ఉచితం అనుచితం -ఆదూరి హైమావతి అనగా అనగా ఆనందహళ్ళి అనే గ్రామంలో అనంతమ్మ అనే ఒక పేదరాలు ఉండేది.ఆమె కుమార్తె సుమతి. ఆ ఊర్లో ఉండే సర్కార్ స్కూలు అనంతమ్మ చిమ్మేది . సుమతి ఆస్కూల్లోనే ఐదో క్లాసు చదువుతున్నది.ఆమెకు చిన్నతనంలో బురదలో జారిపడి పాదం కాస్త వంకపోయి వంకరగా నడిచేది. పేదతనం వల్ల సమయానికి వైద్యం చేయించలేకపోయింది అనంతమ్మ. సుమతి అలాగే నడుస్తుంది, బాగా చదువుతుంది. చక్కగా పద్యాలూ, పాడుతుంది. గణితంలో దిట్ట. డ్రాయింగ్ కూడా […]
అమ్మమాట -ఆదూరి హైమావతి అనగనగా ఒక చిట్టడవి. ఆడవిలో ఒక మఱ్ఱి చెట్టు క్రింద ఉన్న బొరియలో ఒక ఎలుక నివాసం ఏర్పరచు కుని జీవిస్తూ ఉండేది. దానికి కొంతకాలానికి రెండు ఎలుకలు పుట్టాయి.వాటికి రోజూ ఇంత తిండి తెచ్చి పెడుతూ పెంచసాగింది. క్రమక్రమంగా అవి పెరగ సాగాయి.బొరియలో అటూ ఇటూ పరుగెడుతూ ఆడుకో సాగాయి. ఒకరోజున ఎలుక తిండి వెతికి తేవటానికి వెళుతూ “పిల్లలూ! బయటికి వెళ్లకండి. నేనే మిమ్మల్ని బయటి కి తీసుకెళ్ళి ,ఎలా […]
గొప్పదనం -ఆదూరి హైమావతి అనగ అనగా రామాపురం అనేగ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు.అతడు తన పొలంలో వాదుకునే పరికరాలనంతా తన ఇంటిపక్కనే ఉండే రేకులషెడ్డులో ఉంచేవాడు.రామయ్యభార్య సూరమ్మకూడా తాను పెరట్లోనూ , ఇంట్ళోనూ వాడుకునే కొన్ని వస్తువులను అందుబాటూగా ఉంటాయని అక్కడేపెట్టేది. ఒకరోజున ఆమె గబగబా రేకులషెడ్డులోకి వచ్చి అక్కడ క్యాలెండర్ కు గుచ్చి ఉంచిన సూదిని తీసుకెళ్ళి ముళ్ళు గుచ్చుకుని చిరిగిన రామయ్య పంచెను కుట్టి తెచ్చి మళ్ళీ అక్కడే ఉంచ్చి వెళ్ళింది. […]
భావన -ఆదూరి హైమావతి అనగా అనగా మైసూరు రాజ్యాన్ని మేధవర్మ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన మంచి పాలకుడు. వివేకవంతుడు.ప్రఙ్ఞాశాలి. అతడు ప్రజల క్షేమం కోసం నిరంతరం శ్రమించే వాడు. ప్రతి రాత్రీ రెండోఝాములో తన ఆంతరంగిక మంత్రులతోనూ, విద్యా వేత్తలతోనూ సమావేశాలు జరిపి ప్రజల బాగోగులు చర్చించేవాడు. ఒకరోజున ఆంతరంగిక సమావేశంలో “మనకు ఇతరులపై ఏర్పడే అభిప్రాయాలు వారిని మొదటిమారు చూడగానే మన మనస్సులో కలిగే అభిప్రాయాన్నిబట్టి ఉండవచ్చు, లేదా తాము దేనిగురించీ ఆలోచిస్తు […]
