లంబాడీ మూఢనమ్మకాలు-‘కాక్లా’ కథ

(నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)

-డా.లావుడ్యా సుజాత

ఆదివాసీ సమాజంలో ఒక్కో తెగ విశిష్ట క్షణాు ఒక్కో విక్షణరీతిలో ఉంటాయి. భారతదేశంలో నివసిస్తున్నా  గిరిజన తెగన్నీ విడివిడిగా ప్రత్యేకంగా తమ జీవన విధానాు, విశ్వాసాు, నమ్మకాు, మూఢనమ్మకాను కలిగి ఉంటాయి. దైవాలే కాదు వారి సంస్కృతు కూడా విడివిడిగానే ఉంటాయి. ఈ మూఢనమ్మకం నేపథ్యంగా మెవడినదే కాక్లాకథ.

కాక్లాకథా రచయిత డాక్టర్‌ భూక్యా తిరుపతి. వీరు 4 జూన్‌ 1976 న భూక్యా సోమ్లా, క్ష్మీ దంపతుకు వరంగల్‌ జిల్లా, పర్వతగిరి మండం, కొంకపాక గ్రామంలో జన్మించారు. ‘‘తెంగాణ ప్రాంతీయవాద కథు’’ అనే అంశం మీద హైద్రాబాద్‌ విశ్వవిద్యాయం తొగు విభాగం నుండి పిహెచ్‌.డి పట్టా పొందినారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రావిడ విశ్వవిద్యాయం, తొగు విభాగంలో సహాయ ఆచార్యుడిగా పదిహేను సంవత్సరాుగా ఉద్యోగ  బాధతు నిర్వహిస్తున్నారు.

కాక్లా కథ 16 నవంబర్‌ 2008లో వార్త దినపత్రిక అనుబంధం సంచికలో మొదటిసారిగా మెవడిరది. ప్రొ. జయధీర్‌ తిరుమరావు  సంపాదకుగా మెవడిన ఇప్పపూు’ (16 నవంబర్‌ 2009) కథా సంకనంలో కాక్లాకథ కూడా ప్రచురితమైంది.

విద్యాపరంగా విశ్వవిద్యాయ శిఖరాు ఆధిరోహించిన భూక్యా తిరుపతి  తమ జాతి  మూలాను మరవకుండా తన అభిరుచికి తగిన కథారచనలో తమ తెగకు చెందిన సంబంధించిన సమస్యను, సంస్కృతును, ఆచార వ్యవహారాను కథా వస్తువుగా ఎంచుకొని కథు వ్రాస్తున్నారు. అందులో భాగంగానే కేసు, మళావో, సగాయి, గోటావంటి కథు మెవరించారు. ఈ క్రమంలోనే స్వీయ అనుభవ మజలీ నుండి జాువారిన కథే కాక్లా’. ంబాడీ తెగ సంస్కృతిలో ప్రాచీన కాం నుండి నేటి వరకు కొనసాగుతూవస్తున్నా మూఢనమ్మకానికి నిదర్శనమీ కథ. కథ ఆసాంతం  కథకుడి చుట్టూనే సాగుతుంది. ఉద్యోగస్థానం నుండి జన్మస్థానం చేరే వరకు బస్సు ప్రయాణంతో పాటే పాఠకును ప్రయాణం చేయిస్తారు. ఈ కథ రచయిత యాదార్థ అనుభవా సమ్మేళనం.

కథా పరిచయం: రచయిత ఉద్యోగ నిమిత్తం కుప్పంలో  జీవితాన్ని కొనసాగిస్తుంటారు. ఒకరోజు వేకువజామున ఇంటి దగ్గర నుండి ఫోన్‌ వస్తుంది. ‘‘కరెంట్‌ షాక్‌ కొట్టి మేనత్త చనిపోయింది’’ వెంటనే బయుదేరి రమ్మని దాని సారాంశం. విషయం విన్న తనకి విపరీతమైన  బాధ కగుతుంది.. మేనత్త తనకు పంచిన అనురాగం, ఆమె చూపిన మమకారం, ఆమే ఆత్మీయ అనుబంధ యాదికి వస్తాయి. అవన్నీ కళ్ళముందు  కదలాడి. బాధ సుడు తిరుగుతుంది. తాను విన్నవార్త  నిజం కాకుండా ఉంటే బాగుండు అని అనుకుంటూ నిజనిర్థారణ కోసం మళ్ళీ ఇంటికి పోన్‌ చేస్తాడు. అవతలి వైపు నుంచి తల్లి ఏడుపుతోపాటు, బందువు ఏడ్పు వినిపిస్తుంది. బయుదేరావా?’ అన్న తండ్రి  ప్రశ్నకు బయు దేరుతున్నాను అని సమాధానం ఇచ్చి, మిత్రుడు శ్రీనుకు.విషయం చెప్పి ప్రయాణానికి సిద్ధం అవుతాడు.

