ప్రపంచ గతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు

-యామిజాల శర్వాణి

          చరిత్రలో అన్ని రంగాలలో పేరు ప్రఖ్యాతలు గడించిన మహిళలు ఎంత మందో ఉన్నారు రచయిత్రులుగా రాజకీయ వేత్తలుగా నటీ మణులుగా ఇలా అన్ని రంగాల్లో మహిళలు ఉన్నారు. ప్రస్తుతము కొంతమంది మహిళా శాస్త్రవేత్తలు విజ్ఞాన శాస్త్రములో (సైన్సులో) ప్రపంచానికి వారు అందించిన సేవలను గురించి తెలుసుకుందాము.
 
          ఇప్పటికే మేడమ్ క్యూరీ లాంటి పేరు ప్రపంచవ్యాప్తముగా సైన్సు చదువుకున్న అందరికి పరిచయమైనదే. అలాగే చాల మంది మహిళా శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ చాలా మందికి తగినంత గుర్తింపు రాలేదు అయినప్పటికీ వారి కృషి వారి సేవలు ప్రపంచము మరచిపోదు అటువంటి మహిళా శాస్త్రవేత్తలు ధృడ సంకల్పం తో వారు సైన్సు రంగములో చేసిన కృషిని తెలుసుకుందాము.
 
          వీరి కృషి చంద్రమండలం పై కాలు పెట్టటం దగ్గర నుండి కుష్టు వ్యాధి ట్రీట్మెంట్ వంటి అన్ని రంగాలలో మనకు కనిపిస్తుంది. వీరి కృషి నిజంగానే ప్రపంచ గతిని మార్చేసింది..       
 
1.మేడమ్ క్యూరీ(1867-1934) :-
మహిళా శాస్త్రవేత్తలలో చెప్పుకోవలసి వస్తే మొదట మేడం క్యూరీ గురించి చెప్పుకోవాలి రేడియోధార్మికత మీద పరిశోధనలు చేసి రేడియం, పొలోనియం వంటి అతి ముఖ్యమైన రేడియోధార్మిక మూలకాలను కనిపెట్టి రేడియోధార్మికత అనే పదాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈవిడ ప్రముఖ భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త. 1896 లో రేడియోధార్మికతను కనిపెట్టి రేడియో యాక్టివ్ ఐసోటోపులను వేరు చేసే టెక్నీక్ లను డెవలప్ చేసి మానవాళికి ఏంతో  మేలు చేసింది. మొదటి ప్రపంచయుద్ధము సమయములో మొబైల్ X-రే యూనిట్ ను కనిపెట్టింది. 1903లో మొదటిసారిగా నోబెల్ బహుమతి అందుకున్న మహిళా  శాస్త్రవేత్తగా చరిత్ర పుటలలోకి ఎక్కింది. అంతే కాకుండా 1911లో రసాయన శాస్త్రములో రేడియంను ఐసొలేట్ చేసినందుకు రెండవసారి నోబెల్ ప్రైజ్ వచ్చింది ,ఆ విధముగా రెండు సార్లు నోబెల్ బహుమతి పొందిన మహిళా శాస్త్రవేత్తగా భౌతిక రసాయన శాస్త్రాలలో రికార్డ్ సృష్టించింది మేడం క్యూరీ. X-రే మరియు యురేనియం పై జరిపిన పరిశోధనలు సైన్సులో అటామిక్ ఫిజిక్స్ అనే కొత్త  రంగ రూపకల్పనకు దారితీసింది. 1934 లో తన పరిశోధనల ఫలితముగా ఎక్కువ కాలము హై ఎనర్జీ రేడియేషన్ కు ఎక్స్పోజ్ అవటం వలన చనిపోయింది. ఈవిడ భర్త కూతురు కూడ రేడియోధార్మికతలో పలు ప్రయోగాలు చేసి పేరు ప్రఖ్యాతులు గడించారు.
 
