మణి వడ్లమాని 2010లో కథారచన మొదలెట్టి, అనతి కాలంలోనే పాఠకుల ఆదరాభిమానాలను పొందారు. అనేక చక్కని కథలు వ్రాసి వంగూరి ఫౌండేషన్ అమెరికా, తెలంగాణ అసోసియేషన్, గో తెలుగు.కామ్ వంటి సంస్థలు నిర్వహించిన కథారచన పోటీలలో ప్రతిష్ఠాత్మకమైన బహుమతులూ, పురస్కారాలూ పొందారు. మణి వడ్లమాని తొలి నవల ‘జీవితం ఓ ప్రవాహం’ చతుర మాసపత్రికలో ప్రచురితమైంది. “వాత్సల్య గోదావరి” అనే కథాసంపుటిని వెలువరించారు. ‘కాశీపట్నం చూడర బాబు’, ‘ప్రయాణం’ వీరి ఇతర నవలలు.
నిటారు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -మణి వడ్లమాని “రండమ్మా ! రండి చూడండి, లోపలికి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి. నచ్చితేనే కొనండి. అందరూ మెచ్చే అన్ని రకాల బట్టలు ఇక్కడే ఉన్నాయి. శ్రీలీల చీరలు, రష్మిక చీరలు, అలాగే పాత సినీ తారలు అప్పట్లో వాణిశ్రీ, జయప్రద, జయసుధ, శ్రీదేవి కట్టే చీరలో మా ఒక్క షొప్ లోనే దొరుకుతాయి. తప్పకుండా దయచేయండి ” ఆకట్టుకునే ఆమె మాటల చాతుర్యం […]
కంపానియన్ (తృతీయ ప్రత్యేక సంచిక కథ) –మణి వడ్లమాని సుందరంగారు నడుచుకుంటూ వెళుతున్నారు. ఆ అడుగుల్లో తొందర, ఆత్రుత కనిపిస్తున్నాయి. చమటతో తడిసిపోతున్నారు. బస్సులో ఎలా కూర్చున్నారో తెలియదు. మొహమంతా ఆందోళన… ఆ మాట అతని నోట విన్నప్పటి నుంచి మనసంతా విషాదం… అది సహజమే కదా! లేదు… లేదు అది అనాథ అవడానికి వీలులేదు. ఏదో చెయ్యాలి. ఎలా… అదే తెలియటం లేదు. గంట ప్రయాణంలో24గంటల ఆలోచనలు చేసారు. బస్సు దిగి ఇంటికి వచ్చేసరికి చాలా […]
ముసురు –మణి వడ్లమాని వాన జల్లు పడుతూనే ఉంది. ఒక్కసారి పెద్దగా, ఒక్కోసారి చిన్నగా జల్లులు పడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా జనం,సందడిగ కోలాహలంగ ఉంది , కుర్చీలలో కూర్చొని కునికి పాట్లు పడేవారు కొందరు. పుస్తకాలు తెచ్చుకొని చదువుకునే వారు మరి కొందరు. చెవులకి హియర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ ని వింటూ ఉండేవాళ్లు ఇంకొంతమంది. మొత్తానికి ఎవరి కి వాళ్ళు యేదో రకంగా బిజీ గా ఉన్నారు. “బయట వాతావరణం బాగా […]