Haunting Voices: Heard and Unheard

Telugu Short Stories

-Syamala Kallury

She is a familiar sight. People who come to the beach everyday see her there. Always in the same place – on the last bench, in a corner, staring at the sea. And people wonder why there was never anyone with her. She sits silently as if in meditation. By five in the evening she comes holding the hand of a young boy, he takes to her usual bench, makes her sit there, places her small bag with a water bottle in it by her side and leaves, waving to her, “Bye, grandma. Will come and pick you up later.” She turns towards the waves of the sea and starts her conversation. Most of the times it seems one sided as only the roar of the sea is heard not the voice of the fumbling old woman.

That day he forgot to come back. The old woman sat there unconcerned as if she also forgot to go home. The boy had to meet a friend and after it was almost three four hours he went home. At the threshold, he stopped. ‘Grandma!’. He ran out again to see her sitting there where he left her almost four hours back. She was not even aware of the gathering darkness around her. 

‘Grandma! Thank God! Come, it is very late today. Sorry, I thought you must have gone home on your own’

“Oh, is it so dark already, I did not notice”

“What do you think about, every day, grandma? If one day I forget to collect you, you will not remember you have a home to go back to. You will get lost.” He said, concerned about her absorption. Absorption in what, in the sea, in her own thoughts? What does she think about? Today he must know, find out about her world. She rarely talks, today he was determined to get some answers.

She looked at him and smiled, “What do I think about, I don’t think at all. I just hear them.”

“Them? Who?”

“I don’t know. I hear the voices. From the sea. Do you know that this is a sea of stories? I hear voices coming to reach out. But… but I must focus. Or I cannot hear them clearly. So many voices-talking at a time. Trying to get my attention. I hear them all. Murmuring, mumbling, whispering, wailing, groaning, gaining strength, shouting, screaming – voices all at a time. I want to hear them all?”

“Who are they? What do they tell you? Tell me.”

“You can’t understand. You don’t know their language”

“Then tell me in the language I know and understand. You must tell me. I want to hear these stories. The voices… what do they tell you?”

“Where is the time for you to hear my old outdated stories, coming from a time when you were not even born? What is the point?”

“Why? Try me?”

“Okay I will tell you one story at a time. They were all written in your mother tongue. I know you cannot read and write. But surely you can hear. I will you about the story. Then you read the story in the language you know. Will the voices get distorted? I hope not. I hear them all jumbled up anyway when they come to me from the sea of stories. There are so many They jostle, push, pull and try to get my attention. Let us hear them all, one by one, one at a time. Every day after I get back home, before you get into your bed we will talk of one voice and one story. One predominant voice after the other as I hear, you will get to know from me,” Grandma told him.

“Fantastic!” exclaimed the boy

(That is how you will all hear stories coming through me from the voices of men and women of the eastern coast in Visakhapatnam. Is our sea a sea of stories? You decide. They tell stories that haunt, entertain, engage, educate, ennoble and provoke. They send you on a quest for more. Well, I hope so! )

***

భారతీయ భాషలనుంచి ఆంగ్లంలోకి సాహిత్యానువాదాలు-ఒక పరిశీలనాత్మక విశ్లేషణ

-డాక్టర్ కల్లూరి శ్యామల

 