మహాభాగ్యం -ఆదూరి హైమావతి పావన దేశానికి రాజు పరిమళవర్మ .వారిపూర్వుల్లా ధర్మపాలనచేస్తూ పేద ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాడు. రాజ్యం సుఖిక్షంగా ఉండటాన పరిమళవర్మకు తగినపని లేకపోయింది. రాజ్యపాలన కూడా తగిన మంత్రివ ర్యు లుండటాన వారికే అన్నీ వదిలేసి, సోమరిగా మారాడు. క్రమంగా కూర్చుని తినటాన స్థూలకాయం వచ్చింది. లేచి ఏ పనీ చేయలేక పోయేవాడు. రోజంతా సింహాసనం మీదో, హంస తూలికాతల్పంలోనో గడిపే వాడు. ఎవ్వరికీ మహారాజుకు తన దినచర్య గురించీ చెప్పే ధైర్యంలేక […]
మాతృదీవెన -ఆదూరి హైమావతి నారాయణపురం అనేగ్రామంలో అనంతమ్మ తన ఏకైక కుమారుడైన నారాయణతో జీవిస్తుండేది.ఆమె భర్త ఎండుకట్టెలు అడవినుంచీతెచ్చి అమ్మి సంసారం గడిపేవాడు. ఒకరోజున కట్టెలకోసం అడవికివెళ్ళి గంధం చెట్టు ఎండుకట్టెలు కొడు తుండగా నాగుపాము కాటేసి అక్కడికక్కడే మరణించాడు. అనంతమ్మ ఎంతో నిబ్బరంగా తన గుడిసె చుట్టూతా కూర పాదులు పెంచుకుంటూ ,అవి అమ్ముకుని వచ్చిన సొమ్ముతో పొదుపుగా ,కుదురుగా కుమారుని పోషించుకుంటూ జీవించేది. నారాయణ కూడా తల్లి రాగన్నం పెట్టినా, జొన్నన్నం పెట్టినా, గంజి […]
యద్భావం – తద్భవతి -ఆదూరి హైమావతి గోవిందపురంలో గోపయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఐదెక రాల మంచి భూమి ఉండేది.దాన్లో అతను తండ్రి వద్ద నేర్చుకున్న వ్యాపారమెళకువలను పాటిస్తూ వ్యవసాయం చేసి మంచి దిగుబడి, దానికి తగిన ప్రతిఫలమూ పొందే వాడు. ప్రతి ఏడాది అంతా ఏ పంటలు వేస్తున్నారో బాగా పరిశీలించి తాను వారికి భిన్నంగా ఎంపికచేసు కున్న పంట వేసేవాడు. అంతా వేలం వెర్రిగా వరి పంటో, గోధుమపంటో, రెండో కాపుకు పొగాకో, […]
ప్రజలత్యాగం -ఆదూరి హైమావతి అనగా అనగా అమరపురి రాజ్యాన్ని అమరసేనుడు అనేరాజు ప్రజారంజ కంగా పాలిస్తుండేవాడు. ఆయన పాలనలో ప్రజలకు కష్టమన్నది తెలిక సుఖశాంతులతో హాయిగా జీవించసాగారు. ఒకరోజున అమరసేనుడు మహామంత్రి త్యాగరాజుతో ఇష్టాగోష్టిగా మాట్లా డు తుండగా ప్రజలకు భగవంతునిపై ఉండే భక్తిగురించీ సంభాషణ మళ్ళింది. అమరసేనుడు “మంత్రివర్యా మన ప్రజలకు భగవధ్భక్తి కూడా ఎక్కువగానే ఉంటుందని భావిస్తాను”అన్నాడు. దానికి త్యాగరాజు “మహారాజా! ప్రజలకు కష్టమన్నది తెలీక పోటాన భగ వంతుని కూడా ఎంత […]
హేళన తగదు -ఆదూరి హైమావతి అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చిన్న చితకా జంతువులూ, పక్షులూ అన్నీ ఎవరి పాటికి అవి జీవిస్తున్నాయి. ఆ అడవి గుండా ప్రవహించే గౌతమీ నదీపాయ వాటి దాహానికి ఆధారంగా ఉండేది. అన్నికాలాల్లో ఆ నదిలో నీరు పారుతుండటం వారి పాలిటి వరమైంది. ఆ అడవి జీవులకు ఒక నియమం ఉంది. ఎవ్వరూ ఎవ్వరి జోలికీ వెళ్ళ కుండా ఎవరిపని వారు చూసు కుంటూ హాయిగా జీవించేవి. ప్రతి పౌర్ణమి […]