2.జానకి అమ్మాళ్ వృక్ష శాస్త్రవేత్త(1897-1984):-
ఈవిడ భారతదేశానికి చెందిన ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్త అనేక హై బ్రీడ్ పంటల స్పీసీస్ ను డెవలప్ చేసింది వాటిని నేటికీ రైతులు పండిస్తున్నారు. అటువంటి వాటిలో వంగ, చెరకు లలో ఆవిడ  ఉత్పత్తి చేసిన వంగడాలు ప్రముఖమైనవి చెరకు లో ఆవిడ  ఉత్పత్తి చేసిన వంగడాల వలన భారతదేశములో తీపిదనము ఎక్కువగా ఉండే చెరకును పండిస్తున్నారు. ఇంతకూ మునుపు ఆ వంగడాలను విదేశాల నుండి దిగుమతి చేసుకొనేవారు. అవే కాకుండా, ఈవిడ అనేక రకాల పుష్పించే జాతుల మొక్కల క్రోమోజోముల పై విస్తృత పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలను “ద క్రోమోజోమ్స్ అట్లాస్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్ “అనే పుస్తక రూపములో వెలువడింది. ఈ పుస్తక రచనలో ఆవిడ మరో వృక్ష శాస్త్రవేత్త సి.డి డార్లింగ్టన్ తో కలిసి పనిచేశారు. ఈవిడ కృషికి గుర్తింపుగా ఒక ప్యూర్ వైట్ పూలువుండే మొక్కకు ఆవిడ  పేరు పెట్టారు ఆ మొక్క పేరు “మాగ్నోలియా కోబుస్ జానకి అమ్మాళ్”       
 
3.షీన్ షుంగ్ వూ భౌతిక శాస్త్రవేత్త(1912-1997):-
ఈవిడను చైనాలో “ఫస్ట్ లేడి ఆఫ్ ఫిజిక్స్” అంటారు అలాగే చైనా మేడం క్యూరీ అని కూడా అంటారు. చైనాలోని షాంగై సమీపాన గల చిన్న గ్రామములో మే 31, 1912లో జన్మించిన ఈవిడ 1936లో అమెరికా వచ్చి యునివేర్సిటి ఆఫ్ మిచిగాన్ లో  Ph.D చేసి అమెరికన్ ఎక్స్పెరిమెంటల్ ఫిజిస్ట్ గా బీటా డికె మీద పరిశోధనలు చేసి ఆ ఫీల్డ్ లో తనదైన ముద్ర వేసింది. ఈవిడ పరిశోధనలు “ద వూ ఎక్స్పెరిమెంట్స్” గా ప్రసిద్ధి కెక్కాయి. ఈవిడ చేసిన పరిశోధనలు ఆవిడ సహచరులకు 1957లో నోబెల్ బహుమతిని తెచ్చిపెట్టాయి. కానీ ఆవిడ పరిశోధనలకు గుర్తింపుగా 1978లో భౌతిక శాస్త్రములో వుల్ఫ్ బహుమతి వచ్చింది  
 
4. కెరొలిన్ హెర్స్చేల్  అస్ట్రానమర్ (1750-1848):-
ఆస్ట్రానమీలో పరిశోధనలు చేసి గుర్తింపు పొందిన మొదటి మహిళా శాస్త్రవేత్తగా చెప్పవచ్చు. ఈవిడ తోకచుక్కను కనిపెట్టిన ఘనత పొందింది. తన శాస్త్రీయ పరిశోధనలకు గాను జీతము తీసుకున్న మహిళా శాస్త్రవేత్త కూడా ఈవిడే. అలాగే 1780 లోనే బ్రిటన్ కు చెందిన రాయల్ సొసైటీలో గౌరవ సభ్యత్వాన్ని పొందిన మొదటి మహిళా కూడా ఈవిడే.  ఈవిడ తన సోదరుడైన విలియం తో కలిసి రాత్రులందు ఆకాశాన్ని పరిశోధించి ఇద్దరు 2,500 నేబులే మరియు స్టార్ క్లస్టర్లను రికార్డ్ చేశారు. ఈవిడ ఒక్కత్తే 14 నేబులే ఎనిమిది తోకచుక్కలు కనిపెట్టింది. ఆవిడ కనిపెట్టిన విషయాలను అస్ట్రానమర్ రాయల్ కు పంపగా 1787లో 3వ కింగ్ జార్జ్ ఆవిడకు నెల జీతము అఫర్ చేశారు . ఆవిడ కెరీర్ లో సుమారు 500 ల నక్షత్రాలపై పరిశోధనలు చేసి 1848లో 97 ఏళ్ల వయస్సులో చనిపోయింది.         ..
 
