కథామధురం-ఆ‘పాత’కథామృతం-25 శ్రీమతి కొమ్మూరి ఉషారాణి కథ “అభ్యుదయం”

కథామధురం  ఆ‘పాత’ కథామృతం-25 శ్రీమతి కొమ్మూరి ఉషారాణి కథ “అభ్యుదయం”  -డా. సిహెచ్. సుశీల ప్రేమ, కాదల్, ఇష్క్, లవ్ … ఏ పేరుతో పిలిచిన “ప్రేమ” అన్న భావనే మధుర మైనది. యుక్త వయసులో ఉన్నవారు భవిష్యత్తులో తమ ప్రేమ ఎంత అందంగా, ఆహ్లాదకరంగా పరిణమించబోతుందో అని మధురంగా ఊహించుకొని మురిసిపోతారు. వయసు అయిపోయిన వృద్ధులు కూడా ప్రేమ అన్న పదం వినగానే తమ గతాన్ని తలుచుకొని, తమ ప్రేమ కథల్ని, ప్రేమ భావనల్ని జ్ఞప్తికి […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-24 ప్రేమలీల. బి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-24  ప్రేమలీల. బి  -డా. సిహెచ్. సుశీల మధ్యతరగతి జీవితాలను గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా అర్ధం కానిది ఏదో ఉంది అనిపిస్తుంది. మనోవేదనలకి ఒక ఇంచ్ దగ్గరలో, మందహాసాలకి ఒక ఇంచ్ దూరంలో ఉంటాయి వారి జీవితాలు. కింది తరగతికి దిగజారలేక, పై తరగతికి ఎగరలేక, గొప్పవారి హంగూ ఆర్భాటాలు చూసి నిట్టూర్పులు విడుస్తూ లోలోపల ముడుచుకుపోతూ వుంటారు. ఉన్నదానితో తృప్తి పడలేరు, లేనిదాన్ని అందుకోలేరు. దాని వల్ల సతమతమై పోతూంటారు. […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-23 నందగిరి ఇందిరాదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-23 నందగిరి ఇందిరాదేవి  -డా. సిహెచ్. సుశీల ఆడపిల్లలు బడికి వెళ్ళి చదువుకునే సంప్రదాయం లేని రోజుల్లో, కనీసం అక్షర జ్ఞానం లేని రోజుల్లో కూడా వారు ఇంట్లో అమ్మమ్మలు నానమ్మల ద్వారా విని నేర్చుకున్న పాటల్ని పాడుకునే వారు. శ్రామిక స్త్రీలు కూడా పొలం పనుల్లో వరినాట్లు లోనో, కలుపు తీస్తూనో, శ్రమ తెలియకుండా, అలుపు రాకుండా పాటలు పాడుకునేవారు. దంపుళ్ళ పాటలు, తిరగలి పాటలు, కవ్వం పాటలు నుండి పెళ్ళిసంబరాలకి […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-22 కల్యాణి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-22 కల్యాణి  -డా. సిహెచ్. సుశీల ఇంటి నీడలో గురి చూసి పాడే పాట (1990), నీలిమేఘాలు (1993), ముద్ర (2001), అపరాజిత ( 2022) వంటి స్త్రీవాద కవితా సంకలనాల్లో స్త్రీల వైయక్తిక, సామాజిక అసమానతలను, కౌటుంబిక వేధింపులను కవయిత్రులు రాసిన కవితలు వచ్చాయి, సంచలనాలు సృష్టించాయి. ఇంకా ఎందరో కవయిత్రులు రాసిన కవితా సంకలనాలు వెలువడ్డాయి. రచయిత్రులు స్త్రీల ఆవేదనలను వ్యక్తీకరిస్తూ కథలు, నవలలు రాస్తున్నారు. ఆలోచింపజేస్తున్నారు. అనేక సమస్యల్లో […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-21 శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-21  శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ  -డా. సిహెచ్. సుశీల “A phobia is an overwhelming and debilitating fear of an object, place, situation, feeling or animal ” ఫోబియా అనేది ఒక నిర్దిష్ట వస్తువు, పరిస్థితి లేదా కార్యాచరణ పై ‘నియంత్రించ లేని అహేతుకమైన’ భయం. నిజానికి కొందరికి ఈ భయం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క మూలాన్ని నివారించటం ఒకటే మార్గం. లేకుంటే ఒక్కొక్కసారి […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-20 శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-20 శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం  -డా. సిహెచ్. సుశీల ” అనుమానాస్పదమైన జీవితం ఎప్పుడూ సుఖవంతం కాదు నిష్కలంకమైన హృదయాలు కలవటానికి అవకాశం ఉంటుంది కానీ పవిత్రత ఏమాత్రం లోపించిన హృదయాలు విడిపోతాయి దాంపత్య జీవితం సందేహాస్పదమైన దృష్టిలతో అనుమానం తో కూడిన అడుగులతో నడవలేదు”           నిఖార్సైన ఒకలాంటి ‘స్టేట్ మెంట్’ తో ప్రారంభమైన “ఒడిదుడుకులు ” అనే ఈ కథ శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం 1951, […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-19 శ్రీమతి పాకల చంద్రకాంతామణి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-19 శ్రీమతి పాకల చంద్రకాంతామణి  -డా. సిహెచ్. సుశీల ఆ నాటి రచయిత్రులు కాలక్షేపం కోసం కథలు రాయలేదని గతంలో చెప్పు కున్నాం. తన చుట్టూ ఉన్న సమాజంలోని స్త్రీలలో చైతన్యం కలిగించడం వారి ప్రధాన ధ్యేయం. పురుషుల మనస్తత్వం, ప్రవర్తనలో మార్పును కూడా వారు ఆశించారు. అయితే ఉపన్యాసం లాగానో, ఉపదేశం లాగానో, కేవలం పత్రికలో పేరు చూసుకోవడానికో, పేరు ప్రఖ్యాతులు పొందాలన్న తపనతోనో రాయలేదని సూక్ష్మంగా పరిశీలిస్తే తెలుస్తుంది. అలాయైతే […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-18 ఆచంట కొండమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-18 “శ్యామల” – ఆచంట కొండమ్మ  -డా. సిహెచ్. సుశీల 1935 గృహలక్ష్మి పత్రిక జూన్ నెలలో ప్రచురింపబడిన ఆచంట కొండమ్మ రచించిన ” శ్యామల” కథ ఒక ‘ట్రయాంగిల్ లవ్ స్టొరీ ‘. ఆ రోజుల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఒక ఆశ్చర్యం. అదీ ఒక రచయిత్రి రాయడం అంటే సంచలనమే. ఆడపిల్లలు కాలేజీ చదువుల వరకు రావడం, పొరుగూరుకి వెళ్ళి చదవడం, అక్కడ ‘ప్రేమ’ చిగురించడం అనే కథాంశం […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-17 శ్రీమతి అలివేలు మంగతాయారు