మిత్రుడు శ్రీను సహామేరకు మరోసారి తన బావకు ఫోన్‌ చేస్తాడు రచయిత. అవును బావా! వెంటనే బయల్దేరి రమ్మని ఏడుస్తూ చెబుతాడు. దీనితో విషయం గ్రహించి పరిస్థితిని అర్థం చేసుకొని మిత్రుడు చెప్పిన జాగ్రత్తు వింటూ కుప్పం చేరుకుని, అక్కడి నుండి విజయవాడ వెళ్ళే బస్సు ఎక్కి కూర్చుంటాడు. డ్రైవర్‌ వెనుక టి.విలో సమరసింహారెడ్డి సినిమా ప్లే అవుతుంటుంది కాని అది చూసి ఆస్వాదించే స్థితిలో తాను ఉండడు. కూర్చున్నాడనే పేరేగాని మనస్సు మనస్సలో లేదు. తన చిన్ననాడు మేనత్త చెప్పిన కథు, ఆమె జ్ఞాపకాు  రచయితను ముసురుతాయి.  ఆకలి, ఆసట, సమయం ఏమి ఏర్పడకుండానే సాయంత్రం 6గంటకు విజయవాడ చేరుకుంటాడు.

ప్రయాణం సాగుతున్నంత సేపు ఊరిలో విగతజీవిగా పడి ఉన్నా  మేనత్తను చివరి సారిగా చూసుకోవానే తపన ఎక్కువగా బాధించసాగింది. విజయవాడనుండి వరంగల్‌కు ఆ సమయంలో   రైళ్ళు ఏమి లేకపోవడంతో మళ్ళీ బస్సు ఎక్కుతాడు. బస్సు బయుదేరడానికి  సమయం పడుతుందని తెలిసిన అలాగే కూర్చుంటాడు. అంతలో అటుగా వచ్చిన ఒక వ్యక్తి ప్రయాణ వివరాు అడిగి అప్పటి వరకు ఇక్కడ ఎందుకు తనతో వస్తే మంచికాక్షేపం ఇస్తాను మంచి అందమైన ంబాడా గుంట ఒక్కసారి చూస్తే ఇక వదరు అంటూ ప్రలోభపెడతారు. అసలే బాధతో ఆవేదనలో ఉన్న తనకు వాడి మాటు అసహ్యాన్ని కలిగిస్తాయి. చెత్త నాకొడకా అంటూ ఆ వ్యక్తిని చెడా మడా తిట్టెస్తాడు. 

కానీ . . . . . అతని మాటతో తమ తండాలోని అనేక మంది అందమైన అమాయక స్త్రీు పట్నం వెళ్ళి డబ్బు సంపాదించే యావలోపడి వ్యభిచార కూపంలో కూరుకుపోయిన  సంఘటను రచయితను కవరపెడతాjయి. ఎయిడ్స్‌తో చనిపోయిన తమ తండా అందగత్తే  ఛమ్కోళిగుర్తుకొచ్చి మనసు వేదనతో మూుగుతుంది. బస్సు దారిలో అక్కడక్కడా ఆగుతూ, కదుతూ ఉంటుది. అవి తీవ్రవాద ప్రభావప్రాంతాు కాబట్టి చెక్‌పోస్టు వద్ద పోలీసు తనఖీు ప్రయాణీకును పరిశీలించడం షరామామూలే! అన్ని తనిఖీు పూర్తిచేసుకుని త్లెవారుజామున వరంగల్‌కు చేరిని బస్సు దిగి మరో బస్సులో స్వగ్రామం చేరుకుంటాడు. అప్పటికి తనకు కబురు అంది మూడురోజు గడుస్తుంది. తమ సాంప్రదాయం ప్రకారం ఆరోజు దినాు. ఇంటికి చేరుకున్నా తనకి ఇంటిముందు బంధువు తండా     వాళ్ళు గుంపు గుంపుగా కూర్చున్నారు. కొంతమంది ఏడుస్తూన్నారు. మరికొందరు కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడ దృశ్యం రచయితకు గందరగోళంగా కనిపిస్తుంది. ఆడవాళ్ళు ముఖా మీద కొంగు కప్పుకొని ఏడుస్తూన్నారు. అతని తల్లి కూడా ఏడుస్తూనే కొడుకుకి ఎదురు వస్తుంది, మూడు రోజుగా దిగమింగుతూ  వచ్చిన భాదను, కన్నీళ్ళను ఒక్కసారిగా తల్లి దగ్గర వ్యక్తపరుస్తాడు. కొద్దిసేపటి తర్వాత సోయి తెచ్చుకొని చూస్తే మేనత్త ఫోటో ఉండాల్సిన చోట, మేనత్త సజీవంగా ఉంటుంది. విషయం అర్థంకాని మేనత్త దిగ్భ్రాంతి చెంది అతడి మీద పడి  బావురుమంటుంది. అసలేం జరుగుతుందో అర్థం కాక, బిత్తర పోవడం రచయిత మతవుతుంది. బతికి ఉండగానే తన చావు చేస్తున్నారని బాధ, ఆవేదన అతడి మేనత్తలో అగుపిస్తుంటుంది. అప్పటి వరకు తన వై`ఫైలా ఆవిరించిన  దు:ఖాం అక్కసారిగా ఆవిరై పట్టరాని కోపంతో ఎదురుగా కనిపించిన  బావను నొటికొచ్చిన విధంగా తిట్టి, అసు విషయం అడుగుతాడు. దానికి అతను చాలా సహజంగా మొహం పెట్టి ఏమి లేదు. మామీ నిన్న గొడ్లను మేతకు తోుకుపోతున్నప్పుడు కాక్లా’ (కాకి) వచ్చి నెత్తి మీద తన్ని పోయిందట’’ అది కీడు అనిఅది పోవాంటే ఆమె చనిపోయిందని అందరికి కబురు పంపి, చావుతంతు చేస్తే పోతుంది. ఇందుకే ఇదంతా! అన్నాడు. ఇది విన్న రచయితకు విపరీతంగా కోపం వచ్చి అక్కడున్న వాళ్ళందర్నీ ఆవేశంగా తిట్టేస్తాడు. వాళ్ళకు అధినమ్మకం ఆయనకు మూఢనమ్మకంగా అనిపించింది. వారికి అన్ని విషయాు చెప్పానుకుంటాడు. కాని ఎవ్వరూ వినే పరిస్థితిలో లేరు. వాళ్ళ దృష్టిలో అతని ఆలోచన పరమతప్పు. ఆ క్షణంలో చిన్నతనంలో తనకు జరిగిన ఇదే అనుభవం  గుర్తుకు వస్తుంది. పద్నాుగేళ్ళ వయస్సులో రచయిత పశువును కాస్తుండగా పుండ్లతో ఉన్న పశువు మీద వాలిన కాకును రాయితో కొడతాడు. పైకి గాలిలోకి లేచిన కాకులో ఒకటి రచయిత తను తన్నిపోయిన  విషయాన్ని తండ్రితో చెబితే, తండ్రి కీడు అని నమ్మి, అయ్యగారు దగ్గరికి వెళ్ళి నివారణ మార్గం అడగ్గా అతడు తొమ్మిది రోజు పాటు ఏడుసార్లు ఆంజనేయస్వామికి పూజు చేయమని సహా ఇస్తాడు. రచయిత అలాగే చేస్తాడు. కానీ రోజు ప్రాత:కాము వేళ చ్లని నీళ్ళతో స్నానం చేయడం వ్ల జుబు, జ్వరంతో దవఖానా చూట్టూ తిరిగిన సంగతున్నీ  యాదికివస్తాయి అతడికి. అంతలో తమ జాతీ వాళ్ళు మాత్రమే ఇష్టంగా తయారు చేసే సొలాయి తింటూ కాక్షేపం చేస్తుండగా తన మిత్రుడు శ్రీను వద్ద నుండి ఫోన్‌ వస్తుంది. తన మేనత్త బ్రతికే ఉందని చెప్పడం శ్రీను నవ్వడంతో కథ ముగుతుంది.

