ప్రతి ఇంటా పరుచుకున్న వసంతం… ప్రకృతి పల్లె చేరి పరవశం… ఆకాశం రాలిన నక్షత్రాలు.. ఆ వెంటే విరిసిన ఇంద్రధనుస్సులు… అతనొచ్చి ఓ ముగ్గు చుక్కపెట్టి సెల్ఫీ యై… అహాన్ని చల్లార్చుకున్నా ఆకాశంలో సగం అంటూ సగాన్ని మిగుల్చుకున్నా… నిజానికి ఇక్కడ అతనుశూన్యం… పండుగ వేళ – వాకిలి క్యాన్వాస్ పై తీర్చిదిద్దిన కళాకృతులు…… […]
బతుకు బీడీలు -అశోక్ గుంటుక నా పెళ్లిచూపుల్లో నాన్నకెదురైన మొదటి ప్రశ్న “అమ్మాయికి బీడీలు వచ్చు కదా ?” లోపల గుబులున్నా నేనపుడే అనుకున్నా జవాబు వారికి నచ్చేనని కట్నం తక్కువే ఐనా నేనే ఆ ఇంటి కోడలయ్యేనని………. నీటిలో తడిపి కొంచెం ఆరిన తునికాకు కట్టల్ని బీడీలు చుట్టే ఆకుగా కత్తిరించాక ఒక్కో ఆకులో కాసింత తంబాకు పోసి బీడీలుగా తాల్చి దారం చుట్టేది……. ఈ రోజుకివ్వాల్సిన వేయి బీడీల మాపుకి తక్కువైన నాలుగు కట్టల […]