
“నాన్నకి రాయని ఉత్తరం” రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
(ప్రవాసాంధ్ర రచయిత్రి పింగళి బాలాదేవి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)
పింగళి బాలాదేవి రాశి కన్నా వాసి ముఖ్యమైన ప్రవాసాంధ్ర రచయిత్రి. సొంత ఊరు తూ .గో.జిల్లా కాట్రావులపల్లి. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో నివాసం. జువాలజీలో ఎమ్మెస్సీ చేసి లెక్చరర్ గా ప్రభుత్వోద్యోగం చేసారు. బాలాదేవి ఇరవై అయిదు దాకా కథలు, వంద వరకు కవితలు, రెండు నవలలు రాసారు. స్త్రీల సమస్యలు, కుటుంబ బాంధవ్యాలు ఇతివృత్తాలుగా రచనలు చేశారు.
వీరు రాసిన “నాన్నకి రాయని ఉత్తరం” కథ ఆ మధ్య సోషల్ మీడియాలో ‘నాన్నకు ప్రేమతో’ అంటూ వైరల్ అయ్యింది. ఆ కథని స్వయంగా వారు చదవగా ఈ ముఖాముఖిలో నెచ్చెలి పాఠకుల కోసం ప్రత్యేకంగా ఇస్తున్నాం.
నవలలు:
1. ఒక చీకటి ఒక వెన్నెల
2. పొగమంచులో సూర్యోదయం
కథా సంపుటి:
నాన్నకి రాయని ఉత్తరం
*****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
