ప్రముఖ అనువాదకులు కల్యాణి నీలారంభం గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(కల్యాణి నీలారంభంగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. 
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

          కల్యాణి నీలారంభం 18-8-1946న జన్మించారు. తల్లిదండ్రులు రామయ్య, శారద (శర్వాణి-ప్రముఖ అనువాదకులు) జన్మస్థలం బెంగళూరు. ప్రస్తుత నివాసం విజయవాడ. స్కూలు చదువు రాజమండ్రి, విజయవాడల్లో, కాలేజి అనకాపల్లి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్రా యూనివర్సిటీలో పూర్తి చేశారు.

          ఇంగ్లీషులో ఎమ్మే చేశాక మొదటి ఉద్యోగం విజయవాడ మేరీ స్టెల్లా కాలేజీలో, తర్వాత కాకినాడ అన్నవరం సత్యవతీదేవి స్త్రీల కళాశాలలో, ఆ తరవాత తాడేపల్లి గూడెం,శ్రీకాకుళం, విశాఖపట్నం, శృంగవరపుకోటలలో పనిచేశారు. 38 ఏళ్ల సర్వీస్ లో ఆఖరి ఎనిమిది సంవత్సరాలు ప్రిన్సిపాల్ గా శృంగవరపుకోట, విశాఖపట్నంలలో పనిచేశారు. 2004 లో విశాఖ మహిళా కళాశాలలో పదవీ విరమణ చేశారు.

          కాలేజీలో చదువుతున్న రోజుల్నుండీ వారి అమ్మగారు శర్వాణిగారు అనువదించిన కథలు, నవలలకు మేలుప్రతి చేస్తూండడంతో సహజంగానే అనువాద ప్రక్రియలో ఆసక్తి కలిగింది వీరికి.

కల్యాణి గారు అనువాదం చేసిన నవలలు:

పునర్జన్మ (మూలం త్రివేణి)
సంఘర్షణ (మూలం త్రివేణి)
చిగురు (మూలం త్రివేణి)
మాధవి (మూలం అనుపమా నిరంజన)
మిథ్య (మూలం బి.యు గీత)

కథానువాదాలు: దాదాపు పదిహేను వరకు

స్వీయ కథలు: కొన్ని

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.