

ఆడెపు లక్ష్మీపతి రచయిత, విమర్శకులు, అనువాదకులు. కరీంనగర్ జిల్లాలో జన్మించారు. హైదరాబాదు లో నివాసం. ప్రగతి సచిత్ర వార పత్రిక నుండి 1972, జూన్ 26న వెలువడిన సంచికలో ఈయన రాసి మొదటి కథ ‘ఆదర్శం’ అచ్చయింది. ఇప్పటివరకు దాదాపుగా 25కు పైగా కథలు రచించాడు. వీటిల్లో కొన్ని కథలు ఇంగ్లీష్ లోకి అనువాదమయ్యాయి. విమర్శవ్యాసాలు, నూతన ధోరణులపై విశ్లేషణలు కూడా రాశారు.
