
“న్యాయం కావాలి” రచయిత్రి శ్రీమతి డి.కామేశ్వరి గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
డి.కామేశ్వరి సుప్రసిద్ధ కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. ఈమె 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, 1 కవితా సంపుటి వ్రాసారు. “కొత్తమలుపు” నవల “న్యాయం కావాలి” సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
కామేశ్వరిగారు 1935, ఆగష్టు 22వ తేదీన కాకినాడలో జన్మించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పెరిగి అక్కడే విద్యను అభ్యసించారు. 1952లో శ్రీ డి.వి.నరసింహంతో పెళ్ళి అయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించారు. భర్త పదవీవిరమణ తర్వాత 1984లో హైదరాబాదులో స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
1962లో ఆంధ్రపత్రికలో ‘వనితలు వస్త్రాలు’ అనే వ్యాసంతో రచనావ్యాసంగం ప్రారంభించారు. అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు – ఆకాకరకాయలు అనే కథ వీరు వ్రాసిన తొలి కథ. 1968లో వ్రాసిన కొత్తనీరు మొదటి నవల. వీరి కథలు, నవలలు హిందీ, కన్నడ, తమిళభాషలలో అనువాదం చేయబడ్డాయి. అనేక కథలకు, నవలలకు పోటీలలో బహుమతులు వచ్చాయి.
నవలలు:
కొత్తనీరు
కొత్తమలుపు
కోరికలే గుర్రాలైతే
ఎండమావులు
మనసున మనసై
జీవితం చేజారనీయకు
కార్యేషు మంత్రీ
అరుణ
కథాసంపుటాలు:
వానచినుకులు
కాదేదీ కథ కనర్హం
డి కామేశ్వరి కథలు
కాలాన్ని వెనక్కు తిప్పకు
మధుపం
అతకని బతుకులు
ఇది జీవితం
కన్నీటికి విలువెంత
చీకటి తొలగిన రాత్రి
తల్లిమనసు
నయనతార
ట్రావెలాగ్:
నా విదేశీయాత్రానుభవాలు
పురస్కారాలు:
గృహలక్ష్మి స్వర్ణకంకణము -1971
మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు -1991
మాదిరెడ్డి సులోచన అభినందన అవార్ఢు – 1994
తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు – 1990, 1994, 1999
నంది పురస్కారం – టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథారచయిత – 2009
ఉత్తమ సినీ కథారచయిత్రిగా న్యాయం కావాలి సినిమాకు సితార, ఆంధ్రభూమి, వంశీ-బర్కిలీ, సినీహెరాల్డ్, కళాసాగర్ సంస్థల నుండి 5 అవార్డులు -1981
ఎండమావులు నవలకు గోపీచంద్ అవార్డు – 2006
సుశీలా నారాయణరెడ్డి అవార్డు – 1998
*****
https://youtu.be/UJJn-8NGfiU

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
