
ఇప్పుడు పల్లెవుంది!
-శోభరమేష్
తోట తగలబడి పోతుంటేగోళ్ళు గిల్లుకుంటూనిల్చోన్నవాణ్ణి !గుండెల మీద చితిపేర్చికొరకంచుతో నిప్పంటీస్తేమౌనంగా భరిస్తున్నవాణ్ణినా మూడొందల గడపల బతుకుశ్వాసలో !కల్తీగాలులు వీస్తుంటేనా వెయ్యిన్నూటపదారుకళ్ళ నరీక్షణికి వలసరెక్కలు పోడుచుకొస్తుంటేనా పల్లె పరాయితనంలోకిపరకాయ ప్రవేశం చేస్తుంటేనేనిప్పుడు ప్రేక్షకుణ్ణి మాత్రమేనిలువెల్లా నిరాశల గాయాల తొడిగినక్షతాత్మగాత్రుణ్ణి మాత్రమే మా పల్లెకి కలలమ్మినవాళ్ళే మా రాత్రిళ్ళని దోచుకున్నారుమా ఆశలకి నీరుపోసినవాళ్ళే మా చిరునవ్వులులాగేస్తున్నారుమా పొలాల్లో లంకెబిందెలు చూపిమా పంటలు నూర్చుకున్నారుఉదయ సాయంత్రాలు చిలకలువాలే తోటనితొండలు గుడ్లుపెట్టే బండనేలగా మార్చారుపల్లెబతుకు మీద సమాధికట్టిఅభివృద్ధికి ప్రాణం పోస్తున్నవాళ్ళుమండే కడుపుల పైన బండరాళ్ళ ఫలకాలు పాతివాగ్దానాల గుడ్లని పొదగడం మర్చిన గిన్నికోళ్ళుకంప్యూటర్ ప్రపంచాన్ని పల్లెచేసిందంటేపల్లె నిజాయితీని ప్రేమించిదనుకున్నానుప్రపంచాన్ని పల్లెచేసిపల్లెని నామరూపాల్లేకుండా చేసింది. పల్లెని యిల్లూ వాకిల్లేకుండా చేసింది.లేమాలో కూడ చేమట చెమ్మని నమ్ముకున్నపల్లెకి జీవితం లేకుండాచేసింది. ఇప్పుడు పల్లెవుందిపల్లెకి పేరుందిపల్లేతనమే పేరుకైనా లేదు !
*****

శోభరమేష్ పాపయ్యపేట, మండలం చిన్నారావుపేట, వరంగల్ జిల్లా వాస్తవ్యులు. కవయిత్రి, విమర్శకురాలు, అధ్యాపకురాలు, ఎం. ఏ., పి. హెచ్ డి., ఎం. ఏ. సంస్కృతం చదివారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ‘తెలుగు సాహిత్య విమర్శ : స్త్రీల కృషి’ (2012) పై పరిశోధన చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ మహిళా కళాశాల, వరంగల్ లో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు.
రచనలు :
‘తెలుగు సాహిత్యంలో స్త్రీవాద విమర్శకులు’ (వ్యాససంపుటి) – 2015
‘వ్యాస శోభిత’ (వ్యాససంపుటి) – 2015
‘స్త్రీల కృషి’ (తెలుగు సాహిత్యవిమర్శ) – 2018
