
మిస్సోరీ లో (అనువాద కవిత)
-దాసరాజు రామారావు
నేనున్న మిస్సోరీలో
ఒక సగటు మనిషి
ఒక కఠిన మనిషి
బాధకు అర్థం తెలియని
చలన రహిత మనిషి
కడుపులో పేగుల్ని దేవేసినట్లు
హింసిస్తుంటడు
వాణ్ణి చల్లని వాడనాల్నా
పరమ కసాయి
ఆ మనిషి
నేనెప్పుడూ మధురమైన మనిషిని కలువలేదు
దయగల మనిషిని
నిజమైన మనిషిని
ఎవరొకరో చీకటిలో వుంటే
భరోసా మనిషి తోడుండాలనుకుంట
ఖచ్చితమైన మనిషే
ఆ మనిషి
జాక్సన్ ,మిస్సిసిపీలో
లక్షణమైన పురుషులున్నరు
కొందరు బలమైన వాళ్లు
కొందరు నల్లవాళ్ళు
సైనిక నడక వంటి ఔత్సాహిక పురుషులు
గోధుమవన్నె పురుషులు
ఆ పురుషులు
ఒబెర్లిన్, ఒహాయియో లో మంచి పురుషులున్నరు
న్యాయమైన పురుషులు
అందమైన పురుషులు
నిన్ను చేరుకొని, స్వస్థత చేకూర్చే అభిమాన పురుషులు
యోగ్యులైన పురుషులున్నరు
ఇప్పుడు నాకు తెలిసింది
మంచి మరియు చెడ్డ పురుషులుంటరని
కొందరు నిజమైన పురుషులు
కొందరు కర్కశ పురుషులు
ఆడవాళ్లూ, శోధన కొనసాగించండి మీ స్వంత మనిషి కోసం
ఆ ఉత్తమ మనిషి
మీ కొరకు మనిషి
( మూలం: మాయా ఆంగిలౌ ఆంగ్ల కవిత )
*****

1955 లో జననం,సిద్ధిపేట ప్రాంతం.టీచరుగా 2013 లో రిటైర్మెంట్. శ్రీశ్రీ మహాప్రస్థానం ,ఉన్నవ మాలపల్లి సాహిత్య అవసరం ,అక్షరం విలువ నేర్పినయి. 45 ఏళ్ల సాహిత్య ప్రయాణం లో గోరుకొయ్యలు,పట్టుకుచ్చుల పువ్వు ,విరమించని వాక్యం కవిత్వ సంపుటాలు – ప్రోత్సాహకాలుగా ఉమ్మిడిశెట్టి ,సమైక్య సాహితి ,పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అవార్డులు. మంజీరా రచయితల సంఘం లో శాశ్వత సభ్యున్ని.
ప్రధానంగా సాహిత్య సృజన – జీవన గమన ప్రేరణాత్మక ఆచరణ గ ఉండాలని నమ్ముతాను.
