మహమ్మద్ ఘోరిని ఓడించిన వీరాంగన “రాణి నాయికి దేవి”

-యామిజాల శర్వాణి

గ్రీకు చరిత దగ్గరనుంచి ప్రపంచ చరిత్రలో ఎందరో వీరనారుల చరిత్రలు చదువుతాము వీళ్ళు పురుషులకు ఏ మాత్రము తీసిపోకుండా యుద్దాలు చేసి ఘనత వహించారు పరిపాలనలోను శత్రువులను ఎదుర్కోవటము లోవారిదైనా ముద్ర వేశారు.కానీ మన దేశ చరిత్రలో అటువంటి వారిని తక్కువగా కీర్తించి విదేశ ఆక్రమణదారులను గొప్ప హీరోలుగా చిత్రకరించిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇదంతా మనము ఎక్కువకాలం బ్రిటిష్ వారి పాలనలో ఉండటమే వాళ్ళు చరిత్రను వాళ్లకు అనుకూలముగా వ్రాసుకున్నారు నేటికీ ఆ చరిత్రనే మనము పాఠాలుగా పిల్లలకు చెపుతున్నాము ఇంకా అ బానిస భావాలనుంచి పూర్తిగా బయటకు రాలేదు మహమ్మద్ ఘోరీ చేసిన అరాచకాలను గోప్ప  విజయాలు గా కీర్తిస్తూ మనకు పాఠాలు చెపుతున్నారు స్వాతంత్రము వచ్చినాక కూడ మన చరిత్ర కుహనా లౌకిక వాదుల, బ్రిటిష్  సామ్రాజ్య వాద కబంధ హస్తాల నుండి బయటికి రాలేక పోతుంది అందువల్లే చాలా మంది యోధులు ముఖ్యముగా ఆడవారు నిర్లక్ష్యము చేయబడ్డారు అనేది యదార్ధము అటువంటి వారిలో ఘోరిని అడ్డగించి చిత్తుగా ఓడించిన ఒక మహిళ గుజరాత్  రాణి నాయకి దేవి ప్రస్తావన మన చరిత్ర పాఠాల్లో చాలా తక్కువగాఉంటుంది అదే మన పెద్ద దురదృష్టము.

ఘోరీ ,పృద్వి రాజ్ చౌహన్ ను ఎదుర్కోవటానికి 14 సంవత్సరాల ముందే ఆమె మొహమ్మద్ ఘోరిని ఓడించింది. 1192లో జరిగిన రెండవ తారైన్ యుద్దములో పృద్విరాజ్ చౌహన్ ను మొహమ్మద్ ఘోరీ ఓడించి సంగతి అందరికి తెలిసినదే అంతకు ముందు జరిగిన కధ గురించి తెలుసుకుందాము.నాయకి దేవి చాళుక్య వంశానికి చెందిన రాణి.ఈవిడ గోవాకు చెందిన కదంబ పాలకుడు మహామండలేశ్వర పేర్మాడి కూతురు,మరియు సోలంకి రాజు అజేయ పాల భార్య ఇతను 1170 వరకు 4 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు.భర్త మరణించాక కుమారుడు ములరాజా II చిన్న పిల్లవాడు అవటం వలన నాయకి దేవి రాజ్య పాలన భారము తీసుకుంది1173 లోఆఫ్ఘనిస్తాన్ ను జయించిన ఘురిడ్ రాజైన మొహమ్మద్ షహాబుద్ధిన ఘోరీ(మొహమ్మద్ ఘోరీ పూర్తి పేరు) ఇతర దేశాలను దురాక్రమణ చేయాలన్న తలంపు ఉన్నవాడు అవటం వల్ల అలెగ్జాన్డర్ ఇతర పర్షియన్ రాజులు చేయని సాహసము భారత దేశములోకి చొరబడి ఆక్రమించాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఘోరీ మొదటి ఆక్రమణ ముల్తాన్ మరియు ఉఛ్ దుర్గాలు.ఈ ఆక్రమణలు పూర్తి అయినాక దక్షిణాన ఉన్న రాజపుత్ర మరియు గుజరాత్ సంస్థానాలపై దృష్టి పడింది. అతని లక్ష్యము సంపదలతో తుల తూగుతున్నఆన్ హిల్వారా పఠాన్ కోట. ఈ కోట చాళుక్య(సోలంకి అని కూడా పిలుస్తారు) రాజుల రాజధాని. మొదట ఈ రాజ్యము 8 వ శతాబ్దానికి  చాపోత్కట వంశానికి చెందిన వన్రాజ్ చే  స్థాపించబడి చాళుక్య వంశస్తులచే కొనసాగించబడింది.

