image_print

కథామధురం-ఆ‘పాత’కథామృతం-15 ఆచంట సత్యవతమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-15 “గ్రుడ్డిగా నడిస్తే గోతిలో పడడమే” — ఆచంట సత్యవతమ్మ  -డా. సిహెచ్. సుశీల ఆది శంకరాచార్యుల వారు యావద్భారత దేశం పర్యటించి హైందవం, సనాతన ధర్మం సంబంధిత గ్రంథాలను, భాష్యాలను, వ్యాఖ్యానాలు చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. అనేకమంది శిష్యులు వారిననుసరించారు. శంకరాచార్య నాలుగు ప్రముఖ పీఠాలను ఏర్పాటు చేయడమే కాక సన్యాసుల కొరకు వివిధ ప్రాంతాలలో మఠాలను ఏర్పాటు చేసారు. శంకరుల వారి తదనంతరం వారి శిష్య ప్రశిష్య గణాలు […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-14 భాస్కరమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-14 ప్రభావతి – రచయిత్రి “భాస్కరమ్మ”  -డా. సిహెచ్. సుశీల ఆ. భాస్కరమ్మ రచించిన “ప్రభావతి” అనే కథ 1926 ఆగస్టు, భారతి పత్రికలో ప్రచురించబడింది.            కాకినాడ పట్టణంలో శాస్త్రవిజ్ఞానంలోను, సంప్రదాయ, సంపదలలోను, దాతృత్వం లోను యోగ్యుడైన ఒక నియోగ బ్రాహ్మణుడు పెమ్మరాజు గోపాల్రావుగారి సంతానములో మొదటి పుత్రిక లక్ష్మీదేవమ్మ. ఆమెకు పదునారవ ఏట ఒక కుమారుడు పుట్టిన ఆరు నెలలకే భర్త మరణించగా పిల్లవాడిని అల్లారుముద్దుగా […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-13 కొమ్మూరి పద్మావతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-13 కొమ్మూరి పద్మావతీదేవి  -డా. సిహెచ్. సుశీల తెలుగు నాటకరంగంలో పూర్వం స్త్రీ పాత్రలను కూడా పురుషులే ధరించడానికి కారణం నాటకాల్లో నటించడం సంసారపక్షం స్త్రీలకు కూడదన్న బలమైన విశ్వాసం సమాజంలో ఉండడమే. ఈ నాటికీ నాటకాల్లో స్త్రీ పాత్రలు చాలా పరిమిత సంఖ్యలో ఉండడం గమనించవచ్చు. అలాంటి రోజుల్లో నాటక చరిత్రలో ప్రముఖుడు బళ్ళారి రాఘవ తను ప్రముఖ న్యాయవాది అయినా నాటకరంగం పట్ల ప్రత్యేకాభిమానంతో, నిజానికి అదే తన జీవిత […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-12 వేదుల మీనాక్షీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-12 వేదుల మీనాక్షీదేవి  -డా. సిహెచ్. సుశీల తెలుగులో తొలి కథ 1910 లో గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ అన్న ప్రచారం విస్తృతంగా ఉన్నా, స్త్రీవాదులు ప్రత్యేకంగా శ్రద్ధగా పట్టుదలగా చేసిన పరిశోధన వల్ల 1902లో భండారు అచ్చమాంబ గారి ” ధన త్రయోదశి” తొట్టతొలి కథ అని నిర్ధారణ అయింది. 1893 నుండే ఆమె చాలా కథలు రాసినట్టు తెలిసినా 10 మాత్రమే లభ్యమై నాయి. అలాగే అనేక కథలు, […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-11 ఆచంట శారదాదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-11 ఆచంట శారదాదేవి  -డా. సిహెచ్. సుశీల స్త్రీలు కలం పట్టిన నాటి నుండి కూడా ‘ స్త్రీ పురుష సంబంధాలలోని అసమాన తలు’ గురించి అవగాహనతో రాసినట్టే స్పష్టమవుతోంది. భర్త ఎలాంటి వాడైనా అతన్ని భరించడం, పూజించడమే ‘సతీ ధర్మం’ వంటి కథలు కొన్ని వచ్చినా, ‘ స్త్రీ కి మెదడు ఉంటుంది, హృదయం ఉంటుంది, ఆలోచనలు అభిరుచులు ఉంటాయి’ అన్న స్పృహ తో రాసిన కథలే ఎక్కువ. భావుకత, ప్రకృతి […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-10 యల్లాప్రగడ సీతాకుమారి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-10 యల్లాప్రగడ సీతాకుమారి  -డా. సిహెచ్. సుశీల విద్యా, వైజ్ఞానిక రంగాలలో ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రగతి శీల దృక్పథం, దేశభక్తి భావన, విశ్వమానవ సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తోందని వేదికల మీదా, అక్షరాల్లోనూ మాత్రమే కనిపిస్తోందని చెప్పక తప్పదు. కులమూ, మతమూ, ప్రాంతమూ, భాషావైషమ్యా లతో మనుషులు ముక్కలు ముక్కలుగా విడదీయబడడం జరుగుతూనే ఉంది. ఇది అన్యాయమే కాక అనైతికం.            