
https://www.youtube.com/watch?v=ZgRxeREChak
నూజిళ్ల గీతాలు-1(ఆడియో)
ఎందరో మహానుభావులు
-నూజిళ్ల శ్రీనివాస్
పల్లవి:
ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు
మహమ్మారి వైరసొచ్చిన వేళ, మనిషి పైనే దాడి చేసిన వేళ
మానవత్వాన్ని మేలు కొల్పి ఈ లోకానికి మేలు చేసేటి వారు ఎందరో….!
చరణం-1:
రోగాలు మన దరి చేరకుండగా, ఇంటనే ఉంచి భద్రంగా చూస్తూ
అయిన వాళ్లకు దూరంగా ఉన్నా అందరి క్షేమాన్ని కోరే పోలీసులు ఎందరో…
ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు!
చరణం-2:
పగలు రేయి రోగి చెంతనే ఉంటూ కంటికి రెప్పలా కాపాడు కొంటు
ప్రాణాలు పోసి, త్యాగాలు చేసే ప్రత్యక్ష దైవాలు వైద్యులు, నర్సులు ఎందరో…
ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు!
చరణం-3:
చెత్తను ఊడిచి, మురికిని తీసి ఆరోగ్యకరమైన పరిసరాలిచ్చి
రోగాలు, రొష్టులు చేరకుండగా శుభ్రం చేసే పారిశుధ్య కార్మికులు ఎందరో…
ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు!
చరణం-4:
మన తిండి, నీరు, విద్యుత్తుకేనాడు లోటు కలుగకుండ సేవలనందిస్తు
అందరి కష్టాలు తీర్చేటి తక్షణ సేవల సిబ్బంది, ప్రభుత్వోద్యోగులు ఎందరో…
ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు!
చరణం-5:
లోకాన శోకము నిండిన వేళ విషపు గాలి విస్తరించిన వేళ
మరణభేరి మ్రోగించే వేళ సేవకు ప్రతిరూపమైన దైవాలు ఎందరో…
ఎందరో మహానుభావులు అందరికీ మా వందనాలు!
*****

వృత్తి ఇంగ్లీష్ లెక్చరర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలమూరు, తూర్పు గోదావరి జిల్లా. ఇంతకు ముందు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో, రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో హైదరాబాద్ లో పని చేశాను. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట జన్మస్థలం. తండ్రి గారు కీ.శే. నూజిళ్ళ లక్ష్మి నరసింహ గారు ప్రముఖ గేయ రచయిత. వారే స్ఫూర్తి. తల్లి గారు కీ.శే. శ్రీమతి సత్యవతి గారు. ఈ రంగంలో నా అభిరుచిని ప్రోత్సహించిన వ్యక్తీ. ప్రవృత్తి గేయాలు, కవితలు తెలుగు, ఇంగ్లీష్ లో రాయటం, పాడటం. ముఖ్యంగా గోదావరి యాసలో,జానపద శైలిలో పాటలు రాయడం. “ఆయ్..మేం గోదారోళ్ళమండి.. “ ప్రాచుర్యం పొందిన గేయం. గత రెండు దశాబ్దాలకు పైగా రాస్తున్నాను. 1500 కి పైగా గేయాలు రచించాను.