5.ఎలీస్ బాల్  రసాయన శాస్త్రవేత్త( 1892-1916) :-
ఈవిడ 20 ఏళ్ల వయస్సులోనే 20వ శతాబ్దము ఆరంభములో కుష్టు వ్యాధి ట్రీట్ మెంట్ లో ప్రగతి సాధించింది. వాషింగ్టన్ మరియు హవాయి యూనివర్సిటీల నుండి డిగ్రీలు పుచ్చుకొంది. ఈవిడ హవాయి యూనివర్సిటీ నుండి మాస్టర్ డిగ్రీ పుచ్చుకున్న మొదటి మహిళ. అక్కడే ఆవిడ కుష్టు వ్యాధి నయము చేయటానికి పరిశోధనలు ప్రారంభించి మొదటిసారిగా ఇంజక్టబుల్ లెప్రసీ ట్రీట్ మెంట్ ను డెవలప్ చేసింది. ఈ ఇంజక్షన్ ను ఒక చెట్టు ఆయిల్ నుండి డెవలప్ చేసింది. ఈ రకమైన ట్రీట్ మెంట్ ను బాల్  మెథడ్ అంటారు. ఈ మెథడ్ ను కొన్ని వేలమంది లెప్రసీ రోగులను నయము చేయటానికి వాడారు. కానీ దురదృష్టవశాత్తు ఈ మేధావి 24 ఏళ్ల వయస్సుకే ప్రయోగశాలలో క్లోరిన్ గ్యాస్ కు ఎక్స్పోజ్ అవటం వలన చనిపోయింది.      
 
6.కేథరీన్ జాన్సన్ గణిత శాస్త్రవేత్త (1918-2020):-
ఈవిడ నాసా కేంద్రములో గణిత శాస్త్రవేత్తగా ఉండి స్పేస్ మిషన్ పరిశోధనలలో పాలు పంచుకుంది. ఈవిడను హ్యూమన్ కంప్యూటర్ గా ప్రశంసించారు. ఈవిడ అపోలో 11లాంటి ఎన్నో స్పెస్  క్రాఫ్ట్ ల ఫ్లయిట్ పాత్ లను క్యాలుక్యులేట్ చేసి అనలైజ్ చేయటానికి సహాయపడింది. ఈవిడ కృషి వలన అపోలో స్పెస్ క్రాఫ్ట్ చంద్రమండలం మీద దిగి మళ్లా  భూమికి తిరిగి వచ్చింది. ఈవిడ అనేక క్లిష్టమైన గణిత సమస్యలను సులువుగా పరిష్కరించేవారు. ఈవిడ క్యాల్యుక్యులేషన్స్  అనేక మంది రోదసి యాత్రికులను అంతరిక్షంలోకి పంపటానికి సహాయపడ్డాయి. కేథరిన్ 101 సంవత్సరాల వయస్సులో 2020 లో మరణించింది. ఈవిడ జీవిత చరిత్రను 2016లో హిడెను ఫిగర్స్ అనే పేరుతొ సినిమాగాతీసారు ఈ సినిమాలో ఈవిడ పాత్రను తరాజి పి హెన్షన్ తెరపై పోషించింది.  .
 
7.రోజాలిండ్ ఫ్రాంక్లిన్ రసాయన శాస్త్రవేత్త :-
వాట్సాన్ మరియు క్రీక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు DNA నిర్మాణాన్ని కనుగొన్న ఘనత చేజిక్కుంచుకున్నారు. కానీ వారి పరిశోధనలు విజయవంతమవటానికి రోజలిండ్  కృషి ఏంతో  ఉంది.ఈ ఇంగ్లీష్ శాస్త్రవేత్త ఫిజికల్ కెమిస్ట్రీలో కేంబ్రిడ్జ్ యునివర్సిటి నుండి Ph.D తీసుకొని DNA ఇమేజెస్ పై X-కిరణాల విక్షేపణ పరిశోధనలు చేసి విజయవంతము గా యంత్రముపై DNA నిర్మాణాన్ని ఫొటోగ్రాఫ్ తీయగలిగింది. దీని వలన ఇద్దరు శాస్త్రవేత్తలకు DNA యొక్క డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ఐడెంటిఫై చేయటానికి దోహదపడింది. ఎక్కువ స్థాయి తేమకు గురి అయినప్పుడు DNA నిర్మాణము లో మార్పు వస్తుంది అన్న విషయాన్నీ కూడా ఈ రసాయన శాస్త్రవేత్త కనిపెట్టింది. కానీ దురదృష్టవశాత్తు రోజలిండ్ 1958లో 37 ఏళ్ల వయస్సులోనే చనిపోయింది. 1962 లో వాట్సాన్ మరియు క్రీక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు DNA నిర్మాణాన్ని కనిపెట్టినందుకు నోబెల్ బహుమతి వచ్చింది. కానీ వారి ఆవిష్కరణకు రోజాలిండ్ పరిశోధనలే మూలము. ఆ విషయాన్నీ స్వయముగా వాట్సాన్ రోజాలిండ్ కృషి లేనిదే తనకు నోబెల్ బహుమతి వచ్చేది కాదని 1968లో ప్రచురించిన పుస్తకము లో తెలియజేశాడు.        . 
 