మతం కన్నా మానవత్వం మిన్న. నిజానికి మతం […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-9 భండారు అచ్చమాంబ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-9 భండారు అచ్చమాంబ  -డా. సిహెచ్. సుశీల “నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహమాడుట వలనను భర్తకు దాసి నగుదునా యేమి ?” తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు కథ 1910 లో గురజాడ అప్పారావు రాసిన “దిద్దుబాటు” (ఆంధ్ర భారతి పత్రికలో) అని అత్యధికులు భావించారు. చాలా ప్రక్రియ లకు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ప్రారంభకులు అని తీర్మానం చేయడం వల్లనో, మరే కారణం వల్లనో కానీ […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-8 స్థానాపతి రుక్మిణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-8  -డా. సిహెచ్. సుశీల తెలుగు కథానిక ఉద్భవించి దాదాపు నూట పాతికేళ్ళు అవుతున్న కాలంలో, ఏ ప్రక్రియలోనూ రానంత విస్తృతంగా, విస్తారంగా “కథ” తన ప్రత్యేకతను ప్రతిభను సంతరించుకుంది. ఎందరో కథకులు వివిధ ఇతివృత్తాలలో, సమాజపు పోకడలను, జీవితాలను, జీవన విధానాలను, సమస్యలను బలంగా చిత్రించారు.            కొన్ని వేల మంది కథకులు రకరకాల కథావస్తువులను స్వీకరించి వైవిధ్యభరితంగా చిత్రించారు. కానీ రచయిత్రుల సంఖ్య చాలా తక్కువ. […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-7 ఇల్లిందల సరస్వతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-7  -డా. సిహెచ్. సుశీల ఇల్లిందల సరస్వతీదేవి          15.8.1947 న భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న స్త్రీ పురుషుల త్యాగఫలంగా దేశానికి స్వాతంత్య్రం లభించిన సందర్భంగా సంతోషంతో అనేక కవితలు, కథలు వెల్లువలా పొంగులెత్తాయి.           స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశ సంరక్షణా, దాని కొరకు వచ్చిన సాహిత్యం గురించీ ముఖ్యంగా చెప్పుకోవాలి. స్త్రీల వ్యక్తి స్వాతంత్య్రం, స్త్రీల సాధికారతకై […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-6 సమయమంత్రి రాజ్యలక్ష్మి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-6  -డా. సిహెచ్. సుశీల సమయమంత్రి రాజ్యలక్ష్మి             భారతదేశ స్వాతంత్య్ర సాధనోద్యమంలో స్త్రీలు కూడా చైతన్యవంతంగా పాల్గొనా లని, రాచరికపు పరదాల కాలం తీరిపోయిందని, దేశ స్వాతంత్య్రంతో పాటు స్త్రీ ‘వ్యక్తి స్వాతంత్య్రం’ కూడా అత్యవసరమని గుర్తిస్తూ ఆనాడు విస్తృతంగా వ్యాసాలు, కవితలు, కథలు వచ్చాయి.           సామాజికంగా కౌటుంబికంగా తమకున్న సంకెళ్ళను తెంచుకోవడానికి స్త్రీలు ప్రయత్నించారు. అయితే ‘మితవాద’ ధోరణిలోనే […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-5 సి.హెచ్. వు. రమణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-5  -డా. సిహెచ్. సుశీల సి.హెచ్. వు. రమణమ్మ                    జాతీయోద్యమం, స్త్రీల హక్కులు, కులమత రహిత సమాజ నిర్మాణం వంటి విషయాల పట్ల అవగాహనతో, చైతన్యవంతమైన కథలు రచించిన నాటి రచయిత్రులు – ‘వర్గ పోరాటం ‘ శ్రమ జీవుల నుండి ధనిక వర్గం చేసే దోపిడీ వైపు కూడా దృష్టి సారించారు. ఎందరో కష్టజీవుల శ్రమను తమ బొక్కసంలో దాచుకొనే […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-4 పులవర్తి కమలావతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-4  -డా. సిహెచ్. సుశీల   “ప్రథమ దళితోద్యమ కథా రచయిత్రి*”పులవర్తి కమలావతీదేవి                  1930 లలో స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పురుషులతో ధీటుగా పాల్గొని, జైలు కెళ్ళడం తో పాటు, రాజకీయ వ్యవహారాలలో తీర్మానాలు చేయడం ద్వారా తమ భాగస్వామ్యాన్ని నిరూపించుకున్నారు. అఖిల భారత స్థాయిలో ఎన్నెన్నో మహిళా మహాసభలలో చురుగ్గా పాల్గొన్నారు.              స్త్రీలు చదువుకుంటే ఏ […]