అమెరికన్ చరిత్రకారుడు తెర్తియస్ చాండ్లెర్ ఆన్ హిల్వారా పఠాన్ కోటను ప్రపంచములోని పురాతనమైన 10 దుర్గలలో,1000 సంవత్సరములో 100,000 జనాభాతో ఒకటిగా వర్ణించాడు ఈ దుర్గాన్ని మూలరాజ II పరిపాలిస్తున్నప్పుడు ఘోరీ దాడి చేశాడు కానీ ఈ యుద్దాన్ని నడిపించింది రాజు తల్లి అయిన నాయికి దేవి. ఘోరీ సులభముగా యుద్దములో గెలిచి కోటను స్వాధీనము చేసుకోవచ్చని దాడి చేసాడు కానీ జరిగింది వేరు. నాయకి దేవి కత్తి యుద్ధము,గుర్రపుస్వారీ,యుద్ధ తంత్రాలలో,దౌత్య కార్యకలాపాలలో మంచి నేర్పరి.కాబట్టి ఘోరీ దండయాత్ర సమయానికి చాళుక్య సైన్యానికి ఆధిపత్యము వహించింది. నాయకి దేవి తన పొరుగు రాజ్యాల రాజులతో(పృద్వి రాజ్ చౌహన్ తో సహా) రాయబారాలు జరిపింది  కానీ చాలా మంది వారి సహకారము అందివ్వలేదు. కానీ చాళుక్య సామంతరాజులైనా నద్దులా చాహమన వంశము వారు,జాలోర్ చాహమన వంశస్తులు మరియు అర్బుద పరామరా వంశస్తులు నాయకి దేవికి పూర్తి సహకారము అందించారు.

శత్రువును గెలవటానికి ఈ సైన్యము సరిపోదని భావించిన నాయకి దేవి తన యుద్ధ తంత్రాన్ని చాలా తెలివిగా ప్లాన్ చేసింది. దాడికి మౌంట్ అబూ పర్వతశ్రేణిలోని ప్రస్తుత సిరోహి జిల్లాలోని కసహ్రద గ్రామము దగ్గర గల పర్వత ప్రాంతమైన గదర్ ఘట్ట ప్రాంతాన్ని యుద్దానికి ఎన్నుకుంది.ఈ ఇరుకైన కొండ ప్రాంతము ఘోరీ సైన్యానికి పూర్తిగా పరిచయము లేనిది అవటం వలన నాయకి దేవి సైన్యాలకు బాగా లాభించింది. నాయకి దేవి తన కొడుకును ఎత్తుకొని తన సైన్యాన్నినడిపిస్తూ శత్రుసైన్యాలపై దాడిచేసింది నాయకి దేవి సైన్యములోని ఏనుగులు శత్రుసేనలను ఘోరీ సైన్యాన్ని చిత్తుచిత్తుగా ఓడించాయి ఘోరీ మిగిలిన కొద్దీ మంది అంగరక్షకులతో పారిపోయాడు తరువాత కూడా మళ్ళా గుజరాత్ వైపు దాడికి రాలేదు తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకొని ఖైబర్ కనుమల గుండా ఉత్తర హిందూస్థానములోకి చొరబడి పంజాబ్ పై దాడి చేసి భారతదేశములోకి అడుగు పెట్టి తనజైత్ర యాత్రను మోసాలతో కుతంత్రాలతో కొనసాగించాడు కానీ మొదటి ప్రయత్నములో నాయకి దేవి ఘోరీ ఆశలను పటాపంచలు చేసి అపజయాన్ని అందించింది ఆ తరువాత కూడా భారతదేశాన్ని ఆక్రమించాలి అన్న ఆలోచన గల ఇతర దురాక్రమణ దారులైన అలెగ్జాన్డర్ ,బాబర్ లాంటి వారు కూడా ఖైబర్ కనుమల దారినే ఎన్నుకుని భారత దేశములోకి ప్రవేశించారు 

ఆ విధముగా కసహ్రద యుద్ధము ఘోరికి అపజయాన్ని అందించిన యుద్ధము ఆ యుద్దానికి నాయకత్వము వహించింది నాయకి దేవి ఆ విధముగా నాయకి దేవి ఘోరిని ఓడించిన ఏకైక మహిళగా చరిత్రలో సుస్థిర స్థానము సంపాదించుకుంది. తన ధైర్య సాహసాలతో చరిత్రలో ఘటికురాలిగా వీరనారులైన ఝాన్సీ లక్ష్మి బాయ్, మరాఠా రాణి తార భాయ్,కిట్టూర్ రాణి చెన్నమల సరసన స్థానము సంపాదించుకుంది కానీ చరిత్ర పుస్తకాలలో ఈవిడ గురించి పెద్దగా వ్రాయబడలేదు. నాయకి దేవి రాజధాని అంహిల్వారా నేడు పటాన్ పేరుతొ ఉంది 11వ శతాబ్దానికి చెందిన అక్కడి రాణి క వావ్ (దిగుడు బావి) ప్రసిద్ధి చెందినది.ఆ తరువాత నాయకి దేవి కుమార్తె, సమర్ సింగ్ చౌహన్ రెండవ భార్య అయిన కుర్మా దేవి ఘోరీ బానిస అయిన కుతుబుద్దీన్ ఐబాక్ ను యుద్దములో ఓడింన వీరనారిగా పేరు సంపాదించుకుంది. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.