image_print

మెరుపులు- కొరతలు-7 బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”

మెరుపులు- కొరతలు బి.అజయ్ ప్రసాద్ కథ “ఎండగుర్తు”                                                                 – డా.కే.వి.రమణరావు సమాజంలోని ఒక సాదాసీదా వ్యక్తికి ముప్పఏయేళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి దాన్ని నెమరువేసుకోవడమే ఈ కథ. ఇంకా చెప్పాలంటే అది కథ చెప్తున్న శ్యామ్ జీవితంలో ఇది ప్రాముఖ్యతలేని ఒక ఙ్ఞాపకం. ముఖ్యపాత్ర పొందిన ఒక తడిలేని అనుభూతిని నేరుగా పాఠకులకు అందేంచే ప్రయత్నం. ఇలా అమూర్తంగా, అనాసక్తిగా రాసినట్టు కనబడుతున్న కథలను ఆధునిక కథాసాహిత్యంలో వస్తున్న ఒక ధోరణిగా చూడాలి. అప్పుడే […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-5 అప్పు “డా. శైలకుమార్” కథ

మెరుపులు- కొరతలు అప్పు “డా. శైలకుమార్” కథ                                                                 – డా.కే.వి.రమణరావు మానవసంబంధాలను డబ్బు ఎలా ప్రభావితం చేస్తుందన్న అంశంపైన రాసిన కథ ఇది. ఈ అంశంమీద చాలాకాలంగా కథలు, నవలలు, నాటకాలు, సినిమాలు వస్తున్నా ఈ కథ చెప్పిన విధానం సరళంగా, సూటిగా ఉండి తన ప్రత్యేకతను నిలుపుకోవడమేకాక ఇవ్వదలుచుకున్న సందేశాన్ని ప్రతిభావంతంగా ఇస్తుంది.      కథంతా ఒక చిన్న సెట్టింగులో తిరుగుతుంది. క్లుప్తంగా కథ ఇది.       ఈ కథను ‘అన్న’ అని పిలవబడే ముఖ్యపాత్ర చెప్తుంది. ఒక […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-7

కథన కుతూహలం -7                                                                 – అనిల్ రాయల్ నేను త్యాగరాయల్ని కాను “కథలు రాయడం ఒక పిచ్చి. సైకలాజికల్ ప్రాబ్లం. విపరీత ప్రవర్తన. కథలెందుకు రాస్తారంటే చాలామంది కథలు రాయకుండా ఉండలేక రాస్తారు. నేను ఈ మాట అంటున్నది కథను చాలా సీరియస్ గా తీసుకున్న రచయితల గురించి. ఇది చాలా ప్రమాదకరమైన పని. రాసినవాళ్లెవరూ బాగుపడలేదు. ఆరోగ్యంగా ఉండలేదు. కాపురాలు సజావుగా నిర్వహించలేదు. భ్రమలకు భ్రాంతులకు మానసిక అనారోగ్యాలకు ఆత్మహత్యలకు గురయ్యారు. ఒంటరితనంలోకి పారిపోయారు. చీకటి […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-4 అట్లా అని పెద్ద బాధా ఉండదు

మెరుపులు- కొరతలు అట్లా అని పెద్ద బాధా ఉండదు – దాట్ల దేవదానం రాజు కథ                                                                  – డా.కే.వి.రమణరావు తనచుట్టూ ఉన్న సమాజంలోని చెడుని చూసి భరించలేక దాన్ని సరిచేయడంకోసం వ్యక్తిగతంగా నిత్యం పోరాటం చేసి ఎదురుదెబ్బలు తిన్న ఒక సామాన్య యువకుడి కథ ఇది. అతని జీవితంలో కొంతకాలంపాటు జరిగిన కొన్ని వరస సంఘటనలు కథనంలో రచయిత దృక్కోణంలో చూపబడ్డాయి. స్థూలంగా ఇదీ కథ. ముగింపులో ప్రారంభిం చబడిన ఈ కథంతా దాదాపు ఫ్లాష్ బ్యాక్ లో […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-6

కథన కుతూహలం -6                                                                 – అనిల్ రాయల్ వ్యాఖ్యానాలు vs గతమెరుపులు vs చట్రబద్ధాలు నవలా రచయితకి ఉన్నది, కథా రచయితకి లేనిది ఏమిటి? ప్రధాన పాత్రల జీవితాలని విస్తారంగా చిత్రీకరించే వెసులుబాటు నవలా రచయితకుంది, కథా రచయితకి లేదు. కథల నిడివి పూర్తిస్థాయి జీవితాల చిత్రీకరణకి అడ్డుపడుతుంది. అందువల్ల “కథ అను పదార్ధమును నిర్వచింపుడు” అనే ప్రశ్న ఎవరన్నా వేస్తే “ప్రధాన పాత్ర జీవితాన్ని ప్రభావితం చేసిన ఓ కీలక సంఘటన, దానికి దారి తీసిన […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-5

