
అమ్మ మాట
-లక్ష్మీ శ్రీనివాస్
నాలుగు గోడల మధ్య నుంచినలుగురి మధ్యలో నిలవాలన్ననలుగురిలో గెలవాలన్ననలుగురిని గెలిపించాలన్నానాలుగు అక్షరాలు నేర్చుకోవాలని చెబుతూ ఉండేది అమ్మ!! నాలుగు అడుగులు వేయాలన్ననాలుగు రాళ్ళు పోగేయలన్ననలుగురిని సంపాదించు కోవలన్ననలుగురికి సాయం చేయాలన్న నాలుగు అక్షరాలు నేర్చు కోవాలనిచెబుతూ ఉండేది అమ్మ!! గుడి తలుపులు బడి తలుపులుఎప్పుడు ఎదురుచూస్తుంటాయినీ ఎదుగుదలకు తోడ్పడుతుంటాయిగుడి బడి తల్లి తండ్రులు లాంటి వాళ్ళనిమంచి కథలతో ఎన్నే నీతులు బోధిస్తూఎప్పుడు హితాన్ని మరవకూడదనిసత్ మార్గంలో పయనించాలనిపరుల ఘోషకు కారణం కాకూడదనిచెబుతూ ఉండేది అమ్మ!! గెలుపు ఓటములనుస్వేచ్చగా స్వీకరించమంటుఎదురయ్యే ఆటు పోటులకు ఎదురెళ్లి సవాళ్లు విసరమనేదితల దించే క్షణాలను తరిమికొట్టమనేదిభుజాల మీద ధైర్యాన్ని వేసుకొనిప్రయాణం సాగించాలoటూచెబుతూ ఉండేది అమ్మ!!
*****

టి.శ్రీనివాసులు (లక్ష్మీ శ్రీనివాస్) చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా దగ్గర తాళ్ళపల్లి గ్రామంలో లక్ష్మీదేవి, ఆంజప్పలకు జన్మించారు.
ఎం. ఏ, బి. ఏడ్, పూర్తిచేసి, ప్రస్తుతం తెలుగు అధ్యాపకుడిగా మదర్ థెరిస్సా జూనియర్ కళాశాల పలమనేరులో పని చేస్తున్నారు.
