
https://youtu.be/uK2H39EzIVk
ప్రముఖ రచయిత్రి ప్రతిమ గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
(ప్రతిమ గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)
***
“నెల్లూరు జిల్లాలోని ప్రధాన సామాజిక వర్గంలో, ఒక భూస్వామ్య కుటుంబంలో నుండి ఇలా బయటకు రావడమే సాధించిన విజయంగా నేను భావిస్తూ ఉంటాను” అనే ప్రతిమ గారికి పీడితుల పక్షాన నిలబడి, చీకటి కోణాల్లోకి వెలుగులు ప్రసరించేలా మంచి కథలు, కవిత్వం, వ్యాసాలు రాయాలన్నదే అభిలాష. 80 దాకా కథలు రాశారు.
ప్రచురించిన పుస్తకాలు:
1..” పక్షి” కథా సంపుటి 2004
2.. “ఖండిత” కథా సంపుటి 2008
3.. “రెండు భాగాలు” కవిత్వ సంపుటి 2008
4. “సుప్రజ” కథా సంకలనం 2011
“పగిలిన జ్ఞాపకం” కథా సంపుటి ప్రచురణలో ఉన్నది.మరో వ్యాస సంపుటి, కవిత్వ సంపుటి ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయి.
పురస్కారాలు:
1. చాసో స్ఫూర్తి పురస్కారం 2005 విజయనగరం
2. రంగవల్లి సాహిత్య పురస్కారం 2005 హైదరాబాద్
3.కేతు విశ్వనాథరెడ్డి పురస్కారం 2007 నందలూరు
4. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం 2007 హైదరాబాద్
5. ఆంధ్రప్రదేశ్ నంది పురస్కారం 2007 హైదరాబాద్
6. నూతలపాటి గంగాధరం కవిత్వ పురస్కారం 2009 తిరుపతి
7. గురజాడ కథా ప్రభాస పురస్కారం 2013 పిఠాపురం
8. గుర్రాల రమణమ్మ కవిత్వ పురస్కారం నెల్లూరు
9. డాక్టర్ పరుచూరి రాజారామ్ సాహిత్య పురస్కారం 2016 గుంటూరు
10. ఏఐసిసి జాతీయ పురస్కారం 2007
11. మాలతి చందూర్ ప్రమదా పురస్కారం 2019 బాలకుటీర్
గుంటూరు
12. ఉమ్మడిశెట్టి సత్యాదేవి పురస్కారం 2019 అనంతపురం
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