కథన కుతూహలం -5                                                                 – అనిల్ రాయల్ తిరగరాత  మీరో పేరాగ్రాఫ్ రాశారు. తర్వాత దాన్ని చదువుకున్నారు. అద్భుతంగా అనిపించింది. అంతకన్నా గొప్పగా మరెవరూ రాయలేరనిపించింది. అప్పుడు మీరేం చేయాలి? ఆ పేరాగ్రాఫ్‌ని కొట్టిపారేసి మళ్లీ రాయటం మొదలుపెట్టాలి. గొప్పగా రాయాలనుకునే వ్యక్తికి ఉండాల్సిన సుగుణం – తాను రాసిన వాక్యాలతో మొట్టమొదటిసారే ప్రేమలో పడకుండా ఉండగలిగే నిగ్రహం. *** ‘ది పిక్చర్ ఆఫ్ డోరియన్ గ్రే’ వంటి కళాఖండాల సృష్టికర్త ఆస్కార్ వైల్డ్‌ని ఓ రోజు […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-3 అసురవేదం

మెరుపులు- కొరతలు అసురవేదం -‘బహుశా’ వేణుగోపాల్ కథ                                                                  – డా.కే.వి.రమణరావు అడవిజంతువుల పట్ల మనుషుల స్వార్థపూరిత హింసాప్రవృత్తిని ఒక ‘అసురత్వం’గా ఈకథలో వర్ణించారు రచయిత బహుశా’ వేణుగోపాల్. ఈ సమకాలీన లక్షణాన్ని ఒక సంఘటనద్వారా వివరిస్తూ దానిని రామాయణంలోని ఒక ప్రధాన సంఘటనతో ప్రతీకాత్మకంగా పోలుస్తూ చెప్పిన కథ ఇది.  స్థూలంగా ఇదీ కథ. అడవినానుకుని ఉన్న ఒక ఇరవై గుడిసెల గూడెంలో మగాళ్లంతా పొగాకుబేరన్లకి మొద్దులు నరకడానికి తెల్లవార్ఝామున అడవికి బయల్దేర్తుండగా ఊరిబావిలో పడిన జంతువు […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-2 రుబీనా పర్వీన్ కథ ‘బుర్ఖా’

మెరుపులు- కొరతలు డా.కే.వి.రమణరావు కథ “బుర్ఖా”                                                                 – డా.కే.వి.రమణరావు తెలంగాణాలోని ఒక మారుమూల ప్రాంతం ఈ కథకు నేపథ్యం. ఇది ఉర్దు కలసిన తెలంగాణా మాండలీకం మాట్లాడే ముస్లిం పాత్రలమధ్య నడుస్తుంది. రచయిత్రి సర్వసాక్షి దృష్టికోణంలో చెప్పినా కథంతా ప్రధాన పాత్ర మెహర్ చుట్టూ తిరుగుతుంది. స్థూలంగా కథాంశం ఇది. మెహర్ బీద ముస్లిం కుటుంబంలోని పదో తరగతితోనే చదువాపేసిన అందమైన యువతి. ఆమె భర్త లతీఫ్ మంచి హస్తవాసిగలిగిన ఆరెంపి డాక్టరు. ఇద్దరు పిల్లలు. ఉండడానికైతే […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-4

కథన కుతూహలం -4                                                                 – అనిల్ రాయల్ పూర్వనీడలు పరుద్దాం రా! “పొదల మాటునుండి రెండు కళ్లు తననే గమనిస్తున్నాయని అప్పుడతనికి తెలీదు” యండమూరి వీరేంద్రనాధ్ నవలలు విచ్చలవిడిగా చదివిన వాళ్లందరికీ చిరపరిచితమైన వాక్యమిది. అచ్చంగా ఇదే కాకపోయినా, ఇంచుమించు ఇటువంటి వాక్యాలు ఆయన నవలల్లో తరచుగా ఎదురవుతుంటాయి. నాకు తెలిసినంతవరకూ తెలుగులో ఫోర్ షాడోయింగ్ ప్రక్రియని ప్రభావశీలంగా వాడుకున్న- కొండొకచో దుర్వినియోగ పరచిన – రచయితల్లో అగ్రగణ్యుడు యండమూరి (నా పరిజ్ఞానం అంతవరకే పరిమితం. పాపము […]

Continue Reading
Posted On :