కథా విశ్లేషణ: కాక్లా కథ ఇతివృత్తం ంబాడీ మూఢనమ్మకానికి పరాకాష్ట. బహుశ ఇటువంటి మూఢనమ్మకం మనకు మళ్ళీ ఏ గిరిజన తెగలో కూడా కన్పించదు.

ఆదివాసీ గురించి సాదారణీకరించిన కవిత్వం రాయవచ్చునేమో గాని కథ ఇతివృత్తాు తీసుకోవడం కథకుకి కుదరదు. నిర్దిష్ట అంశం తీసుకోవడం కథకునికి అనివార్యం. అలాగే వీరి యాస, భాష, మాండలిక  పదజాం తప్పనిసరి, అలాకాని పక్షంలో ఈ కథ జవజీవాు లేనిదవుతుంది.  అందుకే గిరిజన జీవితంలోంచి సహజంగా తీసుకునే ఇతివృత్తానికి  అంశానికి ఒక ప్రయోజనం క్ష్యం ఉంటుంది. ఈ విధమైన సాధారణ లక్షణాన్నీ కాక్లాకథలో కన్పిస్తాయి. కథకుడు అదే కమ్యూనిటికి చెందిన వాడు కావడం చేత కథను సానుభూతితో కాకుండా అనుభూతితో వ్రాసారు. ంబాడా తెగలోని అనాదిగా వస్తున్న మూఢనమ్మకం. రచయిత కేంద్రంగా కథా నైపుణ్యం జోడిరచబడి ఉత్కంఠ భరితంగా సాగిన కథ. సందర్భోచితంగా బంజారా భాషా పదాు వాడినప్పటికీ తొగు పదాు కూడా జోడిరచడం వన పాఠకుకు అసౌకర్యం కగకుండా వ్రాసారు. కథ శీర్షిక కాక్లాఅని పెట్టడంలో ఏంటి కాక్లాఅనే ప్రశ్నను పాఠకునిలో రేకెత్తిస్తాడు.

కాక్లాకథ రాయసీమలో ప్రారంభమై ఆంధ్రమీదుగా తెంగాణా ప్రాంతానికి చేరే నేపథ్యంలో ఆయా ప్రాంతా తీరుతెన్నును కొన్ని సంఘటన రూపంలో చూపించే ప్రయత్నం చేశాడు. రచయిత బస్సులో ప్రయాణిస్తున్న సందర్భంలో సమరసింహారెడ్డి సినిమా నడుస్తుంటుంది. బస్సులో సీమ బిడ్డు అంత ఆసక్తిగా చూడటం లేదు. కానీ సీమేతరు మాత్రం ఎంజాయ్‌ చేస్తున్నారు’. అంటూ తెలియజేస్తారు. ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడంలోని ముఖ్య ఉద్ధేశ్యం, రచయిత ఆ ప్రాంతంలోనే                                 15 సంవత్సరాుగా నివసిస్తున్న కారణంచేత ప్యాక్సనిజం పట్ల స్థానిక ప్రజకు గ అభిప్రాయాన్ని, వారి మనస్తత్వాన్ని ఎరిగినవాడు కావడం చేత, తమను సినిమాలో ఆ విధంగా (ప్యాక్సనిస్టుగా) ప్రోజెక్టు చేయడం  నచ్చనందున వారు ఎవ్వరును సినిమాను చూడడం లేదు, అనే విషయాన్ని పాఠకు  ముందుంచుతారు. స్థానికేతయి దాన్ని హిరో ఇజంగా తీసుకొని  చూస్తూ  ఆనందిస్తుంటారు. అందుకే ఎదైనా అనుభవం మీదగాని తెలిసిరాదంటారుపెద్దవాళ్ళు. స్వయంగా అనుభవించేవారికిని, చూసేవారికిని మధ్యగ వ్యత్యాసం ఇదే. కథలో మరొక ముఖ్యమైన అంశం అంబాడీ ఛమ్మోళి. తండాలో పంటు సరిగ్గా పండక, పండిన పంటకు గిట్టుబాటు ధర భించకపోవడం చేసిన అప్పు తీర్చుకునే ప్రయత్నంలో పట్టణాకు వసు వెళుతున్నారు. అక్కడ ఇండ్లలో పనిమనిషిగా, భవన నిర్మాణ కూలిుగా, హాటల్లో పనివాళ్ళుగా ఇంకా ఇతరాత్ర  పను చేసుకుంటూ బతుకు ఎళ్ళదీసుకుంటున్నారు. ఈ క్రమంలో కొంతమంది అమ్మాయిు, స్త్రీు పట్టణ మాయగాళ్ళ చేతిలో మోసపోయి వ్యభిచార కూపంలో నెట్టవేయబడుతున్నారు. ఆ తర్వాత వివిధ రకా రోగాతో బాధపడుతూ వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేక చనిపోతున్నారు. అటువంటి వీరి జీవితాకు నిదర్శనమే ఈ కథలోని చమ్మోళి పాత్ర. ఆధునిక  జీవనానికి ఆకర్షింపబడి డబ్బు సంపాదించానే తాపత్రయంతో ంబాడీ తెగు తమ ఉనికినే కోల్పోతున్నారనే విషయాన్ని గ్రహించలేకపోతున్నారని, తన జాతి మీద మమకారంతో ఆవేదనను  ఆందోళనను వ్యక్తపరుస్తాడు రచయిత.