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-17 ” పరివర్తనము” -శ్రీమతి అలివేలు మంగతాయారు  -డా. సిహెచ్. సుశీల సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు పరదేవతను తన్మయత్వంతో కీర్తించారు. భక్తి తో అర్చించారు.  ఆ “సౌందర్యం” కేవలం శారీరక సౌందర్యం కాదు. మాతృమూర్తి అన్న భావం. జ్ఞానప్రదాయిని  అన్న భావం. ప్రబంధ కవులు కూడా ప్రబంధ నాయికను నఖశిఖ పర్యంతం వర్ణనలతో నింపివేశారు. ప్రబంధ లక్షణాల్లో ,’అష్టాదశ వర్ణనలు’ ఒకటి. ఇక్కడ ఈ వర్ణనలు కేవలం బాహ్య సౌందర్యమే. తర్వాతి కాలంలో […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-16 పులిపాక బాలాత్రిపురసుందరమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-16 ” పిల్లికి చరలాటము – ఎలుకకు ప్రాణ సంకటము” -పులిపాక బాలాత్రిపురసుందరమ్మ  -డా. సిహెచ్. సుశీల           ad vertere అనే లాటిన్ పదం నుండి ఆంగ్లం లో advertisement అనే పదం వచ్చింది. “ఒక వైపుకి తిరగడం” అని తెలుగు లో అర్ధం. ప్రేక్షకులను తమ వైపుకి తిప్పుకోవడం “ప్రకటన” ప్రధాన లక్షణం, లక్ష్యం. ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ఏదైనా సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-15 ఆచంట సత్యవతమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-15 “గ్రుడ్డిగా నడిస్తే గోతిలో పడడమే” — ఆచంట సత్యవతమ్మ  -డా. సిహెచ్. సుశీల ఆది శంకరాచార్యుల వారు యావద్భారత దేశం పర్యటించి హైందవం, సనాతన ధర్మం సంబంధిత గ్రంథాలను, భాష్యాలను, వ్యాఖ్యానాలు చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. అనేకమంది శిష్యులు వారిననుసరించారు. శంకరాచార్య నాలుగు ప్రముఖ పీఠాలను ఏర్పాటు చేయడమే కాక సన్యాసుల కొరకు వివిధ ప్రాంతాలలో మఠాలను ఏర్పాటు చేసారు. శంకరుల వారి తదనంతరం వారి శిష్య ప్రశిష్య గణాలు […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-14 భాస్కరమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-14 ప్రభావతి – రచయిత్రి “భాస్కరమ్మ”  -డా. సిహెచ్. సుశీల ఆ. భాస్కరమ్మ రచించిన “ప్రభావతి” అనే కథ 1926 ఆగస్టు, భారతి పత్రికలో ప్రచురించబడింది.            కాకినాడ పట్టణంలో శాస్త్రవిజ్ఞానంలోను, సంప్రదాయ, సంపదలలోను, దాతృత్వం లోను యోగ్యుడైన ఒక నియోగ బ్రాహ్మణుడు పెమ్మరాజు గోపాల్రావుగారి సంతానములో మొదటి పుత్రిక లక్ష్మీదేవమ్మ. ఆమెకు పదునారవ ఏట ఒక కుమారుడు పుట్టిన ఆరు నెలలకే భర్త మరణించగా పిల్లవాడిని అల్లారుముద్దుగా […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-13 కొమ్మూరి పద్మావతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-13 కొమ్మూరి పద్మావతీదేవి  -డా. సిహెచ్. సుశీల తెలుగు నాటకరంగంలో పూర్వం స్త్రీ పాత్రలను కూడా పురుషులే ధరించడానికి కారణం నాటకాల్లో నటించడం సంసారపక్షం స్త్రీలకు కూడదన్న బలమైన విశ్వాసం సమాజంలో ఉండడమే. ఈ నాటికీ నాటకాల్లో స్త్రీ పాత్రలు చాలా పరిమిత సంఖ్యలో ఉండడం గమనించవచ్చు. అలాంటి రోజుల్లో