కథాకాహళి- జాజుల గౌరి కథలు

కథాకాహళి- 22 దళిత బాలికల వేదనాత్మక కథారూపం జాజుల గౌరి కథలు                                                                  – ప్రొ|| కె.శ్రీదేవి జాజుల గౌరి 1968 సికింద్రబాద్ లోని లోతుకుంటకు చెందిన జాజుల బావిలో జన్మించారు. ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ. పట్టా పొందారు. తరువాత ఎమ్.సి.జె., చేసారు. న్యాయవాద పట్టాను ఉస్మానియా యూనివర్సిటీ నుండి పొంది,  కొన్నిరోజులు న్యాయ వాదిగా ప్రాక్టీస్ కూడా చేసారు. రాజకీయరంగ ప్రవేశంచేసి,ఒక జాతీయ పార్టీలో మహిళా విభాగంలో కొనసాగుతున్నారు. మాదిగ దండోరా ఉద్యమంలో భాగస్వాములైన నాగప్పగారి సుందర్రాజు  […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-1 డా కె.గీత కథ “ఇవాక్యుయేషన్”

మెరుపులు- కొరతలు డా కె.గీత కథ “ఇవాక్యుయేషన్”                                                                 – డా.కే.వి.రమణరావు ప్రచురణ: ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (4 జూలై 2021) ఇది అమెరికాలో ఉన్న ప్రవాసభారతీయులు నేపథ్యంగా రాసిన కథ. ప్రకృతి సంక్షోభం వచ్చినప్పుడు ఇళ్లను ఖాళీ చేయించే సమయంలో కలిగే ఆందోళనలమధ్య భార్యాభర్తలలో ఏర్పడుతున్న తాత్కాలిక అంతరాలు వెలికివచ్చే అంశంచుట్టూ అల్లిన కథ. స్థూలంగా కథాంశం ఇది. శశాంక్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగర బే ఏరియాలో పనిచేస్తున్న ఎన్నారై సాఫ్ట్ వేర్ ఇంజనీరు. అతని […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-3

కథన కుతూహలం -3                                                                 – అనిల్ రాయల్ ఎండు చేపా, ఎండు చేపా, ఎందుకున్నావు కథలో? అనగనగా అప్పుడెప్పుడో పూర్వకాలంలో, అదేదో దూరదేశంలో కుక్కలకి వేట నేర్పటానికో పద్ధతి పాటించేవాళ్లు. ఫలానాదాని వాసన చూపిస్తే దేవులాడుకుంటూపోయి దాని ఆచూకీ పట్టేయటం శునకరాజావారి పని . కానీ ఆ ఫలానా వాసనకన్నా ఘాటైన పరిమళమేదో వాతావరణాన్ని కమ్మేస్తే రాజావారి పరిస్థితేంటి? కాబట్టి, ఎట్టి పరిస్థితిలోనైనా అసలు వాసన మీదనే మనసు లగ్నం చేసేలా జాగిలాలకి తర్ఫీదునీయటం ముఖ్యం. అందుకోసం […]

Continue Reading
Posted On :

కథాకాహళి- అరుణకుమారి కథలు

కథాకాహళి- 21 ఎండార్ఫిన్స్ గురించి ప్రస్థావించిన యం. ఆర్. అరుణకుమారి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యం.ఆర్. అరుణ ఎమ్.ఏ. ,బి.యస్.సి., డి.ఎడ్ చేశారు. చిత్తూరు మండలం, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా 37 ఏళ్ళు పనిచేసి, 2020లో ఉద్యోగ విరమణ చేశారు. స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డులు పొందారు. ఆమె తండ్రి ఎం. ఆర్. చంద్ర  నుండి వారసత్వంగా వచ్చిన రచనా వ్యాసంగంలో ఇప్పటికి రెండు వందల కథలు రాశారు. […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-2

కథన కుతూహలం -2                                                                 – అనిల్ రాయల్ గత భాగంలో ‘బ్రహ్మాండం’ (అనువాద) కథ చదివారు. ఆ మూల కథలో నన్ను ఆకట్టుకున్న విషయాల్లో ఒకటి – మూల రచయిత Andy Weir వాక్య నిర్మాణంలో పాటించిన పొదుపు. కథకుడు పదాల వాడకంలో పొదుపెందుకు పాటించాలంటే – పొడుగాటి వాక్యాలు చదివి అర్ధం చేసుకోవటం కన్నా చిన్న వాక్యాలు అర్ధం చేసుకోవటం తేలిక కాబట్టి; అది పాఠకుల సమయాన్ని ఆదా చేస్తుంది కాబట్టి; అవసరమ్మేరకే వాడబడ్డ పదాలు […]

Continue Reading
Posted On :

