తెలుగు గజల్ రచనలో భావాలు, భాష, చమత్కారం వంటి అంశాలలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఇది తెలుగు గజల్కు ఒక ఆధునిక రూపాన్ని ఇస్తోంది. ప్రస్తుతం చాలామంది కవులు తమ గజళ్లను
వారు స్వయంగా లేదా గాయకులతో పాడించి, వాటిని YouTube , ఇతర సామాజిక మాధ్యమాల్లో వీడియోలుగా పెడుతున్నారు. ఇది విస్తృతంగా తెలుగు గజళ్లను దృశ్య, శ్రవణ రూపంలో అందించే ఒక కొత్త మార్పు. తెలుగు గజళ్లను ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరువయ్యేలా చేస్తుంది. మేము స్థాపించిన “ విశ్వపుత్రిక గజల్ ఫౌన్డేషన్ “సంస్థ ఆశయం ; తెలుగు గజళ్ళ ను ఎక్కువ కవులు నేర్చుకుని రాసి వారి గజల్ గానం వీడియోల ద్వారా you tube మరి ఇతర సామాజిక మాధ్యమాలలో Face book , WhatsApp ద్వారా గజల్ ప్రేమికులకు చేరువ చేసి తెలుగు గజళ్ళను విశ్వవ్యాప్తం చేయాలన్న లక్ష్యం నెరవేరుతోంది.
ఈ వ్యాసం లో ఈ క్రింది ఏడు మంది గజల్ కవులను పరిచయం చేస్తున్నాను. వీరి గజళ్ళను చదివి , గానం విని వీరి గజళ్ళ సౌందర్యాన్ని ఆస్వాదించండి.
శ్రీ బూర దేవానందం ,శ్రీ నోరి రఘరామమూర్తి, శ్రీమతి సుమన ప్రణవ్ , శ్రీమతి బోర భారతి , డా. చీదెళ్ళ సీతాలక్ష్మి, శ్రీమతి లక్ష్మీరాజశేఖరుని,మణికర్ణిక ( వడ్ల నరసింహ చారి)
బూర దేవానందం గారు , హైదరాబాద్ వీరు గజల్ కవి .వీరు చాల గజళ్లు రాసి పత్రికలలో , WhatsApp groups లో పోస్ట్ చేశారు. వారి గజల్ ను ఆస్వాదించండి..,
మాటలనే ముత్యాలుగా రాల్చేవారు కొందరు
మాటలనే తూటాలుగా పేల్చేవారు కొందరు
మాటలతో ముగ్ధులను చేసేవారు ఉన్నారు
మాటలతో మనసులను విర్చేవారు కొందరు
మాటలతో గాయాలను చేసేవారు ఉన్నారు
మాటలతో గేయాలను కూర్చేవారు కొందరు
మాటలతో బ్రతుకులను దిద్దేవారు ఉన్నారు
మాటలతో జీవితాలను కూల్చేవారు కొందరు
మాటలతో దేవా! కోటలను కట్టేవారు ఉన్నారు
మాటలతో కోట్లజనులను కదల్చేవారు కొందరు
బూర దేవానందం గారి 2 వ గజల్.:
కన్నవారి ఉన్నతికోసం..తపించేవాడు
నాన్నంటే
కలనైనా బిడ్డలకోసం..యోచించేవాడు
నాన్నంటే
బడబాలనం తనలోవున్నా..చల్లనిసంద్రంలా వుంటాడు
బాధలెన్నొ తనలోవున్నా..దాచేసేవాడు
నాన్నంటే
తనపిల్లల సౌఖ్యం కోసం..కొండనైనా పిండిచేస్తాడు
పిల్లల సంతోషమే స్వర్గమనీ..తలచేవాడు నాన్నంటే
నీ భవితకై నిరంతర తపన..నిను శిఖరానికి చేర్చేనిచ్చెన
నీ కోసం తన ఆయువునైనా..ఇచ్చేవాడు
నాన్నంటే
ఇంటికోసం సర్వస్వము..ధారపోసే త్యాగధనుడు
కొవ్వొత్తిలా ఓ దేవా!..కరిగేవాడు నాన్నంటే
దేవానందం గారి గజల్ గానం వ్యాసం చివర
Link లో విని ఆశ్వాదించండి
—————————-
నోరి రఘరామ మూర్తి , హైదరాబాద్ గజల్ కవి గాయకుడు కూడా. నోరి దంపతులు మంచి గాయకులు . రఘరామ మూర్తి గారు 2024 లో “ హరివిల్లు “ అన్న గజళ్ళ సంపుటిని ప్రచురించారు. వీరి గజల్ ను ఆశ్వాదించండి.
అమ్మంటే (తిశ్రగతి)
తేనియలను ఒలికించే మాటకదా అమ్మంటే
మమతలు పండించు మధురవాడ కదా అమ్మంటే
అక్షరాలు దిద్దించెను నీతి కథలు బోధించెను
సంస్కారము చూపు అడుగుజాడ కదా అమ్మంటే
అలసిన మనసుకు తనువుకు అమ్మ ఒడే
శాంతికి గుడి
కమ్మనైన కలల జోల పాటకదా అమ్మంటే
ఆటంకములెదురైనా భవిత కొరకు పాటుపడును
తన పిల్లల అభివృద్ధికి బాటకదా అమ్మంటే
మణికన్నా విలువైనది మాతృమూర్తి హృదయసీమ
వాత్సల్యం కురియు సిరులు వాన కదా అమ్మంటే
అమ్మ ప్రేమ కడదాకా అందరికీ దొరకదు రఘు
మరపురాని జ్ఞాపకాల నావ కదా అమ్మంటే!
నోరి రఘురామమూర్తి రెండవ గజల్:
రావద్దని అంటున్నా ఇంటి ముందు ఉన్నానే
మూసి ఉన్న తలుపులలో నీ రూపం చూసానే
శూన్యంలో నీ మాటలు నను నడిపిస్తున్నాయే
కన్నులున్న అంధుడినై అడుగులు వేస్తున్నానే
కలుసుకునే చెట్టు కింద నిరాశతో కూర్చున్నా
నీ తలపుల తోటలోన ఊసులాడుకున్నానే
మరులుగొన్న పక్షిజంట యుగళ గీతి విన్నానే
బరువెక్కిన చరణాలను నేను పాడుకున్నానే
చిన్న చిన్న తప్పులకే పెద్ద శిక్ష వేస్తావే
నిను కలవని రోజు నాకు ఉరిశిక్ష నుకున్నానే
పరుచుకొన్న మౌనంలో మనసు కథను అల్లుకొంది
నీ ఛాయా చిత్రముతో మాటలాడుతున్నానే
నీ వలపులు విషాదమై అంతం కారాదు రఘూ
నీవు తిరిగిరావాలని పూజలు చేస్తున్నానే
వ్యాసం చివర నోరి రఘురామమూర్తి గజల్
గానం వీడియో link లో విని ఆస్వాదించండి.
_______________
శ్రీమతి సుమన ప్రణవ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లో Group -1 officer గా ఉన్నారు. వీరు కవయిత్రి గజల్ రచయిత్రి , మంచి సాహితీ విశ్లేషకులు కూడా. వీరు 2023 లో
“గజల్ గుల్మొహర్” అన్న శీర్షిక తో గజల్ సంపుటిని వెలువరించారు. వీరి గజల్ ను ఆస్వాదించండి..,
సుమన ప్రణవ్ గారి గజల్ గానాన్ని వ్యాసం చివర ఆడియో link లో వినండి.
____________
బోర భారతి గారు విశాఖపట్టణం వాసులు. తెలుగు ఉపాధ్యాయురాలు . “సేవ సాహిత్య కళా సేవా సంస్థ “లో వీరిది ముఖ్య పాత్ర . వీరు 2024 లో “ భారతీదేవి గజళ్ళు – భావోద్వేగ సవళ్ళు” అన్న గజళ్ళ సంపుటిని ప్రచురించారు. బోర భారతి గారి గజల్*
ప్రేమెంతో దాగియున్న చెప్ప బుద్ధి కాదేమిటో!
ఉప్పొంగే గుండెఘోష ఆపబుద్ధి కాదేమిటో!