నాటక చరిత్రలో ప్రముఖుడు బళ్ళారి రాఘవ తను ప్రముఖ న్యాయవాది అయినా నాటకరంగం పట్ల ప్రత్యేకాభిమానంతో, నిజానికి అదే తన జీవిత […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-12 వేదుల మీనాక్షీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-12 వేదుల మీనాక్షీదేవి  -డా. సిహెచ్. సుశీల తెలుగులో తొలి కథ 1910 లో గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ అన్న ప్రచారం విస్తృతంగా ఉన్నా, స్త్రీవాదులు ప్రత్యేకంగా శ్రద్ధగా పట్టుదలగా చేసిన పరిశోధన వల్ల 1902లో భండారు అచ్చమాంబ గారి ” ధన త్రయోదశి” తొట్టతొలి కథ అని నిర్ధారణ అయింది. 1893 నుండే ఆమె చాలా కథలు రాసినట్టు తెలిసినా 10 మాత్రమే లభ్యమై నాయి. అలాగే అనేక కథలు, […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-11 ఆచంట శారదాదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-11 ఆచంట శారదాదేవి  -డా. సిహెచ్. సుశీల స్త్రీలు కలం పట్టిన నాటి నుండి కూడా ‘ స్త్రీ పురుష సంబంధాలలోని అసమాన తలు’ గురించి అవగాహనతో రాసినట్టే స్పష్టమవుతోంది. భర్త ఎలాంటి వాడైనా అతన్ని భరించడం, పూజించడమే ‘సతీ ధర్మం’ వంటి కథలు కొన్ని వచ్చినా, ‘ స్త్రీ కి మెదడు ఉంటుంది, హృదయం ఉంటుంది, ఆలోచనలు అభిరుచులు ఉంటాయి’ అన్న స్పృహ తో రాసిన కథలే ఎక్కువ. భావుకత, ప్రకృతి […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-10 యల్లాప్రగడ సీతాకుమారి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-10 యల్లాప్రగడ సీతాకుమారి  -డా. సిహెచ్. సుశీల విద్యా, వైజ్ఞానిక రంగాలలో ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రగతి శీల దృక్పథం, దేశభక్తి భావన, విశ్వమానవ సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తోందని వేదికల మీదా, అక్షరాల్లోనూ మాత్రమే కనిపిస్తోందని చెప్పక తప్పదు. కులమూ, మతమూ, ప్రాంతమూ, భాషావైషమ్యా లతో మనుషులు ముక్కలు ముక్కలుగా విడదీయబడడం జరుగుతూనే ఉంది. ఇది అన్యాయమే కాక అనైతికం.            మతం కన్నా మానవత్వం మిన్న. నిజానికి మతం […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-9 భండారు అచ్చమాంబ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-9 భండారు అచ్చమాంబ  -డా. సిహెచ్. సుశీల “నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహమాడుట వలనను భర్తకు దాసి నగుదునా యేమి ?” తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు కథ 1910 లో గురజాడ అప్పారావు రాసిన “దిద్దుబాటు” (ఆంధ్ర భారతి పత్రికలో) అని అత్యధికులు భావించారు. చాలా ప్రక్రియ లకు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ప్రారంభకులు అని తీర్మానం చేయడం వల్లనో, మరే కారణం వల్లనో కానీ […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-8 స్థానాపతి రుక్మిణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-8  -డా. సిహెచ్. సుశీల తెలుగు కథానిక ఉద్భవించి దాదాపు నూట పాతికేళ్ళు అవుతున్న కాలంలో, ఏ ప్రక్రియలోనూ రానంత విస్తృతంగా, విస్తారంగా “కథ” తన ప్రత్యేకతను ప్రతిభను సంతరించుకుంది. ఎందరో కథకులు వివిధ ఇతివృత్తాలలో, సమాజపు పోకడలను, జీవితాలను, జీవన విధానాలను, సమస్యలను బలంగా చిత్రించారు.            