

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
డా.గీత గారి సెలవుల కవిత చాలా బాగుంది. మా బాల్యంలో శెలవులిస్తే ఆరుబయట మైదానంలో, పచ్చగడ్డిమీద పరుగులు పెడుతూ, నన్ను అందుకోమంటూ పరుగులాటలు, దాగుడుమూతలూ, కోతీకొమ్మచ్చి ఆటలు, ఆడపిల్లలు తొక్కుడు బిళ్లాటలు, చింతగింజాటలు, వైకుంఠపాళీ లాంటివి ఎన్నో ఆడుకునేవాళ్లం. అమ్మ మంచినీళ్ల కోసం కాలువ కెడుతుంటే, నేనూ వస్తానంటూ చిన్న చిన్న బిందెలు చంకనెత్తుకుని పరుగులు తీసేవాళ్లం. ఇప్పుడన్నీ ఇండోర్ గేమ్స్ మాత్రమే. సెల్ ఫోన్లూ, ఐ పాడ్లూ ఉంటే అన్నం, నిద్రం అవసరముండదు. మానసిక వికాసం నేటి తరపు పిల్లల్లోనే ఉందంటారు. అప్పటి పిల్లలుకంటే ఇప్పటితరం పిల్లలకే నాలెడ్జ్ ఎక్కువ ఉంటుందంటారు. నిజమే నాలెడ్జ్ ఉండచ్చు గానీ, ఆ తెలివితేటలూ, విజ్నానం వెర్రితలలు వేసేటట్లు ఉండకూడదు. నాలెడ్జ్ ను తగిన రీతిలో ఉపయోగించుకుంటేనే, సమాజానికీ, ముఖ్యంగా నేటితరం పిల్లలకు ఎంతో ఉపయోగిస్తుంది. పక్కదారి తొక్కకుండా ఉండడానికి తగిన జాగ్రత్త తీసుకోవాలి.
“పిల్లల ఇష్ట కష్టాలు
అడిగే దేమిటి?
అష్టకష్టాలు పెట్టి
చదివించి
బాగా డబ్బు
సంపాదించే
యంత్రాలను చేయడమే !”
పిల్లల్లో ఊహాశక్తిని వారిలో దాగున్న సృజన శక్తులను
అణచివేసే పిల్లల పెంపకం… ఎవరు మార్చాలి ఆ తల్లితండ్రులను …?!!
మీ సంపాద కీయం “ సెలవులు” .- నిజం..సెల్ ఫోన్లు, ఐ పాడ్లలో ,వీడియో గేముల్లో మునిగిపోయి “సెలవుల “ను ఆస్వాదించే ఈ తరం పిల్లలు ..।🤔😌