దళిత స్త్రీ ల శ్రమ జీవన దర్పణం “రాయక్క మాన్యం”

   -సరోజన బోయిని

జూపాక సుభద్ర గారి కలం నుండి వెలువడిన ఆణి ముత్యాల లాంటి   17 కథల  సంకలనం..ఈ “రాయక్క మాన్యం” పుస్తకం. జూపాక సుభద్ర గారు నాకు పెద్దగా పరిచయం లేకపోయిన..వారి ఇతరత్రా రచనల పై కూడ అవగాహన లేక పోయిన..మహిళలు రాసిన పుస్తకాలపై సమీక్ష రాయాలి అన్న నా తపనను చూసి..మా ఆత్మీయ సోదరి  జ్వలిత గారు మహిళలు అన్నింటా ముందు ఉండాలి అని మహిళల ఆత్మాభిమానానికి పెద్ద పీట వేస్తూ..ఇప్పుడు,ఇప్పుడే కొత్తగా సాహితీ రంగం లో తప్పడగులతో నడక మొదలు పెట్టిన నా లాంటి మహిళలను ప్రోత్సహిస్తూ..వేలు పట్టుకొని తను ముందు ఉండి మాకు మార్గ నిర్దేశిగా  మా గమ్యం ఎటు వైపో చూపే ప్రయత్నమే  నాకు ఈ పుస్తకాన్ని పరిచయం చేసి నాతో ఇంత మంచి పుస్తకం చదివించింది.. ఇక ఈ పుస్తకం లో అన్ని మహిళా ప్రాధన్యం ఉన్న పాత్రలతో రూపొందించిన కథలే ఉన్నాయి..ఆనాడు ,కొంతలో కొంత మార్పు వచ్చిన ఈనాటికి దళిత స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలు,వాల్ల బాధలు,వాల్ల శ్రమైక జీవనం.ముక్యంగా ఆధిపత్య ధోరణితో అణిచి వేతకు గురి అవుతున్న వారి జీవితాలు.కుల వివక్ష తో వాళ్ళను అంటరాని వాళ్ళని చేసి వాల్ల పట్ల నైతిక విలువలు మరిచిన కుళ్ళుతో,కుట్రలతో కూడిన ఈసమాజ ధోరణి గురించి అద్దం పట్టినట్టు చూపించారు..ఈ పుస్తకం లోని ప్రతీ కథ చాల సులభంగా అర్థం అవడమే కాక ఈ సంఘటన మన ముందే జరిగింది గా అనే టట్లు కళ్ళకు కట్టి నట్టు చూపించారు..ఇవి తెల్ల కాగితం పై రాసిన నల్ల అక్షరాలు కాదు.ఇవి దళిత ఆడిబిడ్డల ఆత్మాభిమానానికి ప్రతీకలు,ఈ సమాజం లో వివక్ష పేరుతో వాళ్ళు పడుతున్న అగచాట్లు..బాషా పెత్తనం ఎలా రాజ్యమేలుతుంది అనేది కూడ చాల చక్కగా చెప్పారు..ఈ రచయిత.. “బల్లెనే దోస్త్  ఊళ్లే గాదు” ఒకే ఊరికి చెందిన ఇద్దకు ఆడబిడ్డలు ఒకే బడికి పోయిన బడిలో వాళ్ళు కులవివక్ష మాని ఇద్దరు కలిసి ఉన్న..మళ్ళీ ఊళ్ళో కి అచ్చె వరకు అంటరానితనం అని కులం తో వెలివేయబడి గాయపడిన పసి హృదయానికి దర్పణం.ఒకరి బట్టలు ఒకరు వేసుకున్నందుకు.ముట్టుడు అనే పేరుతో అగ్ర కులం తల్లి మళ్ళీ ఆ బట్టలు నువ్వు ఎలా వేసుకుంటావ్ అని అవి ముట్టుడు అయినయ్ అని ఒక దళిత ఆడ బిడ్డ వేసుకుందుకు ఆ బట్టలనే కాల్చి బూడిద చేసిన వైనం..మరి ఇద్దరం ఒకే బడికి కలిసి పోతున్నాం ఒకరి బట్టలు ఒకరు వేసుకుంటే తప్పు ఏంటి అని అడిగిన తన కూతురికి బల్లె నీ దోస్త్ కావచ్చు ఏమో గాని ఊళ్లే కాదు అని బదులు చెప్పిన తీరు..