ఇరవై ఒకటవ శతాబ్దం ప్రవేశించి ఒక దశాబ్దం పైగా గడిచిపోయింది. ప్రపంచం వ్యాపారీకరణం వైపు, సాంకేతిక ప్రగతివైపు అతి త్వరగా అడుగులు వేస్తూ, పరుగందుకుంటూ మానవ ప్రగతి పట్ల మనకున్న, వుండాల్సిన దృక్పధాన్నే మార్చివేస్తున్నది. ఈ సందర్భంలో ఒక్క క్షణమాగి. ఏఏ రంగాలలో ఈ పురోగతి శీఘ్రగతిలో ముందుకెళ్తున్నది ఏఏ రంగాలలో ఇంకా మన ప్రయాస, ప్రయత్నాలు పెంపొందించుకోవాలి అని పునరావలోకించుకోవసిన అవసరమెంతైనా వుంది. ప్రపంచీకరణ అని మనం దేన్నైతే అంటున్నామో అది మానవజీవితంలో ప్రతి అంశాన్నీ స్పృశిస్తున్నది. అయితే దీని ప్రభావం ఒక్క వాణిజ్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో వుందని అని సాధారణంగా జనసమ్మతమైన అభిప్రాయం. ఈ రంగాలలో అత్యధిఅకంగా వున్నమాట వాస్తవమే అయినప్పటికీ సాధారణజనజీవనాన్ని ప్రభావితం చేసే దిశలో ఎన్నో విధాలుగా ఈ ప్రపంచీకరణ మన ఆలోచనావిధానాన్ని, మన విశ్లెషణాత్మక పరిధిని అనేక దిశలలో విస్తరింపజేస్తున్నది. దీనిని వ్యతిరేకించినా, దీని ప్రభావాన్ని తప్పించుకుందామని ప్రయత్నించినా వెనకాల వున్నవాళ్ళు వెనకే వుండిపోతున్నారు. దీని ప్రవాహంలో ప్రపంచం కొట్టుకుపోవడం తప్పనిసరి అయినప్పుడు, ఎంతోకొంత మంచిని మనమూ పొందాలనుకుంటే దీనిని స్వీకరించకతప్పదు. సాద్యమైనంతమట్టుకు వ్యతిరేక ప్రభావాల్ని ప్రతిఘటిస్తూనే మంచిని మనకి వుపయోగించేలా మలచుకోవాల్సిన అవసరం ఈనాడెంతయినా వుంది. అంతేకాదు, సంచార, దూరభాష, అంతర్జాల సంభాషణలు విస్తరిస్తున్న ఈ యుగంలో ఒకభాషనుంచి మరొకభాషకి వుండవలసిన సంస్కృతీ వంతెనలు పటిష్టంగా వుండాలంటే నేడు మనకి ఈ ప్రపంచీకరణం పట్ల అవగాహనవుండటం అవసరం. సాంకేతికంగా మన భారతీయ యువకులు దేశ విదేశాలలో విస్తరించి ప్రపంచీకరణంలో మరేదేశంలోనూలేనంత విశిష్టంగా తమపాత్రను నిర్వహిస్తున్నారు. అయితే ఈ పరుగుపందెంలో ముందుండాలనే తపన వీరిని కొన్ని ముఖ్యమైన అంశాలనుంచి దూరం చేసింది.మాతృభాష పట్ల వుండవలసినంత అభిమానంలేకపోవడమనేది వీటిలో చాలా ప్రధానమైన అంశం. చిన్నప్పటినుంచే వైద్య, సాంకేతిక, ప్రాద్యోగిక, తదితర వృత్తి రంగాలలో నైపుణ్యాన్ని సంపాదించుకున్నంత వేగంగా భాషా, సృజనాత్మకమైన అంశాలలో పట్టుని కోల్పోతున్నారనేది నిర్వివాదాంశం. ఏ సాంకేతిక పురోగతి వీరిని వీటినుంచి వంచిస్తున్నదో ఆ సాంకేతిక పరిఙానాన్ని నిచ్చెనగా చేసుకుని భాషాసంస్కృతులకి వారధులు కట్టుకోవచ్చును అనే అంశాన్నిపరిశీలనాత్మక దృక్పధంతో విశ్లేషించటం ఈ నాటి నా ప్రసంగం యొక్క ముఖోద్దేశ్యం.

 