కొన్ని వేల మంది కథకులు రకరకాల కథావస్తువులను స్వీకరించి వైవిధ్యభరితంగా చిత్రించారు. కానీ రచయిత్రుల సంఖ్య చాలా తక్కువ. […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-7 ఇల్లిందల సరస్వతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-7  -డా. సిహెచ్. సుశీల ఇల్లిందల సరస్వతీదేవి          15.8.1947 న భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న స్త్రీ పురుషుల త్యాగఫలంగా దేశానికి స్వాతంత్య్రం లభించిన సందర్భంగా సంతోషంతో అనేక కవితలు, కథలు వెల్లువలా పొంగులెత్తాయి.           స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశ సంరక్షణా, దాని కొరకు వచ్చిన సాహిత్యం గురించీ ముఖ్యంగా చెప్పుకోవాలి. స్త్రీల వ్యక్తి స్వాతంత్య్రం, స్త్రీల సాధికారతకై […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-6 సమయమంత్రి రాజ్యలక్ష్మి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-6  -డా. సిహెచ్. సుశీల సమయమంత్రి రాజ్యలక్ష్మి             భారతదేశ స్వాతంత్య్ర సాధనోద్యమంలో స్త్రీలు కూడా చైతన్యవంతంగా పాల్గొనా లని, రాచరికపు పరదాల కాలం తీరిపోయిందని, దేశ స్వాతంత్య్రంతో పాటు స్త్రీ ‘వ్యక్తి స్వాతంత్య్రం’ కూడా అత్యవసరమని గుర్తిస్తూ ఆనాడు విస్తృతంగా వ్యాసాలు, కవితలు, కథలు వచ్చాయి.           సామాజికంగా కౌటుంబికంగా తమకున్న సంకెళ్ళను తెంచుకోవడానికి స్త్రీలు ప్రయత్నించారు. అయితే ‘మితవాద’ ధోరణిలోనే […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-5 సి.హెచ్. వు. రమణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-5  -డా. సిహెచ్. సుశీల సి.హెచ్. వు. రమణమ్మ                    జాతీయోద్యమం, స్త్రీల హక్కులు, కులమత రహిత సమాజ నిర్మాణం వంటి విషయాల పట్ల అవగాహనతో, చైతన్యవంతమైన కథలు రచించిన నాటి రచయిత్రులు – ‘వర్గ పోరాటం ‘ శ్రమ జీవుల నుండి ధనిక వర్గం చేసే దోపిడీ వైపు కూడా దృష్టి సారించారు. ఎందరో కష్టజీవుల శ్రమను తమ బొక్కసంలో దాచుకొనే […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-4 పులవర్తి కమలావతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-4  -డా. సిహెచ్. సుశీల   “ప్రథమ దళితోద్యమ కథా రచయిత్రి*”పులవర్తి కమలావతీదేవి                  1930 లలో స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పురుషులతో ధీటుగా పాల్గొని, జైలు కెళ్ళడం తో పాటు, రాజకీయ వ్యవహారాలలో తీర్మానాలు చేయడం ద్వారా తమ భాగస్వామ్యాన్ని నిరూపించుకున్నారు. అఖిల భారత స్థాయిలో ఎన్నెన్నో మహిళా మహాసభలలో చురుగ్గా పాల్గొన్నారు.              స్త్రీలు చదువుకుంటే ఏ […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ’పాత’కథామృతం-3 దుర్గాబాయి దేశముఖ్

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-3  -డా. సిహెచ్. సుశీల   “ఆంధ్రా మదర్ థెరీసా”దుర్గాబాయమ్మ                  బహుముఖ ప్రజ్ఞాశాలి యైన ” మహిళా రత్నం”, మాతృదేశ విముక్తి ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన “వీర దుర్గ”, విద్యాధికురాలై, న్యాయవాద వృత్తిని స్వీకరించి, న్యాయం కోసం – ముఖ్యంగా మహిళల కోసం పోరాడిన “స్త్రీ మూర్తి”, నిరంతరం సామాజిక సేవా తత్పరురాలై మహిళాభ్యుదయం కొరకు “ఆంధ్ర మహిళా సభ” ను స్థాపించి, ఎందరో […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ’పాత’కథామృతం-2 పొణకా కనకమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-2  -డా. సిహెచ్. సుశీల పొణకా కనకమ్మ కథారచన         ఊయల లూగించే కోమల కరాలేరాజ్యాలు శాసిస్తవితూలిక పట్టే మృదు హస్తాలేశతఘ్నులు విదిలిస్తవిజోలలు బుచ్చే సుకుమారపుచేతులే జయభేరులు మోగిస్తవి              — పొణకా కనకమ్మ           నెచ్చెలి గీత గారి సూచన మేరకు 1950 కి పూర్వం రచయిత్రుల కథలను విశ్లేషించటం ఈ వ్యాసాల ప్రధాన ఉద్దేశ్యం. ఆ […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-1 కనుపర్తి వరలక్ష్మమ్మ కథ “కుటీరలక్ష్మి”