ఒక్కసారి అందరిని ఆలోచనలో పడి వేస్తుంది.. “షానిల బడాలే” రిజర్వేషన్ లతో అట్టడుగు వర్గాలను అభివృద్ధి లోకి తేవాలని ప్రభుత్వం ఎన్ని చేసిన పేరు మాత్రమే వాళ్ళది మళ్ళీ వాళ్లపై పెద్దరికం మాత్రం అగ్ర కులాలదే..ఒక దళిత మహిళ ఎన్నికలలో గెలిచి ఎంపీపీ  పదవి వచ్చిన..తనలో ఏదో తెలియని బిడియం తన కట్టు బొట్టు చూసి అందరు పేర్ల వెట్టుతరని. చదువు రాని నేను ఆఫీస్ కు పొయ్యి రేపు ఎమ్ మాట్లాడాలి.ఎలా సంతకాలు చేసుడో అని.ఇగ మండల ఆఫీసు కు తీసుకపోవడానికి కూడ దొర జీబులోనే.గోసిచీర కట్టుకొని  ఆఫీసుకు ఎట్ల పోవుడు. పోనీ గోల్సాడు ఎద్దాం అంటే నడుమంత్రం సిరి ఆగనిత్తలేదు అంటరు.అంటూ తన భర్త తోని తన ఆవేదన అంత వెళ్ల పోసుకుంటా. ఓ.మంచి చీర కూడ లేకపాయే అనే.బాధ..చివరికి ఆఫీసులో కూడ తను ఎంపీపీ అయిన తనకు కాకుండ దొరికే నమస్కారం చేయడం..దొరసాని చేసిన అవమానం..గోసి పెట్టుకొనే ఆఫీస్ కు పోతావానే అని.ఇలాంటి అవమానాలను ఎదుర్కొనటానికి తను కూడ మారాలే..అనే  ఆ దలత స్త్రీ ఆవేదనను చక్కగా చూపించారు..రచయుత “దేవిపోతల కారటి” పల్లె జీవనం కుటుంబ విలువలు ఆత్మీయ అనురాగాలను చూపించే కథ.తనకు చదువు రాకున్నా తన ఎదలోని సొదను చదువు వచ్చిన వాళ్లతో ఉత్తరం రాయించి తన చెల్లికి పంపి..తన కుటుంబ విషయాలతో పాటు..ఊరు విషయాలు మంచి ,చెడ్డ అన్ని వివరిస్తూ.పండగకు తన చెల్లిని రమ్మని ప్రేమతో రాసే ఉత్తరం..కలో,గంజో కలిసి పంచుకొని ఒక్కకాడ పండగ జేసుకోవాలని ఓ..అక్క పడే తపన.ఉరుకుల,పరుగుల జీవితాల గురించి చక్కగా వివరించారు..”షెవ్వా నెత్తురు” ఓ..కుక్క చేసిన పనికి ఆడపిల్లల మానాలతో ఓ.హాస్టల్ వార్డెన్ ఎలా ఆడుకుందో చెప్పే కథ.దళితులు అని చిన్న చూపు చూస్తూ వాళ్ళను అవమానిస్తూ, అనుమానిస్తూ, వాల్ల మానానికి పరీక్ష పెట్టిన ఓ.వార్డెన్ ను ఆత్మస్థైర్యం తో ఎదురు నిలబడ్డ ఓ..అబల ..దైర్యంగా ఎదిరించిన తీరు అద్భుతం.”మా అవ్వ” చనిపోయిన తన తండ్రి వార్త విని ఊరికి పోయిన బిడ్డకి అక్క,చెల్లెలు చనిపోయిన తండ్రి బొంద దగ్గర ఆకరి చూపు కూడ నోసుకోక పోయిన తనను పట్టుకొని దుఃఖించే తీరు ,స్నానం చేయడానికి కూడ నీళ్లు లేని ఆ ఊరి పరిస్థితి.తల్లి పోయినంక తన తండ్రి ఎన్ని కష్టాలు పడి పెరిగి ఎన్ని బాధలు అనుభవించి తన పిల్లల కోసం ఇంత భూమి సంపాదించుకున్నడో అన్ని తన వాల్ల దగ్గర తెలుసు కొని.తన తల్లిని చివరికి తనతో తీసుకు పోయే కథ.”