రచయిత్రి సమ్మెట ఉమాదేవి ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయినిగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం హైదరాబాద్ లో స్థిరపడ్డారు. దాదాపు 150 కథలను రాశారు ఇప్పటిదాకా కథా సాహిత్యంలో అమ్మ కథలు, రేలపూలు - తండావాసుల కథలు , జమ్మిపూలు, సమ్మెట ఉమాదేవి కథానికలు, అనే పుస్తకాలను,.. మా పిల్లల ముచ్చట్లు - ఒక టీచర్ అనుభవాలు, నిక్ అంటే ప్రేరణ, చిలుక పలుకులు, రామకృష్ణ పరమ హంస జీవిత చరిత్ర వంటి బాలసాహిత్య పుస్తకాలను వెలువరించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యునివర్సిటీ ప్రతిభా పురస్కారం మొదలు పలు పురస్కారాలను అందుకున్నారు. ప్రస్తుతం బాల సాహిత్యంలో కృషి చేస్తున్నారు
కప్పు -ఉమాదేవి సమ్మెట భవిష్యా లాడ్జ్ నుండి హడావుడిగా ఇంటికెళ్తున్న నాత్యానాయక్ ని చూసి… “ఏంది నాత్యా.. ఉరుకుతున్నవ్ వజ్రమ్మ రమన్నదా?” ఏసోబ్ వెక్కిరింపుగా అన్నాడు. “ఏ ఆమె వజ్రమ్మ గాదూ. ఆమె ఆయనకు బాస్”నర్సయ్య అన్నాడు. “మంచామనే పట్టిండుపో ”భీమ్లా అంటున్నాడు. తన వెనుక నుండి వినబడుతున్న వెటకారపు మాటలకు..పోయి నాలుగు తందామన్నంత కోపాన్ని దిగమింగుకుని ఇంటికి చేరుకున్నాడు నాత్యా. “ఏందిగట్లున్నావ్? మల్లా ఏదన్నా ఒర్లుతున్నరా వాళ్ళు” వజ్రమ్మా అడిగింది. “ఎప్పుడుండే లొల్లేగానీ.. ఏంది వజ్రమ్మా! […]