
వీరు కరీంనగర్ జిల్లా ( తెలంగాణా ) లోని ఎలగందుల గ్రామంలో జన్మించారు. వయస్సు 80 సంవత్సరాలు ( పుట్టిన తేదీ – సెప్టెంబర్ 9 ,1939 ). ఉస్మానియా యూనివర్సిటీ నుండి సైన్స్ & ఇంజినీరింగ్ లో డిగ్రీలు తీసుకొని, పదిహేనేళ్ళు ఇండియాలో పనిచేసి, శాంతినికేతన్ లో ఆరు నెలలపాటు సాంఘిక విద్యలో శిక్షణ పొంది, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘనా, ఒమాన్, సౌదీఅరేబియా లో ఉద్యోగాలు చేసి, పలు ప్రపంచ దేశాలు సందర్శించి, హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ప్రస్తుత నివాసం గ్రీన్ కార్డు హోల్డర్ గా అమెరికాలో ( సన్నీవేల్ / డాలస్ / ఆస్టిన్). వీరికి ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్లు, ఒక మనుమరాలు, ముగ్గురు మనుమలు- అంతా యుఎస్ లోనే ఉన్నందున త్వరలో అమెరికా పౌరసత్వం తీసుకునే ప్రయత్నంలో ఉన్నారు. వీరు ప్రచురించిన పుస్తకాలు 13 (3 స్వీయ కవితా సంపుటాలు – ఓనమాలు, గూటికి చేరిన పాట, ఎదపదనిసలు, 7 అనువాద కవితా సంపుటాలు – అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, రవీంద్రుని గీతాంజలి, జాన్ కీట్స్ పుడమి కవిత్వం ఆగదు, ఆక్టేవియో పాజ్ సూర్య శిల, కల్యాణ గోద – తిరుప్పావై. 1 వచనం – అనువాదం అనుభవాలు. ఆంగ్లంలో The Great Void , Wings of Musings .