గద్దెత్తుకు పోయిన బతుకమ్మ”మన తెలంగాణలో ఆడ బిడ్డలు అందరూ ఎంతో పవిత్రంగా ,సంతోషంగా తీరొక్క పువ్వులతో,ఉన్న వాళ్ళు లేని వాళ్ళు కూడ ఉన్నంతలో ఘనంగా జరుపుకునే పండుగ.అలాంటి పండుగను మీరు ఆడ కూడదు అని వెలివేసే సమాజానికి,అగ్ర కులాల అహంకారాన్ని ఎదురు నిలిచిన ఓ.దళిత మహిళ కథ .మేము ఎందుకు ఆడ కూడదు.అని బతుకమ్మ అందరి పండుగ అని వాళ్లకు సవాల్ గా దళిత మహిళలు అందరూ బతుకమ్మ ఆడిన తీరు..”ఎప్పుడో ఒక దళిత మహిళ బతుకమ్మ తోని సద్ధి బదులు ఆరేసిన గొడ్డు మాంసం ను పెట్టుకొని పోంగా గద్ద అచ్చి తన్నుకు పోయుందట.గందుకే ఇగ దళితులు బతుకమ్మ ఆడకూడదు.” అని ఇలాంటి.ఒక మూఢనమ్మకం తో వాల్లను ఆడకూడదు అని వాల్ల ఆత్మాభిమానాన్ని తొక్కేయ్యాలనే వాల్ల ఆలోచనకు దీటుగా నిలిచిన  మహిళ.. చక్కగా చూపించారు రచయిత.”శుద్ధిచెయ్యాలే”పట్నం ఉద్యోగం చేసే ఓ.మహిళకు పల్లెలో లెక్చరర్ గా పోస్టింగ్ వస్తుంది.పల్లెలో చదువు చెప్పే వాళ్ళను ఎంతో గౌరవంగా చూస్తారు .అని ఎంతో ఆశ తో వచ్చిన తనకు నిరాశే మిగిలింది.ఉండడానికి చోటు దొరకడమే చాల కష్టంగా మారింది.చివరికి ఓ.బ్రాహ్మణ కుటుంబం ఎన్నో షరతులు పెట్టి ఇల్లు అద్దెకు ఇచ్చిన చివరికి దళితులు అన్న ఒకే కారణం తో.వాల్ల సామాను బయట పడేసి ఇల్లు కాలి చేయమని.. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఇల్లుఅంత శుద్ధి చేసుకున్న బ్రాహ్మణ నైజం.ఉపాధ్యాయులు అని గౌరవించక పోను..వాళ్ళను అంటరాని వారు అని వెలివేయడం.”రాజీపడ్డ రాత” ఓక్క సారి కొని ఇచ్చిన పెన్నులతో యాడాది పాటు కాపాడుకోవాలి మధ్యలో మళ్ళీ పెన్ను పోతే కొని ఇచ్చేది లేదు.అలాంటి ఆడ పిల్ల మధ్యలో పెన్ను పోగొట్టుకున్నందుకు తను పడ్డ తిప్పలు ,బాధ.చివరకు తన చదువు తన అక్షరాలను తాకట్టు పెట్టి పెన్ను సంపాదించుకున్న తన వ్యధ.పరీక్షలో తను రాసింది చూపెడుతేనే పెన్ను ఇస్తా నన్న తన దోస్త్ దగ్గర తన చదువుకోసం పరీక్ష రాయడం కోసం తను రాజీ పడిపోయుంది.చివరకి నేను కష్ట పడి చదివి.తను ఏ కష్టం లేకుండా చదవకుండా ఉంటే నేను ఎందుకు చూపంచాలి అని చూపించక పోయే సరికి నా పెన్ను నాకు ఇచ్చెయ్ అన్న దోస్త్ దగ్గర రాజీ పడ్డ రాత. “రాయక్క మాన్యం” ఈ పుస్తకం పేరు కూడ ఇదేపెట్టడం..దక్కలి రాయక్క అందం తో పాటు ధైర్యవంతురాలు..మాల కులానికి చెందిన అతనిని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది..దక్కలి వాళ్ళు మాల,మాదిగ ఇండ్లల్లో అడుక్కునే వాళ్ళు గందుకే మాల ఇంటి కోడలు అయిన గాళ్ళు కులం కెళ్ళి వెలివేస్తారు అని.