ఆలీబాబా అనేక దొంగలు…..దేశరాజు కథలు

ఆలీబాబా అనేక దొంగలు…..దేశరాజు కథలు – సి. సుజాత           నవలకి సూక్ష్మ రూపమే కదా కథ. పూర్తి జీవితం గురించి చదివిన ఫీలింగ్ వస్తుంది కనుకే నాకు కథే ఇష్టం. సంపుటిలోని 13కథలు చాలా కథలు వివరంగా రాయవలసినంత బాగున్నాయి. చిలుక…..కూడా అపార్ట్ మెంట్ సంస్కృతికి సంబంధించినది కనుక కొంచం దగ్గరగా ఫీల్ అయ్యా. ఆలీబాబా అనేక దొంగలు ఐతే ఏదో కళ్ళ ముందు జరిగినట్లే ఉంది. మా అపార్ట్ […]

Continue Reading
Posted On :

స్వయంసిద్ధ (ఒక అభినేత్రి జీవనరేఖ)

స్వయంసిద్ధ (ఒక అభినేత్రి జీవనరేఖ) – గణేశ్వరరావు          ఉమ్రావ్ జాన్ లో రేఖని చూసిన వాళ్ళెవరూ ఆమెని మరిచిపోలేరు. (అన్నట్టు ‘ప్రేమ’ ‘పెళ్ళి’ నిర్వచనాలు రేఖ జీవితచరిత్ర చదివాక మారిపోతాయి!)           శ్రీదేవీ మురళీధర్ – యాసిర్ ఉస్మాన్ నవల ‘రేఖ-ది అన్ టోల్డ్ స్టోరీ’ ఆధారంగా రాసిన ‘స్వయంసిద్ధ’ (ఒక అభినేత్రి జీవనరేఖ) పుస్తకంలోని కొన్ని వ్యాఖ్యానాలు ముందు చదవండి. యాసిర్ పాత్రికేయుడు, రేఖ జీవితచరిత్ర […]

Continue Reading
Posted On :

మలయమారుతం- (బ్రిస్బేన్) శారద కథలు పరిచయం

మలయమారుతం- (బ్రిస్బేన్) శారద కథలు పరిచయం – ఎన్.ఎస్.మూర్తి ఈ కథాసంకలనంలో 15 కథలు ఉన్నాయి. 15 కథలలో జీవిత చిత్రణ ఉంది. చదువుకున్నవాళ్ళు ఆలోచనాపరంగా స్వతంత్రులుగా ఉండగలరు అన్నది ఒక భావన. కానీ, తమ వ్యక్తిగత అభిప్రాయాల పరిధిలో విషయ వివేచన చేసే వారే తప్ప, వస్తువుని లేదా సమస్యని దానికది విడిగా చూసి వివేచన చేసే వారు అరుదు. వయసూ, అందం, తాము నీతిమంతులమనే భావనా, అధికారాల్లాగే, చదువు కూడా అహంకారాన్ని ఇస్తుంది. తమ […]

Continue Reading
Posted On :

తస్లీమా నస్రీన్ లజ్జ నవల పై సమీక్ష

తస్లీమా నస్రీన్ లజ్జ నవలపై సమీక్ష – దివికుమార్ “సమాజంలో ఆధిపత్య శక్తులు తమ పట్టుని కోల్పోతున్న పరిస్థితులలో దాన్ని నెలకొల్పుకోవడానికి మతాన్ని వాహకంగా (సాధనంగా) వినియోగించుకునే రాజకీయమే మతతత్వం.” మిత్రులారా! భారత ఉపఖండానికి సుదీర్ఘ ఉమ్మడి చరిత్ర ఉంది. తరతరాల ఉమ్మడి సంస్కృతిక వారసత్వం ఉంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అన్ని మతాల ప్రజలు ఐక్యంగా ఉద్యమించిన సంపద్వంతమైన ఉజ్వల పోరాట ఘట్టాలు ఉన్నాయి. అయినా మతం ప్రాతిపదిక పైన విడిపోయిన వాస్తవం మన కళ్ళముందే […]

Continue Reading
Posted On :

