నిశ్శబ్ద గ్రంథాలయం

-లక్ష్మీ కందిమళ్ళ

ఇప్పుడు 
సత్యం పలికే చోటికి 
పయనం 
 
అక్కడంతా 
సీతాకోకచిలుకల సందడి 
ఇంకా 
శంఖు శబ్దాలు 
మధురంగా
ఆ ముచ్చట 
ఎంత చెప్పినా తక్కువే మరి
ఇహ 
ఆ అనుబంధపు తడికి 
ఎండిన కొమ్మైనా చిగురించదూ
 
ఆ మాటలు వినగలగడం 
ఒక వరం
పాషాణమైనా కరిగి కదులుతుంది 
నదిలా 
 
ఇహ, అలా బ్రతికేస్తే చాలనిపిస్తుంది
అప్పుడు 
అదంతా ఒక మురిపెం 
ఆ నిశ్శబ్ద గ్రంథాలయంలో..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.