దీనిలోఈ ప్రపంచీకరణలో భాగంగానే భాష అభివృద్ది, భాషపట్ల మమకారం యువతలో పెంచటానికి మార్గాలనన్వేషించటం ముఖ్యమైన అత్యవసరమైన అంశంగా మనం గుర్తించాలి. ఒకవైపు మన భాషలకి ప్రాచీన భాషగా గుర్తింపుకావాలని రాజకీయ పోరాటాలు చేస్తూనే మన కాలేజీలలో చదువుకునే యువత మనభాష మాట్లాడటం తప్ప రాయడం చదవడం తెలియని స్థితిలోకి వచ్చేలా విద్యావిధానాల్ని రూపొందిస్తున్నాము. మనభాషలోని మంచి సాహిత్యాన్ని మనపిల్లలికి తెలియచెప్పాలంటే వాటిని వారికి అర్థమయ్యే భాషలోకి అనువదించి చెప్పవల్సి వస్తోంది. ఇది కేవలం ప్రవాసాంధ్రుల సమస్య అనుకుంటే పొరపడుతున్నామనే అనుకోవాలి. ఈనాడు భారతదేశంలో ఏనగరంలోనైనా సరే మాతృభాషని  మాట్లాడగలిగేవాళ్ళు చాలా తక్కువసంఖ్యలో వుంటారు. ఒకవేళ ఎవరైనా వున్నా వారి భాషలో వున్న రచయితలెవరో చెప్పలేరు. హింది వాళ్ళకి ప్రేమ్ చంద్ తెలుసు అతను రాసిన ఒక కథని గురించిగూడా చెప్పలేరు. అల్లాగే బెంగాలీ వాళ్ళు మళయాళీ వాళ్ళు వాళ్ళ రచయితల/యిత్రులగురించిన ఎలాంటి అవగాహనలేకుండానే పెరిగిపెద్దవుతున్నారు. తెలియకపోవడము వలన వారికి ఏ విధమైన నష్టమూలేదు వారి దృష్టిలో. జీవితంలో అంచెలంచెలుగా ఎదగటానికి నిజానికి మాతృభాష అవసరంలేదు ఎవరికీ. అందుకే విద్యావిధనాలుగానీ, తల్లిదండ్రులుగానీ, స్వయంగా పిల్లలుగానీ సాహిత్యపరంగా భాష నభ్యసించటానికి ప్రయత్నించటంలేదు నేర్చుకోవల్సిన వయస్సులో. అయితే చదువులయ్యి ఏ వుద్యోగోల్లోనో స్థిరపడి ఒక పదేళ్ళుగడిచాకా తమ భాషతమపిల్లలికి రాదేమోనన్న తపన మొదలవటం చూస్తున్నాము. విదేశాలలో స్థిరపడిన వాళ్ళకీ రాష్ట్రాంతర వాసులకీ ఈ తపన ఇంకా ఎక్కువ.అప్పుడు తాముకోల్పోయినదేమిటో అది ధన కనక వస్తువహనాదులకి సంబంధించనిదని అది పూర్తిగా హృదయానికి, మానసిక సుస్థిరతకి చెందినదని అర్థమవుతుంది. తెలుగు రాని వాళ్ళకోసంకాకపోయినా తెలుగురాని తెలుగు పిల్లలకోసం ఈనాడు సాహిత్యానువాదాల అవసరం ఎక్కువవుంది. ఇక ముందు పెరుగుతుంది కూడా! ఇంకో విషయం. ఈనాడు మనం చూస్తే ప్రతి కాలేజీలోనూ అందులో మరీ ముఖ్యంగా ప్రొఫెషనల్ కాలేజీలలో యజమాన్యాలు పిల్లలు కమ్మ్యూనికేషన్ స్కిల్స్ లాంటి కోర్సులు వుండాలని కోరుకుంటున్నారు. కొంచెం పరిశీలించి చూస్తే ఎవరికన్నా అర్థమయ్యే విషయమేమిటంటే మాతృభాష మీద పట్టు వున్న విద్యార్థులకి ఆంగ్లంలో కూడా బాగా భావప్రకటనా సామర్థ్యంవుంటుంది కొద్దో గొప్పో వుంటుంది. మాతృభాష రానివాళ్ళకి ఏభాషా పట్టుపడదు త్వరగా. ఇప్పుడు పదవతరగతితర్వాతగానీ, అప్పుడప్పుడు ఎన్మిదో తరగతి తర్వాత తెలుగు గాని మరేఇతర మాతృభాష ఎవరూ చదవడంలేదు. ఇంజనీరింగులు మెడిసన్ పూర్తిచెయ్యట్టానికి ఆరునుంచి ఎనిమిదిసంవత్సరాలు పట్తుందనుకున్నా ఇంతకాలం వారి భాషని చదవడంగాని రాయడంగాని చెయ్యరు ఎవ్వరూ! సహజంగానే ప్రావీణ్యం తగ్గిపోతుంది. చదువులు పోటీలువారంతట వారు చదవడానికి అవకాశాన్నివ్వవు అనే విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ చదువులయ్యి వుద్యోగాల్లో స్థిరపడ్డాకానే కొందరికి భాషా మీద ద్యాస మళ్ళుతుంది. అప్పుడు అందరూ అనువాదాలద్వారానే తమతమ భాషా సాహిత్యాలమీద అవగాహన పెంపొందించుకున్నా తమ తర్వాత తరాల వారికి అందిచ్చినా, ఈ విధంగా అనువాద సాహిత్యంయొక్క ప్రాముఖ్యత నేటి ప్రపంచీకరణయుగంలో పెరుగుతున్నదని అర్థమవుతున్నది. భాషమీద అభిమానం పెంచుకోవటానికి ఈ తరం మళ్ళీ ప్రయత్నిస్తున్నదనటానికి అమెరికాలోనూ బెంగుళూరు, హైదరాబాదులాంటి మహానగరాలలో ఎంతోమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు తెలుగు వెబ్ సైట్లని ప్రారంభించి సాహిత్యాన్ని డిజిటైజ్ చేసి చర్చలు నిర్వహించి మంచి కృషి చేస్తున్నారు. బెంగుళూరునుంచి రఘోత్తమరావుగారి ఆవకాయ.కామ్ అమెరికానుంచి కౌముది, తెలుగుజ్యోతి లాంటి సాహిత్య పత్రికలు, అక్షర అనే అప్సర్ గారి వెబ్సైట్ నిడదవోలు మాలతిగారి తులిక వీటిలో చెప్పుకోదగ్గవి. వీరందరికీ తెలుగు సాహిత్యం మీద మంచి పట్టు వుండటం ఒక ఆసక్తికరమైన విషయం. ఒక పఠనాసక్తి వుంటే గానీ ఈ అభిలాషని పోషించుకోవటం కష్టం. ఇలాంటి కృషి మన తర్వాత తరాలవాళ్ళు చేస్తారా,చెయ్యగలరాచెయ్యగలరాచెయ్యగలరా అనేది సందేహాస్పదమైన విషయమే!