Continue Reading

కథామధురం-ఆ’పాత’కథామృతం-3 దుర్గాబాయి దేశముఖ్

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-3  -డా. సిహెచ్. సుశీల   “ఆంధ్రా మదర్ థెరీసా”దుర్గాబాయమ్మ                  బహుముఖ ప్రజ్ఞాశాలి యైన ” మహిళా రత్నం”, మాతృదేశ విముక్తి ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన “వీర దుర్గ”, విద్యాధికురాలై, న్యాయవాద వృత్తిని స్వీకరించి, న్యాయం కోసం – ముఖ్యంగా మహిళల కోసం పోరాడిన “స్త్రీ మూర్తి”, నిరంతరం సామాజిక సేవా తత్పరురాలై మహిళాభ్యుదయం కొరకు “ఆంధ్ర మహిళా సభ” ను స్థాపించి, ఎందరో […]

Continue Reading

కథామధురం-ఆ’పాత’కథామృతం-2 పొణకా కనకమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-2  -డా. సిహెచ్. సుశీల పొణకా కనకమ్మ కథారచన         ఊయల లూగించే కోమల కరాలేరాజ్యాలు శాసిస్తవితూలిక పట్టే మృదు హస్తాలేశతఘ్నులు విదిలిస్తవిజోలలు బుచ్చే సుకుమారపుచేతులే జయభేరులు మోగిస్తవి              — పొణకా కనకమ్మ           నెచ్చెలి గీత గారి సూచన మేరకు 1950 కి పూర్వం రచయిత్రుల కథలను విశ్లేషించటం ఈ వ్యాసాల ప్రధాన ఉద్దేశ్యం. ఆ […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-1 కనుపర్తి వరలక్ష్మమ్మ కథ “కుటీరలక్ష్మి”

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-1  -డా. సిహెచ్. సుశీల 20 వ శతాబ్దపు మొదటి దశకం లోనే తమ తోటి స్త్రీలను చైతన్య పరచడానికి కవయిత్రులు, రచయిత్రులు సాహిత్య సృజన చేసారు. ఐదారు తరగతుల వరకు చదివి, వివాహం చేసుకొని, కుటుంబ బాధ్యతలలో తలమునకలైన ఇల్లాళ్ళుకూడ కుటుంబంలో, సమాజంలో స్త్రీ పురుష వివక్షతను గుర్తించారు –  ఆలోచించారు – రచనలు చేసారు.               స్త్రీ విద్య ఆవశ్యకత, స్త్రీ స్వేచ్చా స్వాతంత్య్రం […]

Continue Reading

కథామధురం-కె.కె.భాగ్యశ్రీ

కథా మధురం  కె.కె.భాగ్యశ్రీ ‘ఇంటి అల్లుడికీ వుంటుంది – అత్త మామల బాధ్యత’ అని చెప్పిన కథ..అనుసరణీయం !  -ఆర్.దమయంతి ***           ‘వివాహానంతరం అమ్మాయికి అత్తమామల బాధ్యత వున్నట్టే అబ్బాయికి కూడా ఆ నైతిక బాధ్యత తప్పనిసరి, అని మరవకూడదు. ఇది చట్టంగా రూపు దిద్దుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.’ ***           ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ చదువుకుని, ఇద్దరూ సమానంగా సంపాదిస్తున్నవారే! […]

Continue Reading
Posted On :

కథామధురం-నందు కుషినేర్ల

కథా మధురం  నందు కుషినేర్ల ‘ఇది ఒక రచయిత్రి నిజ జీవిత కథాకావ్యం !’  -ఆర్.దమయంతి ***           ఇంటి స్త్రీ విలువ గానీ , ఆమెలో దాగిన కళా తపన కానీ, విద్వత్తు కానీ చాలా మంది మగవాళ్ళకు తెలీదు.  తెలిసినా గుర్తించరు. ఆమె – తల్లి కావొచ్చు. సోదరి కావొచ్చు. లేదా భార్య కావొచ్చు. వారిలో దాగిన కళని వెంటనే గుర్తించి, ప్రోత్స హించి , వెలుగులోకి తీసుకు […]

Continue Reading
Posted On :

కథామధురం-బుద్ధవరపు కామేశ్వరరావు

కథా మధురం  బుద్ధవరపు కామేశ్వరరావు ‘మానసిక ఒత్తిళ్ళకు మందు లేదు. కానీ ఒక విలువైన జపమాల వుంది..’ అని చెప్పిన కథ!  -ఆర్.దమయంతి ***           ‘ఇవాళ నేను – అస్సలు పని ఒత్తిడికి గురి కాకూడదు.’ అని అనుకుంటూ నిద్ర లేవడం తోనే మొదలౌతుంది స్ట్రెస్..’ ఇది చదివితే నవ్వొస్తుంది కానీ, నిజమేమిటంటే – ఈ ఆధునిక యుగంలో ప్రతి మహిళా మానసిక ఒత్తిడికి గురికాక తప్పడంలేదనే చెప్పాలి. కారణం […]

