ప్రముఖ కవయిత్రి శిలాలోలిత గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(శిలాలోలితగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

          1958 జూలై 12 న పుట్టిన శిలాలోలిత అసలుపేరు పి.లక్ష్మి. వీరు కవి యాకూబ్ గారి సహచరి. పుట్టింది, పెరిగింది హైదరాబాద్ కు సమీపంలోని శంషాబాద్. తండ్రిగారు కీ.శే. పురిటిపాటి రామిరెడ్డి హిందీ పండిట్ గా హైదరాబాద్ పరిసరాల్లోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడం వల్ల బాల్యమంతా ఇసామియా బజార్, నింబోలి అడ్డ, మలక్ పేటలలో గడిచింది.

తెలుగుసాహిత్యంలో ఎం ఏ, ఎం ఫిల్, పిహెచ్ డి లు తెలుగు విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలలో పూర్తిచేసి తెలుగు అధ్యాపకత్వంలో స్థిరపడి రిటైరయ్యారు.

ప్రచురణలు:
1993 – కవయిత్రుల కవిత్వంలో స్త్రీల మనోభావాలు ( యం.ఫిల్ పరిశోధనా వ్యాసం)
1999 – పంజరాన్నీ నేనే పక్షినీ నేనే (కవిత్వం)
2005 – ఎంతెంత దూరం (కవిత్వం)
2006 – కవయిత్రుల కవితా మార్గం ( పి.హెడ్ డి పరిశోధనా వ్యాసం)
2006 – నారి సారించి (సాహిత్య విమర్శనా వ్యాసం)
2013 – గాజునది (కవిత్వం)
2022 – నేను ఇక్కడి భూమిని (కవిత్వం)
2017- The Inner Courtyard (Prof. Suneetha Rani Translation ; Published Web version in Amazon Books Series)

*****

Leave a Reply

Your email address will not be published.