 

ఇక సాహిత్యానువాదానికివస్తే దానికి వున్న సాధక బాధకాలు ఏమిటో పరిశీలించాలి. భారతదేశంలాంటి బహుళ సంస్కృతీ  వికాసాలు ప్రధానభూమిక వహించే సమాజంలో అనువాద ప్రక్రియకి ఒక విశిష్టమైన ప్రత్యేకమైన స్థానంవుంది. ఒక భారతీయభాషనుంచివేరొక భారతీయ భాషలోకి అనువదించటానికి వున్న సాధక బాధకాలకన్నా ఒక భారతీయ భాషనుంచి ఆంగ్లభాషలోనికిఅనువదించటానికి వున్న సాధకబాధకాలెక్కువనేచెప్పాలి. ఎందుకంటే ఆంగ్లభాష యూరోపియన్ భాష సముద్రాలు ఖండాలు ఎడారులు ఇన్నిటిని దాటితేనేగానీ ఈ దేశాలెల్లా చేరుకోలేమో ఈ సంస్కృతిని అల్లా మనసంస్కృతితో మిళితమయ్యేలాచెయ్యలేము. మనదేశంలోనే సంస్కృతీ వైరుధ్యాలు ఉత్తర దక్షిణ భారతాలమధ్యవున్నప్పటికీ  చాలామట్టుకు సంస్కృతం మూలభాషకనక భాషపరంగా సంస్కృతీ పరంగా అనువాదాలు చెయ్యటం అంతకష్టంకాదు. గమనించవలసిందేమిటంటే ఒక భాషలో చెప్పగలిగినదేన్నైనా మరో భాషలో చెప్పగలము. సమస్య ఎక్కడవస్తుందటే మనభాషలో చెప్పినట్టే చెప్పాలి అనుకుంటే అందంగా మూలభాషలో చెప్పినట్టు అనువదింపబడిన భాషలో చెప్పలేము. అప్పుడు అనువాదం సహజంగా చదివించేశక్తితో వుండదు. మనంరాస్తున్నది మూలభాషతెలియని వాళ్ళకి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకి రెండు భాషలలో ప్రావీణ్యముండటము చాలా అవసరం. అయితే చదువరినే దృష్టిలో పెట్టుకోవాలి. దీనికి ఉదాహరణగా తెలుగులోకి ఎన్నో శరత్ నవలలు రవీంద్ర సాహిత్యం అనువాదమై వచ్చింది. అవి బెంగాలీలో ఇంకా ఎంత అందంగా వుంటాయో మనకి తెలియదు తెలిసే మార్గంలేదు ఆభాషలు నేర్చుకుంటేనే కాని. తెలుగులో చదివినంతమట్టుకు అవి ఒక స్వతంత్ర ప్రతిపత్తిగల సాహిత్యంగా మనకి స్పురిస్తాయికనుకే వాటికంత సాహిత్య ప్రయోజనం, విలువ నేటికీ వున్నాయి. అల్లాగే రష్యన్ భాషనుంచి ఆంగ్లంలోకి గానీ మరే భాషల్లోకి గాని వచ్చిన అనువాదాలు సహజంగానే అనిపిస్తాయి కానీ అనువాదాలనిపించవు. తెలుగు సాహిత్యంలోకొస్తే ప్రత్యేకంగా వేరేభాషలనుంచి తెలుగులోకి అనువాదాలు విస్తృతంగా వచ్చినా సాహిత్యపరంగా తెలుగునుంచి వేరే భాషలలోకి వెళ్ళిన గ్రంధాలు గానీ కవిత్వాలుగానీ మంచి నవలలుగానీ తక్కువనే చెప్పాలి. అయితే దీన్ని బట్టి మనకి  అనువాదంతెలియదనుకుంటే పొరపాటు పడినట్టే. మనందరం గుర్తుంచుకోవాల్సినవిషయం ఒకటుంది. తెలుగులో ఆది కావ్యంగా గుర్తింపబడిన పదిహేను పర్వాలు గల ఆంధ్ర మహాభారతము  మూలభాష సంస్కృతమని అయితే మనభారతం మూలానికి మక్కీమక్కీ అనువాదం కాదని అది మూల గ్రంధం ఆధారంగా రాయబడిన స్వతంత్ర ప్రతిపత్తి గల కావ్య అని చెప్పచ్చును. దీనిని అనువాదమనరాదని అనుసృజన అనాలనీ కూడా పలువురి అభిప్రాయం. ఆమాటకొస్తే మనభారతీయ భాషల్లో చాలా మట్టుకు ఆది గ్రంధాలు సంస్కృతభాషనుంచి అనుసృజింపబడినవే. ఆరకంగా మనకి ఏదీ మూలగ్రంధమంటూలేదని కొందరి అభిప్రాయం. మన మనస్సుకి వచ్చిన భావాల్నిభాషాంతరీకరించటమే మొదటి అనువాదప్రక్రియ అని అనుకోవచ్చును.

