డా.జి.అమృతలత
పుట్టింది పడకల్, పెరిగింది జక్రాన్ పల్లి , నిజామాబాద్ జిల్లా. ప్రస్తుత నివాసం మామిడిపల్లి, ఆర్మూర్ - నిజామాబాద్ జిల్లా. ఎమ్మే, ఎమ్మెడ్, పి హెచ్ డి. చేసి, పదిహేను సంవత్సరాలు జెడ్ పి హెచ్చెస్ లో ఉపాధ్యాయురాలిగా పనిచేసి రాజీనామా అనంతరం , వివిధ విద్యాలయాల స్థాపన చేశారు.
రచయిత్రి. ఎన్నో కథలు, సీరియల్సు, నాటికలు.రచించారు. ' అమృత కిరణ్ ' పక్ష పత్రికకు రెండేళ్ళు ఎడిటర్.
సాహిత్యం,సంగీతం, కళ ఇలా వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారికి అమృత లత అవార్డు ను 2011 నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతున్నది.
శ్రీ అపురూప వేంకటేశ్వర స్వామి దేవాలయం, మామిడి పల్లిలో నిర్మాణం, 2012 న విగ్రహం ప్రతిష్టాపన.
1970 నుండి ఇప్పటి వరకు వందకి పైగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ. విద్యారంగం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి సేవ చేయటం ముఖ్య లక్ష్యం.
అవార్డులు :
'ఆదర్శ వనిత' అవార్డు, 'ద బెస్ట్ అవుట్ స్టాండింగ్ విమెన్ ఎంటర్ ప్రెన్యూర్' అవార్డు, 'డోయన్ అవార్డు', 'బెస్ట్ ఎడ్యుకేషనిస్ట్' అవార్డు ఇలా ఇంకా .
సాహసాల రాజా మధు నాగరాజ -3 -డా. అమృతలత సాహసాలతో సహవాసం అయితే విజేతల దృష్టి ఎప్పుడూ శిఖరాగ్ర భాగం మీదే వుంటుందన్నట్టు .. మధు సాహసా లు అంతటితో ఆగలేదు. ఈ పర్యాయం 2015లో మధు ధక్షిణ అమెరికా ధక్షిణపు చివరి భాగాన ఉన్న అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలను కలిపే ‘మెగలాన్ జలసంధి’ని ఈదాలని సంకల్పించారు. అయితే అత్యల్ప శీతోష్ణస్థితి కారణంగా ప్రాణాంతకమైన హైపోథెర్మియాకి ఆయన గురైనపుడు .. చిలియన్ నేవీ […]
సాహసాల రాజా మధు నాగరాజ -2 -డా. అమృతలత అనంతరం మధు తన దృష్టిని మొరాకో నుండి సహారా ఎడారిలో 250 కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేయాలన్న లక్ష్యం పై కేంద్రీకరించాడు. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన అల్ట్రా మారథాన్ అది. 2010 ఏప్రిల్ 4 నుండి 10వ తేదీ వరకు ఆరు రోజుల్లో ..మండుటెండల్లో ఓ వైపు కాళ్ళు బొబ్బలెక్కుతున్నా … నాలుక పిడుచకట్టుకు పోతున్నా […]
సాహసాలే శ్వాసగా సాగిపోయే మధు నాగరాజ -1 -డా. అమృతలత చిత్తూరు జిల్లా, పుంగనూరులో జన్మించి మైసూరులో పెరిగిన మధుగారు సుశీల నాగరాజ దంపతుల ఏకైక పుత్రుడు. ఆయన విద్యాభ్యాసమంతా మైసూర్లోని మరిమల్లప్ప , జె.ఎస్.ఎస్ హైస్కూల్స్ లో సాగింది. మైసూరు యూనివర్సిటీ క్యాంపస్ క్వార్టర్స్ లో వున్న మధు ఈత నేర్చుకోవడానికి తన తోటి స్నేహితులతో ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచి , […]