
కనబడుట లేదు ! ( కవిత)
-రామ్ పెరుమాండ్ల
కళ్ళున్నాచూపులేదు .బహిరంగంగా చూడడం మానేశాకఅంతర్గత అల్లకల్లోలం మరెప్పుడు చూస్తానో ! అక్కడన్ని కిరాతకంగా కుతికె పిసికి చంపిన మరణాలే అగుపిస్తాయి.అచ్చం మేకపిల్లను అలాల్ చేసినట్లు జీవగంజి ఆశచూపి జీవం తీసుకున్నా క్షణాలెన్నో , కంచంలోకి మెతుకులు రావాలంటే కాసిన్ని కుట్రలు నేర్వాలని ,పూటకో పాటందుకున్న రోజులెన్నోనిజమే వేశ్య వేషమేసినా వ్యవస్థలెన్నో దొంగకొడుకుల రాజ్యానమూగబోయిన నన్ను సందుగలో దాచిన చిన్నప్పటి పలక చీదరించుకొని చెంప చెల్లుమనిన సందర్భాలెన్నో ! నేరం నాదే నేరస్థుడే కనపడుట లేదు. లెక్కతేలనికత్తిపోట్లతో కొన ఊపిరితో తప్పిపోయిన నేను నాకు కనపడుట లేదు.
*****

నా పేరు రామ్ పెరుమాండ్ల. మాది నాగర్ కర్నూల్ జిల్లా మాధారం గ్రామం. నేను ప్రయివేట్ టీచర్ గా పని చేస్తున్నాను. డి.యడ్, బి.యస్సి , బి. యడ్ చదివాను. నేను పదవ తరగతి నుంచి మా గురువు గారు పెన్నా శివ రామకృష్ణ శర్మ గారి ప్రొత్సహంతో మొదట నాటకాలు రాసేవాడిని ఆ తరువాత కవితలు ,కథలు రాస్తున్నాను . అందులో భాగంగానే 2019 సంవత్సరంలో “మరోకోణం”అనే కవిత సంపుటిని తీసుకొచ్చాను .అలాగే ఉరేనియం , తొండెం బొక్కెన ,వందేళ్ళ తెలంగాణ దళిత కథలు అనే పుస్తకాలలో కథలు రాసాను. నా మొట్ట మొదటి కథ “కన్నీటి కథ “2020లో నవ తెలంగాణ పత్రిక లో ప్రచురితమయ్యింది.సామాజిక అంశాలపై కవితలు ,కథలు రాస్తున్నాను .