 

సాహిత్యానువాదాలు ఈనాడు ప్రాముఖ్యతని సంతరించుకోవటానికి ముఖ్య కారణం ఆంగ్లభాష ప్రభావం పెరగటం. అయితే, భారతీయ భాషలపట్ల భారతీయులకి మమకారం క్షీణిస్తున్న నేటికాలంలో ఒక భారతీయ భాషనుంచి మరొక భారతీయభాషలోకి సాహిత్యానువాదాలు జరగటం సమంజసమైనవిషయం. అయితే ఆంగ్లభాషప్రభావం పెరగటమే కాక దానిని వుపయోగించేవారి సంఖ్య దేశ విదేశాలలో పెరుగుతుండటంతో ఆంగ్లానువాదాలకి ప్రాచుర్యం పెరిగింది. తెలుగుని గానీ మరే ఇతర భారతీయ భాషని గానీ చదవలేని వారు తప్పనిసరిగా వృత్తి వ్యాపకాలలో వృద్దికోసం ఆంగ్లభాషని అభ్యసించటం ఒక తప్పని ఉప్పెనకనుక ఈనాడు తెలుగు చదవలేని వాళ్ళెందరో ఆంగ్లభాషని కొద్దొగొప్పో చదవగలుగుతున్నారుకనుక ఆంగ్లానువాదాల అవసరం వాటి పట్ల మమకారం పెరిగింది.అయితే ఒక విషయం, ఈ విశ్లేషణంతా పట్నవాసాల్లో వుంటూ మాతృభాష మరుగున పడిపోయిన వాళ్ళకే, పల్లెలలో ప్రాంతీయభాషామాధ్యమంలో చదివేవాళ్ళకి ఈ సమస్యలు లేవు.  విదేశాంధ్రులేకాక నగరాల మయాజాలంలో పెరిగే స్వదేశాలలోనేవున్న ప్రవాసాంధ్రులుకూడా ఆంగ్లానెక్కువ చదువుతున్నారు. అంతేకాదు. అంతర్జాతీయ భాషగా ఆంగ్లానికి గుర్తింపు వుండటం మరొక కారణం. సంస్కృతీపరంగా ఔన్నత్యశిఖరాలనధిరోహించిన మన సంస్స్కృతి భాషాపరంగా ఉచ్ఛస్థాయిలో వున్న ఆంగ్లంలోకి అనువాదాలరూపంలో మమైకమవటానికి చారిత్రకంగా ఆంగ్లపాలనక్రింద భారతదేశం రెండు వందల సంవత్సరాలు గడపవలసిన రావటం అన్నిటి కంటే ముఖ్యమైన కారణం. అలెక్సాండర్ కాలంనుంచి మొగలాయీ పార్సీ, సింధీ యేరొపియన్స్ దాకా అన్ని సంస్కృతులనీ తనలో కలుపుకుంటూ వచ్చిన భారతీయ సముద్రం ఆంగ్లో సాక్సన్ తో మొదలై జెమానిక్ ట్యుటానిక్, స్కాండినేవియన్ల తోమొదలై, ఆసియాలో సంస్కృతం ఇంకా ఎన్నో భారతీయ భాషలతొ సహా ఎన్నో పదాలని తనలోకలుపుకుని విస్తృతమైపోయిన ఆంగ్లభాషాసముద్రంలో కలవటం ఒక అద్భుతమైన నాగరికతల కలయికగా చిత్రించవచ్చును. సాంకేతికంగా చూస్తే సాప్ట్ వేర్ లో అత్యంత ప్రావీణ్యత సంపాదించుకున్న ఇంజనీర్లు  భారతీయులలో ఎక్కువమంది వున్నారు. భారతీయభాషలని ప్రపంచవేదికమీద ఆవిష్కరింపదలుచుకుంటే ఇంతకుమించిన అవకాశంమనకిలేదనుకోడం అత్యాస కాదు. అయితేఅయితే అయితే, అందరు ఇంజనీర్లూ ఈ దృష్టిత్అయితో ఆలోచించగఅయితేలరా అనేది ముఖ్యం. మళ్ళీ చదవవలసిన వయస్సులో సమయంలో తెలుగుని చదవలేకపోవడం ఈ భాషారాహిత్యతకి కారణం మళ్ళీ. ఇదొక విష చంక్రమణం.

ఇంగ్లీషువాళ్ళకి వారి సాహిత్యాన్ని ప్రపంచమంతా వ్యాపింపచేయటానికి ఏ అనువాదాల అవసరంలేదు. ఇతర ప్రపంచ భాషల నుంచి సాహిత్యం మనం చదవగలుగుతున్నామంటే ఆంగ్లభాష సౌలభ్యంవలననే లభిస్తున్నది.

ఇక అనువాద సమస్యల దగ్గరికి వస్తే ఇదివరకే చెప్పినట్టు సాంస్కృతిక సామీప్యం (కల్చరల్ ప్రోక్సిమిటీ) అని మన దేన్నయితే అంటామో అది రెండు దగ్గర భాషల మధ్య సులభంగా సాధ్యమవుతుంది. అల్లాగే చారిత్రకంగా ఒకే సమయానికి చెందిన రెండు భాషలమధ్య సయోధ్య త్వరగా కుదురుతుంది. ఒకపదిహేనవ శతాబ్దానికి చెందిన రచనని ఇరవై ఒకటవ శతాబ్దంలో అనువదిస్తేకంటే ఇరవైయవ శతాబ్దంలో రచించిన రచనలు ఇప్పుడు అనువదించడంలో  సమస్యలు రావు. అందుకే మధ్య యుగాల్లో మనభాషలో ఆవిర్భవించిన ప్రౌఢ, ప్రబంధ సాహిత్యాన్ని ఈ యుగంలో ఆంగ్లంలోకి అనువదించడంలో చాలా సాధక బాధకాలుంటాయి. చారిత్రకంగా సాంస్కృతికంగా దూరం పెరగటమే దీనికి కారణం.

 

మనదేశంలో స్వాతంత్రానంతరం ఆంగ్లానువాదాలపట్ల ఆసక్తి పెరగటం చూస్తున్నాము. ఇప్పుడు వస్తున్న రచనలని ఈ నాడు ఆంగ్లంలో అనువదించటంలో ఒక సౌలభ్యం వుంది. మనభాషలలో కూడా ఆధునికత పట్ల ఆసక్తి పెరగటంతో ఆంగ్లసాహిత్యం మనకి అనుకోకుండా వచ్చిన చారిత్రక వారసత్వంలా సంక్రమించింది. భారతీయాంగ్ల రచయితలు సల్మాన్ రష్డీ లాంటి వాళ్ళు దేశ విదేశాలలో తిరిగి సంపాదించిన దృక్పధాలు క్రొత్త కిటికీలు తెరిచినట్టయింది. అంతకుముందు దాదాపు నూట ఏభయిఏళ్ళ క్రితంనుంచి ఆంగ్లభాష మనకాలేజీలలో భోధనా మాధ్యమంగా మారినప్పటినుంచి దేశమంతటా ఆంగ్లంలో సృజనాత్మకంగా రాయాలన్న తపన పెరిగింది. దానితో పాటు ఇరవై శతాబ్దంలో నోబెల్ పురస్కారం స్వాతంత్రానంతరం మన రచయితలు పొందిన బుకర్ పులిత్జెర్ అవార్డుల వల్ల దాని వలన రచయితలు పొం దిన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ధనరాసులు ఆంగ్ల పట్ల ఆకర్షణ పెరగటానికి కారణమయింది. ఇప్పుడు ఆంగ్లపట్ల మమకారంతో పాటు మనభాషలు రచయితలని దేశ విదేశాలలో నివసిస్తూకూడా నిలబెట్టుకోవడానికి భారతీయులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఒక వివాదాస్పదమైన అంశం వుంది ఒక ప్రక్క దేశం ప్రపంచీకరణవేపు వెళ్తూ ముందంజవేస్తోంది. మరో్వేపు దేశంలోని ప్రతి ప్రాంతంలో భాషలో తమ ప్రత్యేకతని, గుర్తింపుని నిలబెట్టుకోవలనే తాపత్రయం కూడా పెరిగింది. ఆర్థిక వ్యాపారిక దూరాలు సంచార మాధ్యమాలు తగ్గుతున్నకొద్దీ మానసిక సాంస్కృతిక భాషాపరమైన దూరాలు పెరుగుతున్నాయి. వీటిమధ్య సంఘర్షణలు ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో జరగటం చూస్తున్నాము. దేశాలమధ్య సహకారం ఒక రంగంలో పెరుగుతున్నా భిన్ననాగరికతల మధ్య సంక్లిష్టతలు దేశం బయటా లోపలా కూడా పెరుగుతున్నాయి. భాషలు ఏ రకంగా వీటిని వ్యక్తీకరిస్తున్నారో చూస్తే ఈ పరిస్థితి క్లిష్టత మనకర్థమవుతుంది, తెలుస్తుంది.

 

ఫ్రతి భాషకీ తనదైన ఒక ప్రత్యేక నాదం అస్తిత్వం వుంటాయి. భారతీయ సామాజిక దృక్పధంతో చూస్తే ప్రతి  భాషకి ప్రాంతానికి కొన్ని ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, అలవాట్లు, ఆ ప్రాంతపు సంస్కృతిని బట్టి నిర్దేశింపబడి వుంటాయి. ఇవి వేరే భాషకి అనువాదించాలంటే వాటిగురించిన అవగాహన వుండటం అవసరం. భారతదేశానికి సంబంధించినంతమట్టుకు స్త్రీల పట్ల, దళితుల పట్ల మన సమాజంవ్యవహరించిన తీరు మన సమాజంవ్యవహరించిన తీరుదానికి వారు స్పందించిన విధానం, రకరకాలైన సామాజిక దృక్పధాలకి మనం ఇచ్చిన సాహిత్య స్పందన ఇవన్నీ మనజాతికే చెందిన కొన్ని అంశాలు. అల్లాగే మన హాస్యం, మన ఆరంభశూరత్వం, మన తిట్లు మనభాషకే చెందిన నిధులు. వీటిని వేరే భాషలలో పెట్టాల్సి వస్తే మరో భారతీయభాషల్లో వున్న సౌలభ్యం ఆంగ్లంలో వుండదు. ఇఫ్ఫుడు కొన్ని ఉదాహరణలిచ్చి నా ప్రసంగాన్ని ముగిస్తాను.

 

మన భావనలో నదుల కొక విశిష్టస్థానంవుంది. నీళ్ళు అనడంకంటే మనకి గంగాజలం అనడం పరిపాటు. ఈ అనడంలో ఒక పవిత్రత నదికి ఆపాదిస్తాం. ఉత్తారాదిన గంగ ఎలాగో దక్ష్ణిణాది వారికి గోదావరి అంత ప్రాశస్థం వున్న నది. ఆంగ్ల సంస్కృతికీ పవిత్రతఅనే భావన లేదు. అది కేవలం నీరు భౌతికంగా అంతే! అల్లాంటప్పుడు అడవి బాపిరాజుగారు “నరమానవుని పనులు శిరమొగ్గి వణికాయి కరమెత్తి దీవించి కడలికే నడచింది” అని వరద గోదావరిని వర్ణించినా, అద్దేపల్లి రామమోహనరావుగారు “గోదావరి నా ప్రతిబింబం” అంటూ “నీళ్ళు దో్సీట్లోకి తీసుకుంటే తెలుగు సంస్కృతి దోసిట్లో నిలబడుతుంది” అన్నా ఎండ్లూరి సుధాకర్ “నీ ఒడ్డు ఒడిలో తలపెట్టుకున్నప్పుడు అమ్మదగ్గిరే వున్నట్టుంటుంది; నీ ఇసుకమేనిపై పొర్లాడుతున్నప్పుడు నాన్నగుండెలమీద ఆడుకున్నట్టుంటుంది”  అంటూ నేటి గొదావరి భూమిపుత్రులదని చెప్పినా ఆఆ కవుల సామాజిక నేపధ్యం కవితలలో దాగి వుంటుంది. ఈ నేపధ్యాన్ని అనువదించగలగాలి.

“All life and men stood still

With heads bowed, shivering,

She towards the ocean flowed

Her hand raised and blessing!”

               Varada Godavari- Adivi  Bapiraju 

“Godavari is my mirror image…

When you hold the water in hands

It is like Telugu culture in your joined hands”

               Godavari Naa Pratibimbam

When I rest my head on your lap banks

I feel I am with my mother

When I roll in the sand dunes of your body

I feel I am playing on my father’s chest…

Godavari is not of the landlords,

Godavari is of the sons of the soil”

                                   Godavari – Endluri Sudhakar

 

కాలం మారుతున్నకొద్దీ నదిని కవి చూసే దృక్పధంలో వచ్చిన మార్పులు అనువాదంలో అర్థమయ్యాయని ఆశించవచ్చునా? అనే సందేహం పాఠకులే తీర్చగలరు.

 

ఇక సామాజిక దృక్పధానికి వస్తే,  అడుగుజాడ గురజాడది అని మనమంతా అనుకునే గురజాడతో మొదలై నేటిదాకా తెలుగుకవులు తమచుట్టూ వున్న సమాజ పరిస్థితులకి స్పందించి కవితలల్లారు “ఆవులు పెయ్యలు మందల జేరెను పిట్టలు చెట్లను గుమిగూడెన్, మింటను చుక్కలు మెరయుచు పొడమెను ఇంటికి పూర్ణమ రాదాయె” గురజాడవారు గుండెలు కరిగేలా కవితలల్లినా, ఇప్పటికైనా కాళ్ళను కళ్ళకద్దుకుని పూజించాలి. గాయపడ్డవాటికి మందురాసి వూరడించాలి అని కేతవరపు రమణమూర్తి అన్నా, ఆత్మల కాలుష్యమే ఆధునిక సమస్య, మట్టిమీద బ్రతుకంతా ఆవరించిన పచ్చదనంమీదా మమకారం చచ్చి పోయినప్పుడు చేతులు విద్వంస పరికరాలుగా మారినప్పుడు మనిషి కంటే వ్యర్థ పదార్థం లేదు అని పాపినేని శివశంకర్ అన్నా వీటివెనకాల ఒక సామాజిక సత్యానికి సంబంధించిన ఒక సందర్భం వుంది.

Homeward reached cows and calves

To the nests the birds of the forest

Glittering they appeared on the sky

She did not come home, Our Purnamma!