Continue Reading
Posted On :

కథామధురం-శ్రీమతి డి.వి.రమణి

కథా మధురం  శ్రీమతి డి.వి.రమణి ‘జగమంతా దగా చేసినా, చిగురంత ఆశ చూసిన ఓ స్త్రీ కథ!’  -ఆర్.దమయంతి ***           కొంత మంది స్త్రీలు తమ ప్రమేయం లేకుండానే ఒంటరి అగాధపు లోయలోకి తోసేయబడతారు. కారణాలు అనేకం. ఎదిరించలేని పరిస్థితులు, చుట్టూ నెలకొన్న కుటుంబ వాతావరణం కావొచ్చు. ఆ పైన నిరాశ, నిస్పృహలకు లోను కావడం, పోరాడ లేక ఓటమిని అంగీకరిస్తూ విషాదంలో మిగిలి పోవడం జరుగుతూ వుంటుంది. తత్ఫలితంగా […]

Continue Reading
Posted On :

కథామధురం-సావిత్రి రమణారావు

కథా మధురం  సావిత్రి రమణారావు ‘భార్యని పురుగులా చూడటమూ హింసే! మానసిక హింసే..’ – అని చెప్పిన కథ!  -ఆర్.దమయంతి ***           వివాహిత స్త్రీలు నిరాశకి గురి అవడానికి గల ప్రధాన కారణాలలో ప్రధానమైనది  – కుటుంబంలో వారి ఉనికి కి విలువ లేకపోవడం. భర్త చులకన గా చూడటం,  హేళనతో గేలి చేయడం, పదిమందిలో పలచన చేసి మాటలతో అవమానించడం, మాటిమాటికి తూలనాడటం, హీనమైన తిట్లు తిట్టడం.. వంటి […]

Continue Reading
Posted On :

కథామధురం-ఎస్.శ్రీదేవి

కథా మధురం  ఎస్.శ్రీదేవి ‘ప్రేమ అనే పదానికి స్వచ్ఛమైన నిర్వచనంలా నిలిచిన ఓ స్త్రీ కథ’ – గుండెలోతు!  -ఆర్.దమయంతి ‘Goodness in words creates trust, goodness in thinking creates depth, goodness in giving creates love.’ -Laozi. ***           భార్య గత జీవితం లో ఒక ప్రేమ కథ వుందని, అందులో ఆమె పాత్ర ఏమీ లేదని తెలిసినా నమ్మలేని మగ బుద్ధి పోకడలు […]

Continue Reading
Posted On :

కథామధురం – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ

కథా మధురం దర్భా లక్ష్మీ అన్నపూ ర్ణ ‘ప్రతి స్త్రీ తనని తాను గౌరవించుకోవడం నేర్వాలి..’ అని చెప్పిన రచయిత్రి – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారి కథ – ‘మనోరథం ‘ !  -ఆర్.దమయంతి స్త్రీ తనని తాను గౌరవించుకోవడం అంటే తన విలువని వ్యక్తపరచుకోవడం!  కానీ, కొంతమంది మగాళ్ళు  అర్ధం చేసుకోరు.  అర్ధమయ్యాక -మరి కొంతమంది సహించుకోలేరు. ‘ఆఫ్ట్రాల్..నువ్వేమిటీ, నీకు గౌరవమేమిటి? దాన్ని నేను లెక్క చేయడమేమిటీ? అని తేలిక చూపు చూస్తారు. అలా […]

Continue Reading
Posted On :

కథామధురం-డా.లక్ష్మీ రాఘవ

కథా మధురం డా.లక్ష్మీ రాఘవ స్త్రీ శాంతమూర్తి మాత్రమే కాదు, ఉగ్రరూపిణి కూడా! అని నిరూపించిన కథ-     ‘ఆమె ఒక శక్తి !’  -ఆర్.దమయంతి ‘స్త్రీలకు కుటుంబపరంగా దక్కే న్యాయం ఎంత గొప్పదంటే.. ఏ చట్టాలూ, న్యాయ స్థానాలూ చేయలేని  మేలు కంటే కూడా మిన్నయినది.’ *** జీవితం లో ఆడది – మగాడి వల్లే మోసపోతుంది. అతని కారణంగానే  కష్ట పడుతుంది. అన్నివిధాలా నష్టపోతుంది. అయితే అతను భర్తే కానవసరం లేదు. అతను  అన్న […]

Continue Reading
Posted On :