ఆధునిక తెలుగు భాషా నిర్మాణం పై సమీక్ష

ఆధునిక తెలుగు భాషా నిర్మాణం – డా. టి. వెంకటస్వామి ప్రారంభంలో తెలుగు భాషా వ్యాకరణాలు, సంస్కృత భాషా ప్రభావంతో వచ్చాయి. ఆ తర్వాత ఆంగ్ల భాషా ప్రభావాలతో వెలువడ్డాయి. తెలుగును తెలుగు భాషాశాస్త్ర దృష్టితో పరిశీలించిన భాషావేత్తలు తెలుగు భాషా వ్యాకరణాలు రాశారు. భద్రిరాజు కృష్ణమూర్తి, జి.ఎన్. రెడ్డి, చేకూరి రామారావు, పి.యస్. సుబ్రహ్మణ్యం, వెన్నలకంటి ప్రకాశం, జి. ఉమామహేశ్వరరావు మొదలైన ఆచార్యులు, భాషావేత్తలు ఆధునిక భాషా నిర్మాణాన్ని లోతుగాను, స్పష్టంగాను వివరించారు. ఆ కోవలో […]

Continue Reading
Posted On :

“కలిసుందామా!” కథా సంపుటి పై సమీక్ష

“కలిసుందామా!” కథా సంపుటి పై సమీక్ష – శృంగవరపు రచన ఎన్నోసార్లు సమాజం మనిషిని అనేక రూపాల్లో ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. వ్యక్తి గా సమాజంలో భాగం అయ్యే మనిషి తన జీవితంలో సమాజ ప్రభావం వల్ల సంతోషం కన్నా దుఃఖమే ఎక్కువగా ఉందని గమనించిన నాడు ఆ సమాజాన్ని లెక్క చేయకుండా బ్రతికితే తన జీవితం బాగుంటుందన్న భావనలో ఉంటాడు.అనేక సామాజిక సమస్యలు తలెత్తినప్పుడు మనిషి వాటిని ఎదుర్కునే క్రమంలో ఈ పద్ధతినే అవలంబించాడు. కానీ […]

Continue Reading
Posted On :

‘భిన్నసందర్భాలు’ – పునరుత్పత్తి రాజకీయాలు

 ‘భిన్నసందర్భాలు’ – పునరుత్పత్తి రాజకీయాలు – ప్రొ కె. శ్రీదేవి             మహిళా సంఘాలు, స్త్రీవాదులు పునరుత్పత్తి, రాజకీయ రంగాలలో  లేవనెత్తిన అనే క ప్రశ్నలను ఓల్గా “భిన్నసందర్భాలు” కథాసంపుటిలో చర్చించారు. శ్రమ విభజన, లైంగికతను నిర్వచించడంలో ఉండే రాజకీయ అంశాలను నిర్దిష్టమైన జీవన సందర్భాల లోంచి ఓల్గా విశ్లేషించారు. పునరుత్పత్తిలో ప్రధానపాత్ర వహిస్తున్నది స్త్రీలే అయిన ప్పటికీ, అందులో స్త్రీలకు ఎటు వంటి స్వేచ్ఛలేదు. ఈ స్వేచ్ఛారాహిత్య స్థితిని […]

Continue Reading
Posted On :

కొమ్మూరి వేణుగోపాలరావు నవల పెంకుటిల్లు

కొమ్మూరి వేణుగోపాలరావు నవల పెంకుటిల్లు -పారుపల్లి అజయ్ కుమార్ మధ్యతరగతి జీవనానికి ప్రతీక ‘పెంకుటిల్లు’ ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’ అని ఒక నానుడి వినే వుంటారు. అంటే మానవీయ సంబంధాలు, వాతావరణం, ఆహార పదార్థాల విషయాల్లో గతమే బాగుండేదని గొప్పగా చెప్పడానికి పెద్దలు ఈ మాటను ఉపయోగించేవారు. కథలకు కరువొచ్చిందో, వర్తమాన అంశాల పై పట్టుచిక్కడం లేదో తెలియదు కానీ, వర్తమానాన్ని కాదని గతం లోతుల్లోకి వెళ్ళి కథలను వెలికి తీస్తున్నారు నేటి మన సినిమా […]

Continue Reading
Posted On :

కొండపొలం

కొండపొలం -పారుపల్లి అజయ్ కుమార్ వ్యక్తిత్వ వికాసాన్ని నేర్పిన కొండపొలం నల్లమల అడవుల చుట్టుపక్కల గ్రామాల్లో వర్షాభావం చేత గొర్రెలకు తినడానికి మేత, తాగటానికి నీరు లేనప్పుడు, వర్షాలు పడేవరకు తమ గొర్రెలని బతికించుకోవటం కోసం గొర్రెలకాపరులు అడవిబాట పడతారు. మళ్ళీ తమ ఊరిలో వానలు పడి గొర్రెలకు నీరు, మేత దొరికే వరకు అడవుల చుట్టూ సంచరిస్తుంటారు. ఇలా చేసే వనవాసాన్ని స్థానికులు కొండపొలం వెళ్లటం అని వ్యవహరిస్తారు. వంద గొర్రెలున్న పెద్ద మంద గురప్పది. […]

Continue Reading
Posted On :