నీమాటల మంత్రాలే విందయ్యెను వీనులకే
మత్తుజల్లు మల్లియలను మెచ్చబుద్ధి కాదేమిటో
ఆశలతో ఈడ్చుతున్న ఆలయమే ఈదేహం
అంతరాత్మ దేవతనే చూడబుద్ధి కాదేమిటో
పెంచుకున్న విశ్వాసం పెనవేసిన బంధాలే
మదిన మారు మ్రోగుతీరు పలక బుద్ధి కాదేమిటో
అహంకారపు గోడలే చీల్చలేను ఓ భారతీ
సత్యాన్నే ప్రకటిస్తూ బ్రతకబుద్ధి కాదేమిటో
బోర భారతీదేవి 2 వ గజల్ః
బహర్ 2121 2121 2121 222
మాట తోట పూల కోసి మత్తు పూత పూసిందే
నిప్పురవ్వ రాజు కుంటె మంచు పూత పూసిందే
సప్త వర్ణ సోయగాలు స్వప్న మందు తేలియాడ
సంధ్యవేళ వేడి శ్వాస వెన్న పూత పూసిందే
స్వర్గలోక దారి చూపు స్నేహ గీత రాగమేదొ
పాల పొంగు సంద్ర మందు తేనె పూత పూసిందే
జ్ఞాపకాల ఝరిలోన ఒంటరైన నన్నుచూసి
నువ్వు పూల దీప కాంతి ప్రేమ పూత పూసిందే
మౌన వీణ ముద్రలోన యుద్ధ భేరి మోగుతోంది
సోకు పూలు మూట గట్టి స్వర్ణ పూత పూసిందే
————————-
లక్ష్మీ రాజశేఖరుని గారు ‘సత్య స్వరాళి ‘అనే కలం పేరుతో గజల్స్ రాస్తున్నారు. వీరు చాల గజళ్ళ ను “విశ్వపుత్రిక గజల్ ఫౌన్డేషన్ “ WhatsApp గ్రూప్ లో పోస్ట్ చేస్తుంటారు.
డా.పి.విజయలక్ష్మిపండిట్ “ విశ్వపుత్రిక గజల్ ఫౌండేషన్ “ (2021Feb.)వ్యవస్థాపక అధ్యక్షురాలు. వీరు దాదాపు 50 సంవత్సరాల నుండి తెలుగు సాహితీ రంగంలో వివిద ప్రక్రియల్లో- వచన కవితలు , గజళ్ళు,హైకూలు, కథలు, అనువాదాలు, విశ్లేషణ వ్యాసాలు రాస్తూ దాదాపు 32 ప్రచురణలు చేశారు. వీరి కలంపేరు “విశ్వపుత్రిక”. వీరి చదువు : Ph.D. in Education, M.A.in Distance Education , Diploma in Distance Edecation, M.Sc.Botany ,M.A. Women studies & Visharad in Hindi . వీరు డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ( హైదరాబాద్)నుండి ఫ్రొఫెసర్ గా రిటైర్ అయ్యారు . వీరి ముఖ్యమైన కవితా సంపుటాలు “మానవత్వమా ఏదీ నీచిరునామా”, “ఆకాశంలో అర్ధ భాగం”, , “నా ఆత్మ కళలు “ “ నా అక్షరాలు “. “ఏకత్వ జ్ఞానం “. దీర్ఘ కవితలు “ధరిత్త్రీ విలాపం”, “విశ్వపుత్రికను నేను విశ్వశాంతి నా ఆకాంక్ష“. వీరు “విశ్వపుత్రిక హైకూలు”, తెలుగు గజళ్ళు ‘యోగ రేఖలు , రాగరేఖలు , విశ్వరాగం, హృదయాంజలి అన్న శీర్షికలతో 4 గజళ్ళ సంపుటాలు ,”Wisdom Of Oneness “అన్న ఇంగ్లీషు ఆంథోలజి.(53 English poems) వెలువరించారు.వీరు రవీంద్రనాథ టాగోర్ “గీతాంజలి”ని తెలుగులోకి “అపూర్వ గానం” అన్న శీర్షికతో అనువదించి పలువురు ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు .”రమ్య ద రోబో “, “పేగు బంధం “అన్న కథల సంపుటాలు వెలువరించారు. వీరి 5 కవితా సంపుటాను హింది,ఇంగ్లీషు లోకి అనువదింపబడ్డాయి. వీరు అందుకున్న
ముఖ్యమైన పురస్కారాలు: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయంనుండి ఉత్తమ రచయిత్రి “కీర్తి పురస్కారం “(2021), -గీతాంజలి అనువాదం “ అపూర్వగానం”కు “గిడుగురామమూర్తి పంతులు భాషా సాహిత్య పురస్కారం (2018),-కాఫ్లా ఇంటర్నేషనల్ “సాహిత్యగౌరవ్ “ అవార్డ్ ( Oct.2016)“ India Inter Continental Cultural Association) నుండి,సి.నా.రె.పురస్కారం ( కళానిలయం సాహిత్య సేవా సంస్థ వారి (July 2024,)అమృతలత జీవన సాఫల్య పురస్కార( విద్యారంగం)May 2023, “ అరికపూడి పూర్ణచంద్రరావు “ మహిళా మణి “పురస్కారం (March 2019),-“ భారతీయ సాహిత్య అనువాద ఫౌన్డేషన్ వారి “అనువాద శిరోమణి పురస్కారం , Sep.2024,మొత్తం 20 కి పైన పురస్కారాలు అందుకున్నారు.