8.బెర్తా పార్కర్ పలన్ కోడి ఆర్కియాలజిస్ట్(1907-1978) :-
బెర్తా పార్కర్ ను మొదటి అమెరికాకు చెందిన ఫిమేల్ ఆర్కియాలజిస్ట్ గా పరిగణిస్తారు. ఆవిడ 30 ఆగస్టు,1907 లో న్యూ యార్క్ ప్రాంతములో జన్మించింది. చిన్నప్పుడే ఆవిడ నెవాడా ప్రణతానికి మూవ్  అయి అక్కడ సైన్స్ పరిశోధనల పట్ల ఆసక్తి పెంచుకుంది. అక్కడే తన అంకుల్ తో పాటు అర్చియోలాజికల్ పరిశోధనలలో పాల్గొని ఆ పరిశోధనలలో పూర్తిగా మునిగి పోయింది. అప్పటి నుండి అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించటం మొదలు పెట్టింది. 1929లో ప్యూబ్లో అనే ప్రాంతములో ఒక ఆర్కియోలాజికల్ ప్రదేశాన్ని కనుగొని దానికి స్కార్పియన్ హిల్ అని పేరు పెట్టింది. అలాగే కొంత కాలానికి నెవాడా ప్రాంతములో కార్న్ క్రీక్ అనే మరో ఆర్కియోలాజికల్ సైట్ ను కనుగొని ఆ ప్రదేశములో ఒంటె శిలాజాలను శిధిలమైన కొలనులో కనుగొన్నది. అలాగే ఆవిడ అరుదైన అంతరించిపోయిన పెద్దదైన స్లాత్ (దేవాంగు పిల్లి) జాతికి చెందిన పుర్రెను కనుగొన్న ఘనతను దక్కించుకుంది. ఆ ప్రాంతములోనే ఆవిడ ఈ పుర్రె శిలాజముతో పాటు పురాతనమైన మనిషి ఆనవాళ్లను కనుగొనటం వలన నార్త్ అమెరికాలో మనిషి జాడలు ఉన్నాయని నిదర్శనాలు కనిపెట్ట గలిగారు.  
 
9.సిసిలియా పెయిన్ గ్యాపోశ్చికిన్ ఆస్ట్రో ఫిజిసిస్ట్ (1900-1979):-
నక్షత్రాలు ఎక్కువ భాగము హైడ్రోజన్ మరియు హీలియం లతో ఏర్పడ్డవే  అని మనకు తెలిసిన విషయమే కానీ దీనిని మొదటగా కనుగొన్నది సిసిలియా. ఈవిడ ఇంగ్లాండ్ లోని వెన్దోవేర్ లో మే 10, 1900 లో జన్మించింది. చిన్నతనము నుండి కూడా ఈవిడకు సైన్సు అంటే అభిమానము కానీ ఇంగ్లాండ్ లో ఆస్ట్రానమీ కి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటం వలన గ్రాడ్యుయేషన్ తరువాత అమెరికాకు వచ్చింది. 1925 లో ఆస్ట్రానమీలో రాడిక్లిఫ్ కాలేజీ నుండి  పిహెచ్ డి చేసిన మొదటి మహిళగా కీర్తి గడించింది. ఇంకా అప్పటి నుండి నక్షత్రాల గురించి తన పరిశోధనలను ప్రారంభించింది. నక్షత్రాలన్నీ ఒకే విధమైన కాంపోజిషన్ తో ఉన్నవని అవన్నీహైడ్రోజన్ హీలియం లతో కంపోజ్ చేయబడ్డవని గుర్తించింది. 1925లో స్టెల్లార్ అట్మాస్ ఫియర్ అనే పుస్తకము రూపములో తన థీసిస్ ను ప్రచురించింది. కానీ అప్పటి సైన్టిఫిక్ కంమ్యూనిటీ వారు ఆవిడ  పరిశోధన లను ఆమోదించలేదు. కొన్ని సంవత్సరాల తరువాత ఆవిడ చెప్పిన విషయాలను ఆమోదించారు. సిసిలియా హార్వర్డ్ యూనివర్సిటీ లో ఫుల్ టైమ్ ప్రొఫెసర్ గా నియమింపబడ్డ మొదటి మహిళ. అంతే  కాకుండా, అమెరికన్ ఆష్ట్రనామికల్ సొసైటీ నుండి జీవిత సాఫల్య అవార్డు పొందిన మొదటి మహిళా కూడా ఈవిడే. ఈ విధముగా నక్షత్రాల కాంపోజిషన్ గురించి ఆవిడ చేసిన పరిశోధనలు శాస్త్రవేత్తలు విశ్వాన్ని గురించి తెలుసుకోవటానికి ఉపకరించాయి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.