డా. మారంరాజు వేంకట మానస శ్రీమాన్ ప్రవీణ్ కుమార్ - శ్రీమతి ఉషా రాణి దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు. వీరు ఇంజనీరింగ్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యాభ్యాసం జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ లో చేసి గోల్డ్ మెడల్ సాధించారు. నానో ఇంజనీరింగ్ లో పరిశోధన చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఇన్స్పైర్ ఫెలోషిప్ పొంది సీఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ లో రీసర్చర్ గా పని చేసారు. వీరు నానో టెక్నాలజీ పరిశోధనలపై అకాడెమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్, న్యూఢిల్లీ నుంచి పీహెచ్.డి. పట్టభద్రులయ్యారు. తరువాత ఎన్ ఎమ్ ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసి, ప్రస్తుతం నానో శాస్త్రవేత్తగా తన సేవలు కొనసాగిస్తున్నారు. వీరు అనేక జాతీయ, అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్స్ లో పరిశోధనా పత్రాలను సమర్పించారు. వృత్తి రీత్యా శాస్త్రవేత్త అయినా వీరి ప్రవృత్తి సంగీత సాహిత్యాలు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి కర్ణాటక సంగీతంలో దూరవిద్య ద్వారా బీ.ఏ పట్టభద్రులయ్యారు. వీరు ఆల్ ఇండియా రేడియోలో యువవాణి కళాకారిణి గా ఉన్నారు. అంతేగాక, పలు ప్రముఖ వేదికలపై గాత్ర సంగీత కచేరీలు కూడా చేసారు. 'వేంకటమఖి విరచిత చతుర్దండి ప్రకాశిక' అను సంగీత పరమైన గ్రంథాన్ని రచించి కఠినమైన అంశాలను సులువుగా
సంగీత విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రచురించారు. విద్యారంగంలో వీరి ప్రతిభను గుర్తించి ఇంటర్నేషనల్ ఉమెన్స్ సొసైటీ వీరికి ఉమెన్ అచీవర్ అవార్డు ' ను ప్రదానం చేసింది. వీరి అభిరుచులు వీణా వాదన, పుస్తక పఠనం, వ్యాస రచనలు, కవితా రచనలు.
‘సలాం హైద్రాబాద్’ – నవలా సమీక్ష -డా.మారంరాజు వేంకట మానస చార్ సౌ సాల్ పురానా షహర్ హైద్రాబాద్ తో ఎంతో కొంత అనుబంధం ఉన్న వాళ్ళందరి నవల ‘సలాం హైద్రాబాద్’ !!! రాధా కృష్ణల ప్రేమకు బృందావనం, షాజహాన్ ముంతాజ్ ల ప్రేమకు ఆగ్రా, కుతుబ్ షా బాగ్ మతీల ప్రేమకు భాగ్యనగరం (హైద్రాబాద్) – అంతే, అంటే పొరపాటే! ప్రేమకు చిహ్నంగానే గాక మతసామరస్యాలలో, స్నేహపూరిత సంబంధ బాంధవ్యాలలో కూడా హైద్రాబాద్ నగరం దక్కన్ […]
“నేనూ…. నా నల్లకోటు కథలు” – పుస్తక సమీక్ష -డా.మారంరాజు వేంకట మానస నల్లకోటునుద్దేశించి వ్రాయాలంటే సరియైన అవగాహనతో పాటు కాసింత ధైర్య సాహసాలు ఉండాలి. అదే స్వయంగా నల్లకోటు వేసుకుని నల్ల కోటునుద్దేశించి వ్రాయాలంటే అవగాహనకు మించి అనుభవాలుండాలి. అనుభవాల దృష్ట్యా సరైన విశ్లేషణ అవసరం. ఇటువంటి ఆలోచనా దృక్పథం ఉన్న అరుదైన రచయితలలో మంగారి రాజేందర్ గారు ఒకరని చెప్పవచ్చు. కళ్ళ ముందు జరిగే అనేక సంఘటనలతో ఆందోళన చెంది, జరగవలసిన విధంగా న్యాయం […]