
“నెచ్చెలి”మాట
సిగ్గు సిగ్గు
-డా|| కె.గీత
మహాభారతం
నించి
మణిపూర్
దాకా
క్రీస్తు పూర్వపు
వేల
యుగాల
నుంచి
క్రీస్తు శకం
2023
వరకు
లిఖించ
బడనీ
బడకపోనీ
ఒక్కటే
చరిత్ర
ఒక్కటే
వర్తమానం
సిగ్గు సిగ్గు
దేశమా
సిగ్గు సిగ్గు
స్త్రీ దేహమే
మొదటి
దురాక్రమణ
బుద్ధిలేని
బుద్ధిరాని
ప్రపంచమా
సిగ్గు సిగ్గు
స్త్రీ దేహమే
మొదటి
అంగడి వస్తువు
మొదటి
బలిపశువు
సిగ్గు సిగ్గు
సిగ్గు సిగ్గు
మనింటి మనుషులు కాదు కదా
మనకెందుకు అంటారా?
మన వరకూ
వచ్చే వరకూ
ఆగినందువల్లే
ఆదిమ యుగాల
నించీ
ఆధునిక యుగం
వరకూ
ఏ మార్పూ రానిది
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
జూలై 2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: సునీత పొత్తూరి
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: ధీర – బ్రిస్బేన్ శారద
(నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం పొందిన కథ)
ఇరువురికీ అభినందనలు!
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

నిజమే. సిగ్గు సిగ్గు. మణిపూర్ సంఘటన మనలో రగులుతూనే వున్నది. గర్వంగా చెప్పుకునే మన దేశంలో ఇది నీచమైన దుస్థితి! ఆ స్త్రీల మనసు ఎంత రగిలి, చితికి పోయి…వద్దు. ఇక చాలు ఈ మనో వేదన. నెచ్చెలి మాటలో అందరి తో పంచుకున్నారు. మేడమ్ గీతా గారికి జోహారులు.
థాంక్స్ సురేఖ గారూ!
చాలా బాగా రాసారు మేడమ్. అభినందనలు.