                            Putadibomma Purnamma- Gurazada Apparao

At least now learn to worship your legs,

Touching them to your eyes*

Treat them with balm, the hurt and ailing feet of yours

  •     To touch an object to the eyes is a gesture of reverence and worship

                               Mattikaallu- Ketavarapu Venkata Ramana Murthy

When we lose our link with

Our earth and green pastures

That we had once

When our hands turn into

Instruments of Destruction

There is no waste material

Worse than man

           Aakupacchani lokamlo- papinEni Siva Sankar

 

అల్లాగే మన ప్రయోగాలలో మొగుడనే వాడు ఓ అధికారం చూపించి దాసోహమనిపించాలని చూసే ఘటికుడిలా కనిపిస్తాడని చెప్పటానికెన్ని మార్గాలున్నాయో చూడండి.

“పాఠం అప్పచెప్పకపోతే పెళ్ళి చేస్తానని పంతులుగారన్నప్పుడే భయమెసింది, ఆఫీసులో నామొగుడున్నాడు అవసరమొచ్చినా సెలవివ్వడని అన్నయ్య అన్నప్పుడే అనుమానమేసింది, పెళ్ళంటే పెద్దశిక్షని, మొగుడంటే స్వేచ్చాభక్షకుడని” అని సావిత్రి బందిపోట్లు అనే కవితలో అంటుంది. అల్లాగే జయప్రభ “కుంతి కడుపునిండాకర్ణ గర్భభారాన్ని కడదాకా మోసింది” అని కుంతీదుఃఖాన్ని వర్ణించింది. “పరిక్ష పేపర్ కే కాదు, జీవితానికీ ఇవ్వాలి మార్జిన్, మనసిచ్చిన వాడినుంచికూదా బ్రతుకును భధ్రంగా దాచుకోవాలి” అని ఎస్. జయ చెప్పుతారు. సమాజంలో స్త్రీ స్థానంమీద పురాతన కాలంనుంచి నేటిదాకా స్త్రీ స్పందించిన విధానాన్నినేటి ఈ కవయిత్రులు అద్దం పట్టారు.

“I was scared when teacher said

He would get me married

If I don’t recite the lesson for the day!

I had a doubt when annayya said

There was a husband in his office

Who would not grant him leave

Even when you needed it desperately…

Then I understood that marriage is nothing

But a punishment!

Husband is one who swallows your freedom! “

                                Banndipotu – Savitri

“Full term, till the last minute of her life Kunti

Carried Karna in her womb…”

                                 Kunti – Jayaprabha

Margins should be given

Not just to the answer scripts in

Examinations, but to life too!

Life should be preserved

Even from the man you loved!

                               Half the World – S.Jaya

చివరిగా తెలుగు కవితలలో దళిత  స్పృహ తెలుగు సాహిత్యానికొక మానవీయతని నవీనతని ఆపాదించి పెట్టింది. ఎండ్లూరి సుధాకర్ నేడు రాస్తున్న కవి అయితే, కులతత్వాలు భారతీ యసాహిత్యంలో ఇరవైశతాబ్దంలో గుర్రం జాషువా గారి గబ్బిలం తో ప్రస్ఫుటంగా కనిపిస్తుందనిచెప్పవచ్చును. కులవివక్షత ఈ సమాజానికి అనాదినుంచి వస్తున్న దురాచారం అయితే

గాంధీ అస్పృశ్యతని అవకాశం వచ్చిన ప్రతి చోటా విస్తారంగా ఖండించటంద్వారా వ్యతిరేకించటానికి అనేకులకి స్పూర్తినిచ్చారు. ఎనభైల దశకంతర్వాత ఈ దళిత గొంతుకలు శక్తినీ బలాన్నీపుంజుకున్నాయి. వీరి ఆవేదనలలోని ఆర్తి భాషకొక క్రొత్త పదునుని సంతరించి పెట్టింది. ప్ర్రాపంచికంగగా అణచివె్తలు అంతటా వున్నాయి. కులవివక్షత మాత్రంమనకే చెందిన  మనకే చెందిన ఒక ప్రత్యేకత అని చెప్పవచ్చును. ఈ సందర్భాలని అనువదించటానికి తగిన భాష రూపొందించుకోవటం అనువాద ప్రక్రియలో ఒక భాగం. దీనివల్ల మనకి మనభాషపట్ల అవగాహన పెరగటమే కాదు ఏభాషలోకి అనువదిస్తున్నామో అందులో ప్రావీణ్యత పెరుగుతుంది.

వీటన్నిటిలో మనకి ముఖ్యంగా వుండాల్సిన అంశం చదువుపట్ల ఆసక్తి వుండాలి. కంప్యూటర్యుగంలో మనం కోల్పోయిన మరో కళ మంచిపుస్తకాలు గుర్తించటం ఏభాషలో వున్నా సరే చదవటం  అవగాహన పెంపొందించుకోవటం. అనువాదాల పాత్ర ఇక్కడఎంతో వుంది. ముందు ముందు ఇందులో వృత్తి అవకాశాలున్నాయి ప్రవృత్తిని పెంపొందించుకోవాలంతే!

 

*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.