కథలోని ప్రధాన వస్తువును పరిశీలించినట్లయితే సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా                   దూసుకెళ్తున్నా  నేటికాంలో ంబాడీు ఆధునిక పొకడను అనుసరిస్తూనే తమ మూలా భావాను అలాగే కొనసాగించడం గమనార్హం. కాకి మనిషి తమీద కొట్టిపోతే అది ఘోరమైన అపచారంగా భావించి చుట్టాకు బంధువుకు ఆ మనిషి చచ్చిపోయినాడని కబురు పంపిస్తారు. అవతలి వాళ్ళు ఎంతముఖ్యమైన పనిలో ఉన్న వదుకొని రావల్సిందే. ఏడుస్తూ మొత్తుకుంటూ  వీరి ఇంటికి చేరుకుంటారు. వచ్చిన వాళ్ళు చనిపోయిన వ్యక్తికి నిర్వహించే కార్యమ్రాన్నీ కాకి కొట్టి పోయిన వ్యక్తి చేస్తారు. జంతువు (యాట)ను బలి ఇచ్చి భాదిత కుటుంబసభ్యుకు వచ్చిన బంధువు భోజనాు పెడతారు. ఈ విధంగా చేసినట్లయితే ఆ వ్యక్తికి, ఇంటికి కలిగిన కీడుతొగిపోతుందని వీరి ప్రగాఢ విశ్వాసం. నమ్మకం. ఆశ్ఛర్యం ఏమంటే చదువుకున్నవారి కుటుంబాల్లోను సైతం పాటించడం, ప్రస్తుతం కూడా ఈ మూఢనమ్మకం అలాగే కొనసాగుతుంది. మహబుబాబాద్‌ జిల్లాలోని అప్పరాస్‌ పల్లిలో రిసెంట్‌గా జరిగింది. ఈ ఒక్క ప్రాంతం అని కాదు ంబాడీు నివసించే అన్నీ ప్రాంతాలో ఈ మూఢనమ్మకాని పాటిస్తునే వున్నారు. ఎవరు చెప్పిన వీరు వినరు. సాంప్రదయాల్లో భాగమైన నమ్మకాు మరీ మూఢనమ్మకాలై ఇబ్బందుకు కారణం కాకూడదు. కాంతో పాటు జాతి ఆలోచన ఆధునిక దృష్టితో ముందుకు సాగాలి, ఈ భావనను రచయిత కాక్లా కథ ద్వారా తెలియజేశాడు. సంస్కృతి సాంప్రదాయా పీఠం మీద ఆధునిక చక్రాతో ఏ జాతి అయినా ముందుకు సాగడం శ్రేయస్కరం. ‘‘మనిషికి నమ్మకం కావాలీ కానీ, అది అనర్థదాయకపు మూఢనమ్మకం కారాదుఅన్న కథారచయిత అభిప్రాయంతో అందరం ఏకీభవించాల్సిందిదే.  ఆధునిక ముసుగులో ముందుకొస్తున్న మూఢనమ్మకాపై  ఆధునికుం అందరూ వైజ్ఞానికి దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దిశగా మన ఆలోచను రచను, సృజను కొనసాగాలి.

మొత్తం మీద రచయిత ఎక్కడా కూడా ఈ  కథలో స్పష్టత, క్లుప్తంగా లేదనే భావనను కలిగించకుండా ఉండడం కోసమే మూడు ప్రాంతాను ఎంచుకున్నట్లు తొస్తుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.