కథాకాహళి- గోగు శ్యామల కథలు

కథాకాహళి- 20 ఆశ్రిత కులాల చైతన్య ప్రస్థావనలు – గోగు శ్యామల కథాప్రయోజనాలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి దళిత సాంస్కృతిక జీవితాన్ని“మాదిగోడు” కథలలో, నాగప్పగారి సుందర్రాజు మాదిగల ఊరుమ్మడి జీవితాన్ని చిత్రిస్తే, గోగు శ్యామల మాదిగ ఆశ్రితకుల స్త్రీల శ్రమైక జీవితాన్ని, ధైర్య, స్థైర్యాలను చిత్రించి దళిత స్త్రీవాద సాహిత్య సృజనశీలతను విస్తృతపరిచారు. దళితులలో కూడా మరింత అట్టడుగు జీవిక మాదిగలదైతే, అందులోనూ మాదిగ ఆశ్రితకులాల స్త్రీల వేదన ఎంత సూక్ష్మీకరించబడిన (మార్జినలైజ్డ్) కథాంశమో చెప్పవలసిన పనిలేదనుకుంటాను. […]

Continue Reading
Posted On :

కథనకుతూహలం-1

కథన కుతూహలం -1                                                                 – అనిల్ రాయల్ ఇటీవల తపన రచయితల కర్మాగారం ఫేస్ బుక్ గ్రూపులో ఎనిమిది భాగాలుగా వచ్చిన ‘కథాయణం’ పరంపరకి ఈ ‘కథన కుతూహలం’ కొనసాగింపు. దీనికి వేరే పేరు పెట్టటానికి కారణముంది. ‘కథాయణం’లో వివరించినవన్నీ ప్రతి కథకి అత్యవసరమైన అంశాలు: ఎత్తుగడ, ముగింపు, శీర్షిక, సంభాషణలు, దృక్కోణం, పాత్రలు, నిర్మాణం. అవి లేని కథ ఉండదు. అవన్నీ తగుపాళ్లలో ప్రతి కథకీ అవసరం. ఈ ‘కథన కుతూహలం’లో వివరించబోయే ప్రక్రియలు అన్నీ […]

Continue Reading
Posted On :

కథాకాహళి- జూపాక సుభద్ర కథలు

కథాకాహళి- 19 దళిత మహిళల ‘రాణిరికాన్ని’ డిమాండ్ చేసిన జూపాక సుభద్ర కథలు                                                                  – ప్రొ|| కె.శ్రీదేవి జూపాక సుభద్ర వరంగల్ జిల్లా, రేగొండ మండలం, దామరంచపల్లె లో 18/6/1961న జన్మించారు. ఎం.ఏ. వరకు చదువుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయం, హైదరాబాద్ లో అదనపు కార్యదర్శిగా పనిచేసి, పదవీ విరమణ చేశారు. ఈమె రచనలు ‘పంచాయితీరాజ్ లో దళిత మహిళల పాలన”, “అయ్యయ్యో దమ్మక్కా” కవితా సంకలనం -2009.  “రాయక్క మాన్యం” కథాసంకలనం-2014. ఇంకా కథలు, […]

Continue Reading
Posted On :
anuradha

కథాకాహళి- అనురాధ కథలు

కథాకాహళి- 18 తెలుగు సాహిత్యంలో మహిళల జైలుజీవితాన్ని చిత్రించిన  బి. అనురాధ  కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి బెల్లపు అనూరాధ 21 అక్టోబర్ 1963 పశ్చిమ గోదావరి జిల్లా జన్మించారు. సెయిట్ థెరీసా కాలేజీ ఏలూరులో బి.కామ్. చదువుకున్నారు. 1984 నుండి 1996 వరకూ హైదరాబాదులో సిండికేటు బ్యాంకులో ఉద్యోగం. స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, రాజకీయ జీవితంలోకి ప్రవేశించారు.1990-1993 ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘంలో కార్యకర్తగానూ, 1994 లో హైదరాబాదు కేంద్రంగా ఏర్పడిన మహిళా చేతన (మహిళా […]

Continue Reading
Posted On :

కథాకాహళి- విమల కథలు

కథాకాహళి- 1 7 సోషలిస్టు స్త్రీవాద కథావిస్త్రృతి విమల కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి విమల 1963లో జన్మించారు. హైదరాబాద్ లో పుట్టి, పెరిగిన విమల విద్యార్థి దశ నుండే ప్రజా ఉద్యమాల్లో రాజకీయ కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం రెయిన్‌బో చిల్డ్రన్స్ హోమ్ కన్సల్టెంట్ గా ఉన్నారు. కవి, కథకురాలుగా  తెలుగు పాఠకులకి విమల సుపరిచితురాలు. ‘అడవి ఉప్పొంగిన రాత్రి’, ‘మృగన’ రెండు కవిత్వ సంకలనాలు, “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు”  ఒక కథాసంకలనం, “నువ్వేం చేస్తావ్”, “అతడి […]

Continue Reading
Posted On :