శ్రీమతి బి. కళాగోపాల్ గత దశాబ్ధ కాలంగా కవితలు, కథలు వ్రాస్తున్నారు. పుట్టింది నిజామాబాద్ జిల్లాలో. ఎం.ఎ ఇంగ్లీష్, బీఎడ్ చేసిన వీరు ఆంగ్ల సహఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. ఇంత వరకు వీరివి 450కి పైగా కవితలు వివిధ వార, మాస సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి. కవితాసంపుటి 'మళ్ళీ చిగురించనీ..' 2015లో 74 కవితలతో ప్రచురించారు. అంతేగాక స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్.ఎం లో 20 కథానికలు ప్రసారమయ్యాయి. 25 వ్యాసాలూ వివిధ పత్రికల్లో వచ్చాయి. 50 కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి. వాటిల్లో 20 కథలు వివిధ సందర్భాల్లో అవార్డులను పొందాయి. వీరి కవితలు కూడా అనేక సందర్భాల్లో పలు అవార్డులు పొందాయి. రాధేయ, ఎక్స్ రే, భిలాయ్ వాణి, కలహంస, భూమిక, సాహితీకిరణం, ద్వానా, వాల్మీకి, మల్లెతీగ వారి కవితా పురస్కారాలు పొందారు. సోమేపల్లి, వట్టికోట ఆళ్వారు స్వామి, జలదంకి పద్మావతి కథా పురస్కారాలను పొందారు.
ఆరని జ్వాల (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ) -బి.కళాగోపాల్ బ్యాగ్ లో నుండి మరోసారి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్స్ కాపీని చూసుకొని సర్దుకున్నాను. బాబు నుదుటి పై చెయ్యివేసి చూశాను. జ్వరం జారింది. వేసుకున్న టీషర్ట్ చెమటలు పోసి తడిచిపోయింది వాడికి. అటుకేసి తిరిగాడు. దిగులుపొర నా గుండెల్ని మెలి పెట్టింది. బి.టెక్ సెమిస్టర్ పరీక్షల్లో ఈ డెంగీ జ్వరమొకటి వాడికి. ఇంకో రెండు పరీక్షలు రాయాలి. ఈ వేసవిలో మే ఐదు, ఆరు […]
నిర్భయనై విహరిస్తా..! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ) – బి.కళాగోపాల్ జలజకు హృదయమంతా కలచి వేయసాగింది. ఊరుతున్న కన్నీళ్లను మాటిమాటికీ తుడుచుకో సాగింది. ఆవేదనతో ఆమె మనస్సంతా కుతకుతలాడసాగింది. గుండె గూడుపట్లను కుదుపుతున్న దుఃఖాన్ని మోస్తూ ఆమె నిలువెల్ల శోకతప్తగా నిలబడింది. హాస్పిటల్ లో ఉరుకులు.. పరుగులు పెడుతున్న సిబ్బంది. […]