తన తండ్రి తనకు ఉన్న ఊలల్లో  సగం పాలు ఇస్తాడు..తన భర్త కు బదులు రాయక్కే.జాంబ పురాణం చెప్తూ ఊరు,ఊరు తిరిగి అడుక్కుంటుంది.ఆలా తనకు రావాల్సిన ధాన్యం ఇవ్వని ఇద్దరు అన్న దమ్ముల మధ్య తగువు తెంపి.వాళ్లకు పంచాయితీ చెప్పి.తనకు రావాల్సిన దానిని వసూల్ చేసిన ఆత్మనిబ్బరం గళ్ళ ఓ.మహిళ..”మీరెట్ల వెజ్జులు” దళితుడు అనే కారణం తో మీరు మాంసాహారులు మేము నిత్య పూజలు చేసుకునే బ్రాహ్మణులం.అని బ్రాహ్మణ నైజాన్ని చూపే ఆడ వాళ్లకు ఏది మాంసారహం,ఏది శాకాహారం.అర్ధమయ్యే ల చెప్పి బ్రాహ్మణ ఆడబిడ్డ ల కళ్ళు తెరిపించిన కథ.” మా మాట గిట్లనే” ఆఫీస్ లో పెత్తనం ఏలే ఆంధ్రభాషా.. ఏది మాట్లాడిన నువ్వు ఇంతేనా నీ మాటలు ఇంతేనా అని అవమానించే ఆఫీసర్..నా బాష నేను మాట్లాడం కూడ తప్పేనా అని ఒక అటెండర్ పడే బాధ.అవును కదా భాష పెత్తనం మన భాష మనం మాట్లాడు కోవడం లో తప్పు ఏంటి.అది మోటు అని చులకన చేసుకునుడు ఎందుకు.మన భాష మన మాట అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వoగ చెప్పుకోవాలి.”పాయిదేర్ల తనం” నక్షలైట్లు పెట్టిన బాంబుతో పోలీస్ ఆఫీసర్ తో డ్రైవర్ కూడ చనిపోతే.ఆఫీసర్ భార్యకు వెంటనే ఉద్యోగం ఇచ్చి డ్రైవర్ భార్య ఓ.దళిత మహిళ కాబట్టి తనకు ఇస్తా నన్న దాని కోసం కాళ్ళు అరిగేలా   తింపిచ్చు కోవడం.. ఇలా ప్రతీ కథలో దళితులు జరుగుతున్న అన్యాయం.దళిత మహిళలు ఎదుర్కొన్న సవాళ్లు.భాష పెత్తనం,అంటరాని వాళ్ళు అని ఈ సమాజం నుండి వెలివేయ బడ్డ దళితుల ఆత్మాభిమానం,కాలం తో వస్తున్న మార్పులు  ఇలాంటి రచయితల రాతలు,ఎందరో మహాను బావుల ఆత్మ త్యాగాలు,ఎందరో సంగసంస్కర్తలు వాల్ల త్యాగాలు.జాతిని మేల్కొలిపి జాగృతం చేసిన ఇంకా కొంత మార్పు అవసరం.వివాహ వ్యవస్థలో కులాల అడ్డుగోడలు ఇప్పడికి ఇరు కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి.ప్రాణాలను సైతం బలి కొంటున్నాయి..తక్కువ జాతి అనే బేధం ఎంత చదువు ఉన్న తెలివి ఉన్న ఓ..ఆడ కూతురి విషయం లో వాళ్ళను ఈ సమాజం చులకన భావం తో చూడడం.తగిన గౌరవం ఇవ్వక పోవడం..ఎన్ని మారిన మనుషులలో పేరుకు పోయిన కుల పిచ్చి మారడం లేదు.ఇంకా మార్పు రావాలి..ఈ పుస్తకం లో ప్రతీ విషయాన్ని అద్భుతంగా మన యాసలో ఈ పుస్తకం రాసి వివరించారు.రచయిత..వారికి దళిత మహిళల పట్ల ఉన్న గౌరవానికి ,భాషాభిమానానికి ప్రతీకలు ఈ కథలు..*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.