
https://youtu.be/_LOaxuIrNZU
ప్రముఖ రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
(త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)
***
ప్రముఖ రచయిత్రి త్రిపురనేని రజనీ సుబ్రహ్మణ్యం గారు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి మనుమరాలు, త్రిపురనేని గోపీచంద్ గారి కుమార్తె, ప్రముఖ నటులు త్రిపురనేని సాయిచంద్ గారి అక్క. వారి నాన్నగారి అసమర్థుని జీవయాత్ర పట్ల మక్కువ తో తన కథాసంపుటికి “అసమర్థురాలి అంతరంగం” అని పేరు పెట్టారు.
రజని గారు తాతగారైన రామస్వామి చౌదరి గారి సూతాశ్రమంలో 1945 లో త్రిపురనేని గోపీచంద్, శకుంతలాదేవి గార్లకు జన్మించారు. మద్రాసు, కర్నూలు, హైదరాబాద్ లలో విద్యాభ్యాసం చేశారు. ఎం.ఏ సోషియాలజీ చేసారు. బెంగుళూరు నివాసం. మాబోజల్ ఏడ్ కంపెనీకి ఇంగ్లీషు నించి తర్జుమాలు చేశారు. అయిదు సంవత్సరాల పాటు స్పార్టెక్ టైల్స్ కంపెనీ బిజినెస్ చేశారు. మూడు షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అందులో వారణాసి లాస్ ఏంజిలిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో బెస్ట్ ఫారిన్ ఫిలిమ్ అవార్డు అందుకుంది. తోకచుక్క సినిమాకు సహరచయిత్రిగా పనిచేసారు.
ప్రచురణలు:
అసమర్థురాలి అంతరంగం (కథలు, వ్యాసాలు, అనువాదాలు)
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