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-1  -డా. సిహెచ్. సుశీల 20 వ శతాబ్దపు మొదటి దశకం లోనే తమ తోటి స్త్రీలను చైతన్య పరచడానికి కవయిత్రులు, రచయిత్రులు సాహిత్య సృజన చేసారు. ఐదారు తరగతుల వరకు చదివి, వివాహం చేసుకొని, కుటుంబ బాధ్యతలలో తలమునకలైన ఇల్లాళ్ళుకూడ కుటుంబంలో, సమాజంలో స్త్రీ పురుష వివక్షతను గుర్తించారు –  ఆలోచించారు – రచనలు చేసారు.               స్త్రీ విద్య ఆవశ్యకత, స్త్రీ స్వేచ్చా స్వాతంత్య్రం […]

Continue Reading
Posted On :

కథామధురం-కె.కె.భాగ్యశ్రీ

కథా మధురం  కె.కె.భాగ్యశ్రీ ‘ఇంటి అల్లుడికీ వుంటుంది – అత్త మామల బాధ్యత’ అని చెప్పిన కథ..అనుసరణీయం !  -ఆర్.దమయంతి ***           ‘వివాహానంతరం అమ్మాయికి అత్తమామల బాధ్యత వున్నట్టే అబ్బాయికి కూడా ఆ నైతిక బాధ్యత తప్పనిసరి, అని మరవకూడదు. ఇది చట్టంగా రూపు దిద్దుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.’ ***           ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ చదువుకుని, ఇద్దరూ సమానంగా సంపాదిస్తున్నవారే! […]

Continue Reading
Posted On :

కథామధురం-నందు కుషినేర్ల

కథా మధురం  నందు కుషినేర్ల ‘ఇది ఒక రచయిత్రి నిజ జీవిత కథాకావ్యం !’  -ఆర్.దమయంతి ***           ఇంటి స్త్రీ విలువ గానీ , ఆమెలో దాగిన కళా తపన కానీ, విద్వత్తు కానీ చాలా మంది మగవాళ్ళకు తెలీదు.  తెలిసినా గుర్తించరు. ఆమె – తల్లి కావొచ్చు. సోదరి కావొచ్చు. లేదా భార్య కావొచ్చు. వారిలో దాగిన కళని వెంటనే గుర్తించి, ప్రోత్స హించి , వెలుగులోకి తీసుకు […]

Continue Reading
Posted On :

కథామధురం-బుద్ధవరపు కామేశ్వరరావు

కథా మధురం  బుద్ధవరపు కామేశ్వరరావు ‘మానసిక ఒత్తిళ్ళకు మందు లేదు. కానీ ఒక విలువైన జపమాల వుంది..’ అని చెప్పిన కథ!  -ఆర్.దమయంతి ***           ‘ఇవాళ నేను – అస్సలు పని ఒత్తిడికి గురి కాకూడదు.’ అని అనుకుంటూ నిద్ర లేవడం తోనే మొదలౌతుంది స్ట్రెస్..’ ఇది చదివితే నవ్వొస్తుంది కానీ, నిజమేమిటంటే – ఈ ఆధునిక యుగంలో ప్రతి మహిళా మానసిక ఒత్తిడికి గురికాక తప్పడంలేదనే చెప్పాలి. కారణం […]

Continue Reading
Posted On :

కథామధురం-శ్రీమతి డి.వి.రమణి

కథా మధురం  శ్రీమతి డి.వి.రమణి ‘జగమంతా దగా చేసినా, చిగురంత ఆశ చూసిన ఓ స్త్రీ కథ!’  -ఆర్.దమయంతి ***           కొంత మంది స్త్రీలు తమ ప్రమేయం లేకుండానే ఒంటరి అగాధపు లోయలోకి తోసేయబడతారు. కారణాలు అనేకం. ఎదిరించలేని పరిస్థితులు, చుట్టూ నెలకొన్న కుటుంబ వాతావరణం కావొచ్చు. ఆ పైన నిరాశ, నిస్పృహలకు లోను కావడం, పోరాడ లేక ఓటమిని అంగీకరిస్తూ విషాదంలో మిగిలి పోవడం జరుగుతూ వుంటుంది. తత్ఫలితంగా […]

Continue Reading
Posted On :

కథామధురం-సావిత్రి రమణారావు

కథా మధురం  సావిత్రి రమణారావు ‘భార్యని పురుగులా చూడటమూ హింసే! మానసిక హింసే..’ – అని చెప్పిన కథ!  -ఆర్.దమయంతి ***           వివాహిత స్త్రీలు నిరాశకి గురి అవడానికి గల ప్రధాన కారణాలలో ప్రధానమైనది  – కుటుంబంలో వారి ఉనికి కి విలువ లేకపోవడం. భర్త చులకన గా చూడటం,  హేళనతో గేలి చేయడం, పదిమందిలో పలచన చేసి మాటలతో అవమానించడం, మాటిమాటికి తూలనాడటం, హీనమైన తిట్లు తిట్టడం.. వంటి […]

Continue Reading
Posted On :

కథామధురం-ఎస్.శ్రీదేవి

కథా మధురం  ఎస్.శ్రీదేవి ‘ప్రేమ అనే పదానికి స్వచ్ఛమైన నిర్వచనంలా నిలిచిన ఓ స్త్రీ కథ’ – గుండెలోతు!  -ఆర్.దమయంతి ‘Goodness in words creates trust, goodness in thinking creates depth, goodness in giving creates love.’ -Laozi. ***           భార్య గత జీవితం లో ఒక ప్రేమ కథ వుందని, అందులో ఆమె పాత్ర ఏమీ లేదని తెలిసినా నమ్మలేని మగ బుద్ధి పోకడలు […]

Continue Reading
Posted On :

కథామధురం – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ

కథా మధురం దర్భా లక్ష్మీ అన్నపూ ర్ణ ‘ప్రతి స్త్రీ తనని తాను గౌరవించుకోవడం నేర్వాలి..’ అని చెప్పిన రచయిత్రి – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారి కథ – ‘మనోరథం ‘ !  -ఆర్.దమయంతి స్త్రీ తనని తాను గౌరవించుకోవడం అంటే తన విలువని వ్యక్తపరచుకోవడం!  కానీ, కొంతమంది మగాళ్ళు  అర్ధం చేసుకోరు.  అర్ధమయ్యాక -మరి కొంతమంది సహించుకోలేరు. ‘ఆఫ్ట్రాల్..నువ్వేమిటీ, నీకు గౌరవమేమిటి? దాన్ని నేను లెక్క చేయడమేమిటీ? అని తేలిక చూపు చూస్తారు. అలా […]

Continue Reading
Posted On :

కథామధురం-డా.లక్ష్మీ రాఘవ

కథా మధురం డా.లక్ష్మీ రాఘవ స్త్రీ శాంతమూర్తి మాత్రమే కాదు, ఉగ్రరూపిణి కూడా! అని నిరూపించిన కథ-     ‘ఆమె ఒక శక్తి !’  -ఆర్.దమయంతి ‘స్త్రీలకు కుటుంబపరంగా దక్కే న్యాయం ఎంత గొప్పదంటే.. ఏ చట్టాలూ, న్యాయ స్థానాలూ చేయలేని  మేలు కంటే కూడా మిన్నయినది.’ *** జీవితం లో ఆడది – మగాడి వల్లే మోసపోతుంది. అతని కారణంగానే  కష్ట పడుతుంది. అన్నివిధాలా నష్టపోతుంది. అయితే అతను భర్తే కానవసరం లేదు. అతను  అన్న […]

Continue Reading
Posted On :